తాజ్ మహల్ పరిసరాల్లో డ్రోన్లకు చెక్..

డ్రోన్‌ను ఎగరేసిన వ్యక్తిని పట్టించే సాంకేతికత..;

Update: 2025-05-31 12:59 GMT
Click the Play button to listen to article

అద్భుత స్మారక చిహ్నం తాజ్ మహల్ (Taj Mahal) పరిసరాల్లో యాంటీ-డ్రోన్ సిస్టం(Anti drone system) అమల్లోకి తెచ్చినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (తాజ్ సెక్యూరిటీ) సయ్యద్ అరిబ్ అహ్మద్ తెలిపారు. తాజ్ చుట్టూ 500 మీటర్ల లోపు ఈ వ్యవస్థ పనిచేస్తుందని, గగనతలంలోకి ప్రవేశించే ఏ డ్రోన్‌‌ను అయినా ఇది ఆపేస్తుందని చెప్పారు. రేడియో ఫ్రీక్వెన్సీ, GPS సిగ్నల్ జామింగ్ టెక్నాలజీ ఆధారంగా ఇది పనిచేస్తుందన్నారు. డ్రోన్‌ను ఎగరేస్తున్న వ్యక్తిని కూడా ఈ టెక్నాలజీ పట్టిస్తుందని చెప్పారు. వీఐపీల భద్రత, బందోబస్తు కోసం ఉపయోగించే ఈ సాంకేతికను ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పోలీసులు కూడా ఉపయోగిస్తున్నారు. ఇటీవల ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళా, 2024 జనవరిలో నిర్వహించిన అయోధ్యలోని రామాలయంలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్టాపన వేడుకల్లో ఈ టెక్నాలజీని ఉపయోగించారు.

పహల్గామ్ ఊచకోతకు ప్రతీకారంగా మే 7న పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద కేంద్రాలపై భారత సాయుద దళాలు దాడులు నిర్వహించింది. ఆ తర్వాత పాక్ వరుసగా ఫిరంగి దాడులు, క్షిపణులు, డ్రోన్ దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

యునెస్కో గుర్తింపు పొందిన తాజ్ మహల్‌ను సందర్శించేందుకు దేశ, విదేశాల నుంచి సందర్శకులు ఏడాది పొడవునా వస్తుంటారు. అమర ప్రేమకు నిదర్శనంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మునా నది ఒడ్డున ఉన్న అగ్రా నగరంలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముమ్తాజ్ మహల్ జ్ఞాపకార్థం నిర్మించారు. 

Tags:    

Similar News