యశోదా ఆస్పత్రి నుంచి కెసిఆర్ డిశ్చార్జ్ ( ఫోటో గ్యాలరీ)

తుంటి ఎముక శస్త్ర చికిత్స అనంతరం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది సేపటి కిందట యశోదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Update: 2023-12-15 08:22 GMT
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్

మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత  కె. చంద్రశేఖర్ రావు కొద్ది సేపటి కిందట హైదరాబాద్ సోమాజీగూడ యశోద హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు.




 ఆయన ఈ 8 వ తేదీన ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోని బాత్ రూంలో కాలు జారి పడటంతో యశోదా ఆసుపత్రిలో చేర్పించారు. 




అక్కడ ఆయన తుంటి ఎముక రీప్లేస్ మెంట్ సర్జరీ జరిగింది. 

దాదాపు వారం రోజుల పాటు ఆయన ఆసుపత్రిలో ఉన్నారు.



 గాయం నయమయి ఆరోగ్యం కోలుకోవడంతో ఆయన నేడు డిశ్చార్జ్ అయ్యారు.


 ఆసుపత్రి నుంచి నేరుగా ఆయన బంజారా హిల్స్  నందినగర్ లోని తన నివాసానికి చేరుకున్నారు.




ఇంటి దగ్గిర ఆయనకు దిష్టి తీసి స్వాగతం పలికారు. ఆయన పూర్తి గా కోలుకునేందుకు మరొక నెలరోజుల పడుతుందని తెలిసింది.

Tags:    

Similar News