ఒక స్వాప్నికుని అంతర్శోధన "హసిత భాష్పాలు"

ఒక గొప్ప భారతీయ తాత్విక కవి భావకుడు ఈ పుస్తకంలో దృగ్గోఛరం అవుతాడు.

Update: 2025-10-14 06:58 GMT

    ఆయన అత్యున్నత కార్య నిర్వహణ అధికారులకు శ్రీరామ్ సార్, ఆయన ఆధ్యాత్మిక ఉపన్యాసాలు విన్న సామాన్యులకు భగవాన్ శ్రీరామ్ , ఇంకొందరికి జీవితం యొక్క నిమ్నోన్నతాల ఎత్తుపల్లాల పలు పార్శాశాలను తనగైన కోణంలో ఒక స్పష్టమైన శైలితో దృక్పథంతో కార్యాకారణ పూరకంగా నిర్వచించే తాత్విక ఆధ్యాత్మిక బోధకుడు. అన్వేషకుడు. నిరంతర శోధకుడు .ఆరాధకుడు. ఆముష్కికుడుగా దేశ విదేశాలలో మిక్కిలి ప్రభావశీలుడుగా కొనసాగుతుంటారు. ఒక సామాన్య వ్యక్తిలో ఇన్ని అసామాన్య అసాధారణ కోణాలు ప్రతిబింబించడం ఆయన వ్యక్తిత్వ మూర్తిమత్వం మనల్ని ఒక్కింత ఆశ్చర్యానికి లోను చేస్తుంది . ఇది శ్రీరామ్ సార్ గురించి అందరికీ ఉన్న ఒక అంచనా. ఒక ఉజ్జాయింపు.

నాకు మాత్రం ఆయన లో లోన దాగిన ఒక గొప్ప భారతీయ తాత్విక కవి భావకుడు దృగ్గోఛరం అవుతాడు. ఇటీవల ముఖ్యమంత్రి చేతిల మీదుగా ఆవిష్కరించబడిన ఆయన కవిత్వం పుస్తకం "హసిత భాష్పాలు" చదువుతుంటే నాలో నాకు తెలియకుండానే కంప ప్రకంపనలు ఏర్పడినవి. మొత్తానికి మొత్తంగా నన్ను ఒక అవ్యక్త జ్వరపీడుతున్ని భూకంప బాధితుడిని చేసింది. మనిషి సకల వైక్లభ్యాలకు కారణభూతమైన విషయీవిషయలను సమస్యలను సంక్షోభాలను సంక్లిష్టతలను సంఘర్షణలను కదళీపాకంలా ఆధ్యాత్మికతను జోడించి ,తన అద్భుతమైన అర్థవంతమైన భావనా వైశిష్ట్య నైపుణ్యాల సమాహార కవితా పటిమతో 18 ఖండికలుగా ఈ గ్రంథాన్ని రచించాడు. తద్వారా పాఠకుని అంతర్ రుచితసీమలను దగద్దగాయమాన పరిచిన "హసితభాష్పాలు"గా గ్రంథస్తం అయింది . ఈ పొత్తాన్ని కళ్ళు మిరుమిట్లు గొల్పే గ్లేజ్డ్ పేపర్ పైన అర్థవంతమైన బొమ్మలతో అత్యంత సుందరంగా వాక్కులమ్మ ప్రచురణగా తీసుకువచ్చారు.

ఇక్కడ నాకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒకానొక మహా రచయిత సాహిత్యం గురించిన సాహిత్యకారుల గురించిన మాటలు గుర్తుకు వస్తున్నాయి " సాహిత్యం అనేది మానవ ఆత్మకు అత్యంత ఖచ్చితమైన ప్రతిబింబం. రచయిత సత్యం ప్రవక్త మాత్రమే కాకుండా జీవన నిర్మాణ కర్తగా ఉండాలి సాహిత్యం ఉద్దేశ్యం మనిషిని తనను తాను, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకునేలా చేయడమే" అని వివరించాడు.

ఆగస్టు 4 2010 రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీలో గీతాంజలి మొదటి ముద్రణ పొందినది .తర్వాత భారతీయ సాహిత్యములో అంత గొప్ప కావ్యం రాలేదు కానీ 135 సంవత్సరాల తర్వాత శ్రీరామ్ సార్ రాసిన "హసితభాష్పాలు"భారతీయ తాత్విక ఆధ్యాత్మిక మేళవింపులతో అటు కవిత్వం స్థాయిని ఇటు కావ్య స్థాయిని నాలుగు మెట్ల మీద ప్రతిష్టించింది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కానేరదు.

2000-2010 మధ్యకాలంలో భక్తి మార్గం దేశంలో బలంగా ఉండేది అలాంటి సమయంలో ప్రకృతి ఆరాధన ద్వారా దేవున్ని చేరుకోవడానికి రవీంద్రనాథ్ ఈ కావ్యం ద్వారా మార్గం చూపించాడు. ఆ కావ్యంలో మానవున్ని కృంగదీసే నిరాశ నిస్ఫుహలను సకల సృష్టిని ప్రేమ భావంతో అవలోకనం చేసుకొని , తమ యొక్క గొప్పతనాన్ని సూచించే సందేశం ఈ కావ్యం లోని ముఖ్య సారాంశం.

శ్రీరామ్ సార్ కవిత్వం చదివిన ప్రతిసారి కొత్త కొత్త లోతుల వైశాల్యాలను కొత్త వెలుగుల దివ్వెలు మన అంతర్ లోకాలను ఆక్రమిస్తూ తేజోమయం చేస్తుంటాయి. కావ్యం మొదటి ఖండిగ నుండి చివరి ఖండిక వరకు హసిత భాష్పాలు లో మనకు ఎక్కువగా విరోధ భాస అలంకారాలు దర్శనమిచ్చి, మన మీద ప్రత్యేకమైన వినూత్న ముద్రలు వేస్తుంటాయి.

ఈ కవి తన గ్రంథానికి కన్నీరు పేరున 11 పేజీల ముందుమాట రాసుకున్నాడు.అందులో వ్యతిరేకం అనుకునే ప్రతిదీ ఒక్కటే అని సెలవిస్తాడు. మచ్చుకు కన్నీళ్లు చిరునవ్వులు, జనన మరణాలు ,మంచి చెడులు, ఉదయాస్తమయాలు, రాత్రి పగలు పరస్పర వ్యతిరేకాలు కావు. మనం అపార్థం చేసుకునే పరస్పర పర్యాయపదాలు పైకి మాత్రమే కనిపించే వ్యతిరేకార్థాలు. ఒక దాని సమక్షాన్ని ఒకటి ఆనందిస్తాయి. ఒక దాని ఒకటి ఆలింగనం చేసుకుంటాయి. ఒకదానితో ఒకటి కరచాలనం చేసుకుని కలిసిపోయి కరిగిపోతాయి అంటాడు. ఇక చెక్ పడి జీవితం చిక్కుముడి ఓటమి అనుకున్న ప్రతిదాన్ని సునాయాసంగా విప్పి చెప్తాడు. ఈ ఖండికల కవిత్వాన్ని చదువుకుంటూ పోతే తమస్సు నిండిన మన మనః లోగిలిలో దీపం వెలిగించినట్టు కాంతిమయమవుతుంది. శుభ్రపడుతుంది.

పాశ్చత్కవులు జీవన జీవన విమర్శనమే కవిత్వం అన్నారు. మన తెలుగు ఆధునిక కవులు కవిత్వమంటే కదిలించేది పెను నిద్దుర వదిలించేవి అన్నారు .ఇది కవిత్వానికి సంబంధించిన ప్రయోజనాన్ని తెలుపుతుంది.

కావ్య ప్రయోజనాలు ధర్మార్థ కామ మోక్ష ల లోను కళలతో నైపుణ్యాన్ని కీర్తిని ప్రీతిని మన పూర్వ అలంకారికుడు భామహుడు సత్కావ్యం కలిగిస్తుందని చెప్పాడు. మరో పూర్వ సంస్కృత విమర్శకుడు కావ్యం యశస్సు కొరకు ధన సంపాదన కొరకు వ్యవహార జ్ఞానం కొరకు మంగళ హరణం కొరకు మోక్ష సాధన కొరకు పాఠకుడు కళ్ళు మూసుకుంటాడు. ప్రబోధం కొరకు అని వివరిస్తాడు మొత్తం మీద సాహిత్యం సారాంశం లో తెలీందేమంటే సాహిత్యం విశ్వ కావ్య ప్రయోజనం అని దీనినే లోకప్రియత్యాన్ని పొందఢం అన్నారు. విశ్వజనీయత కల్పన కావ్యంలో లోకరీతులు లోకనీతులు మానవ మనస్తత్వం కలగాపులగంగా కలిసి ఉంటాయి. ఇవన్నీ ఆనందంతో పాటు ఉపదేశ కారకాలుగా కూడా ఉంటాయి. ఇవన్నీ కలిగిన శ్రీరాం సార్ ప్రభూ! అంటూ ప్రారంభించిన "హసిత భాష్వాలు" ఇక్కడ ప్రభూ అంటే కృష్ణ భగవానుడు అని నర్మగర్భంగా చెప్తాడు. ప్రాచీన ఆర్వాచీన లాక్షణికులు చెప్పిన కావ్య లక్షణాలని ప్రయోజనాన్ని పునికి పుచ్చుకున్నది. సంతరించుకున్నదని రూడిగా చెప్పవచ్చును. ఈ కావ్యం నుంచి అనేక కళ్లు హృదయం తళుక్కున చెమర్చే అనేక కవితా వాక్యాలను ఎత్తి చూప వచ్చును. ఈ కావ్యాన్ని శ్రీరాంసారే ఇంగ్లీషులోకి అనువాదం చేస్తే చూడాలని ఆకాంక్ష .సవినయ విన్నపము.

"లోన నీలమేఘ శ్యాముడుండగా లేని

ఆకాశం నీలం మనకెందుకు

చింతలు, చితిమంటలు లేవికపై

నవ్వుతూ నవ్విద్దాం విశ్వవేదికపై" అంటూ తన కవిత్వాన్ని ప్రపంచ వ్యాప్తం విస్తృత పరుస్తాడు " కవి

"శరీర మాలిన్యాన్ని దూరం చేసేది నీరు

మనసు మాలిన్యాన్ని కడిగివేసేది కన్నీరు" అంటూ శ్రీరామ్ సార్ తన కవిత్వాన్ని ముగిస్తాడు.

Tags:    

Similar News