కరాచీ లక్ష్యంగా భారత్ దాడులు..
కరాచీ పోర్టుపై కొనసాగుతున్న భారత్ ప్రతీకార దాడి.. ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి మిస్సైల్స్ డ్రోన్లను ప్రయోగించింది భారత ఆర్మీ. జమ్ములో పాకిస్తాన్ డ్రోన్ దాడులకు ధీటుగా సమాధానం ఇస్తున్న భారత సైన్యం..
ఇండియా, పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలో పెరిగిన సైబర్ సెక్యూరిటీ ప్రమాదం. కీలక సూచనలు చేస్తున్న అధికారులు. ఎటువంటి వీడియో, మెసేజ్ లింక్లను ఓపెన్ చేయొద్దంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు.
రంగంలోకి దిగిన భారత నౌకాదళం. పాకిస్తాన్పై ఇండియన్ నేవీ దాడి.
ఇస్లామాబాద్లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నివాసం సమీపంలో భారీ పేలుడు.
యుద్ధం పాక్ ఎంపికే: సెహ్వాగ్
భారత్, పాకిస్థాన్ మధ్య మొదలైన యుద్ధంపై భారత క్రికెటర్ సెహ్వాగ్ స్పందించారు. ‘‘యుద్ధాన్ని పాకిస్థానే ఎంపిక చేసుకుందన్నారు. సైలెంట్గా ఉండే అవకాశం ఉన్నా పాకిస్థాన్ హింసను ఎంచుకుంది. ఉగ్రవాదులను కాపాడుకోవడం కోసం పాకిస్థాన్.. పరిస్థితులను ఉద్రిక్తం చేసుకుంది. భారత బలగాలు సరైన తీరులో బదులిస్తాయి. భారత్ ఇచ్చే బదులును పాకిస్థాన్ ఎప్పటికీ మర్చిపోలేదు’’ అని సెహ్వాగ్ తన పోస్ట్లో పేర్కొన్నారు.
War has been chosen by Pakistan when they had an opportunity to keep quiet.
— Virrender Sehwag (@virendersehwag) May 8, 2025
They have escalated to save it’s terrorist assets, speaks so much about them.
Our forces will reply in the most appropriate manner, a manner Pakistan will never forget.
భారతదేశంలోని పలు నగరాలను లక్ష్యం చేసుకొని.. పాకిస్తాన్ చేస్తున్న అన్ని మిస్సైల్స్ ను విజయవంతంగా కూల్చేస్తున్న ఇండియన్ ఆర్మీ..
భారత్లో పలు విమానాశ్రయాలను మూసివేత
భారత్ - పాక్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్లో పలు విమానాశ్రయాలను మూసివేశారు. మూసివేసిన ఎయిర్పోర్టులివే.. 1. శ్రీనగర్ 2. జమ్మూ 3. లేహ్ 4. చండీగఢ్ 5. అమృత్సర్ 6. లూధియానా 7. పాటియాలా 8. బథిండా 9. హల్వారా 10. పఠాన్కోట్ 11.
భుంటర్ 12. శిమ్లా 13. గగ్గల్ 14. ధర్మశాల 15. కిషన్గఢ్ 16. జైసల్మేర్ 17. జోధ్పూర్ 18. బికానీర్ 19. ముండ్రా 20. జామ్నగర్ 21. రాజ్కోట్ 22. పోర్బందర్ 23. కండ్లా 24. కేశోడ్ 25. భుజ్ 26. గ్వాలియర్ 27. హిందన్. ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.
మే 9, 10 తేదీల్లో జమ్మూకశ్మీర్లోని అన్ని కళాశాలలు, యూనిర్శిటీలను క్లోజ్ చేసి ఉంచుతున్నట్లు ప్రకటించిన అధికారులు.
రంగంలోకి దిగిన ఐఎన్ఎస్ విక్రాంత్.. కరాచీ పోర్ట్ ధ్వంసం.. సార్గోధా, ఫైసలాబాద్లలో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను బాంబులతో పేల్చిన ఇండియన్ ఆర్మీ..
పాక్ జెట్ ఫ్లైట్ కూల్చివేత..
కొద్దిసేపటి క్రితం పాక్ జేఎఫ్ -17 ను కూల్చివేసిన భారత ఆర్మీ - జై సల్మేర్లో పాక్ పైలట్ అదుపులోకి తీసుకున్న సైనిక బలగాలు..