ఇప్పుడు వీస్తున్న గాలి పేరు బి.సి. వాదం

నివురుగప్పిన నిప్పులా ఉన్న వెనుకబడిన వర్గాలు త్వరలో తమ హక్కుల సాధన కోసం ప్రభుత్వం పై ముందు ఎప్పుడూ లేనంత ఒత్తిడి పెంచనున్నాయి.;

Update: 2025-05-13 12:36 GMT

అధికార పార్టీ సామాజిక కులగణన నిర్వహించిన తర్వాత ఎవరి శాతం ఎంతో తెలిసిపోయింది. ఆయా కులాలకు ఎవరి వాటా ఎంతనో అవగతం అయినది.ఈ గాలి త్వరలో రాజకీయ తూఫానుగా మారే సంకేతాలను ఇస్తున్నది. వెనుకబడిన కులాలకు ఒక ఆశాకిరణంలా దృశ్యీకరిస్తున్నది. పైకి పార్టీ పేరు ఏది ఏమైనప్పటికీ' బడితె ఉన్నోడిదే బర్రె' అన్నట్టు అన్ని పార్టీలు తమ తమ కులాల ప్రాతిపదికన టికెట్లు సీట్లు ఇస్తున్నాయి. పైకి సామాజిక సమతూకం అంటూనే తీరా చూస్తే అధికార వర్గానికి అగ్ర తాంబూలం ఇస్తున్నారు . అంతవరకు నాయకులు చెప్పిన మాట్లాడిన మాటలన్నీ ఎన్నికల సమయం వచ్చాక ప్రాంతీయ, జాతీయ పార్టీల భేదం లేకుండా అన్ని పార్టీలు ఒకే తాను ముక్కలుగా వీరికి మొండి చేయి చూపిస్తున్నాయి. చిట్ట చివరికి కులం డబ్బు దర్పం ఉన్నవారే ఆయా పార్టీల అధినాయకుల మీద ఒత్తిడి పెట్టి టికెట్లు సంపాదిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా మంచికో చెడ్డకో ఇష్టం ఉన్నా లేకున్నా ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు కక్క లేక మింగలేక తెలంగాణలో కులగణనకు శ్రీకారం చుట్టి పూర్తి చేసింది. ఈ గణన అనంతరం తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలలోని వెనుకబడిన వర్గాలలో అంతర్గతంగా ఒక చర్చకు దారి తీసింది. బీ.సి.వాదం లేక నినాదం రాజకీయ పార్టీలలో క్రమక్రమంగా బహుజనులను ఏకం చేసే విధంగా, సామాజిక విప్లవాత్మక మార్పు దిశగా మార్చుకోనున్నది. ముందు ముందు అధికారం కోసం వాటా డిమాండ్ వచ్చే అవకాశాలకైతే మార్గం సుగమమవుతున్నది.

ఏ రాష్ట్రంలోనైనా పార్టీలు ప్రభుత్వంలోకి వచ్చిన వర్గాల వారికే పెద్దపీట వేస్తూ,వెనుకబడిన వర్గాలను విస్మరిస్తున్నది. అయినప్పటికీ ఓపికతో వీరు నాయకత్వాన్ని పల్లెత్తు మాట్లాడడం లేదు. గత పదేళ్లలో ఉన్న ప్రభుత్వం వారి వర్గాలకే అనేక ప్రభుత్వ పథకాల ద్వారా మేళ్లు చేయడంతో పాటు పదవులు కట్టబెట్టారు.

గత ప్రభుత్వం పట్ల ప్రజలు ముఖం మొత్తి అసంతృప్తితో మరో వర్గాన్ని అధికరంలోకి తెస్తే వీరు కూడా ఏమాత్రం భిన్నంగా వైవిధ్యంగా ప్రవర్తించలేకపోవడం శోచనీయం. ఇది అత్యంత గర్హహనీయమైన విషయం. మైనారిటీ అగ్ర వర్గాల వారు మెజారిటీ వెనుకబడిన కులాలపై సాచివేత ధోరణి ప్రదర్శించడం పరిపాటి అయిపోయింది. ఈ విధానాలు ఇలాగే కొనసాగితే త్వరలో బహుజనులు అంతా ఏకమై ప్రభుత్వాలపై తమ వాటా కోసం ఒత్తిడి పెట్టాల్సి వస్తుంది. ప్రజాస్వామ్య చట్రంలో అంతకుమించి మరో మార్గం ఉండదు .

ఇటీవల దేశంలో ఏర్పడిన కొన్ని తీవ్ర పరిణామాల నేపద్యంలో ప్రాంతీయ, జాతీయస్థాయిలలో ఆయా పార్టీల మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవలసిన అనివార్య పరిస్థితులు ఏర్పడివాయి . ఈ వాతావరణం మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ దేశమంతా చేసిన పాదయాత్ర మూలంగా ప్రధానంగా సామాజిక కులగణనను రాజకీయ పార్టీల ఎజెండా మీదికి బలవంతంగా నైనా ముందుకు తెచ్చింది.

దీని ప్రభావం గత సంవత్సరం జరిగిన పార్లమెంటు ఎన్నికల ఫలితాల పైన చూపింది. అలాగే తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కాంగ్రెస్ పార్టీ తోడ్పడిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడి వాక్చాతుర్యంపై విశ్వాసంతో, ఇచ్చిన హామీలు, వాగ్దానాలు గత పదేళ్ల ప్రభుత్వ పాలనలో జరిగిన అవినీతి అక్రమాల బంధుప్రీతి తదితర విషయాలపైన విచారణ జరుపనున్న నివేదికల ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటాం ఎన్నికల ప్రచారంలో అన్నారు. దీనితో ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారు. తత్ ఫలితంగా తెలంగాణ ప్రజలు ఆశించిన విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అందులో ప్రధాన భాగమైన సామాజిక కులగణనను చేపట్టి పూర్తి చేసింది. మరోవైపు ఎస్సీ వర్గీకరణ బిల్లును శాసనసభలో ఆమోదించింది. దేశంలోనే ఎస్సీ వర్గీకరణను చట్టం ద్వారా అమలు చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం ఖ్యాతిని ఆర్జించింది.

తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన ప్రధాన వాగ్దానం మేరకు సామాజిక కులగణన చేపట్టి విజయవంతంగా పూర్తి చేసింది. మరియు ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులు అమలు చేస్తూ జారీ చేయడం జరిగింది. స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి అధికారికంగా సంకల్పించింది. వెనుకబడిన వర్గాలకు స్థానిక సంస్థలలో ఇచ్చింది. ఇది ఇక్కడితో ఆగిపోకుండా భవిష్యత్తులో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు చట్టసభల్లో కల్చించాలనే ఉద్యమ రూపు తీసుకోనుంది. ఇన్ని నాళ్ళు నివురు కప్పిన నిప్పులా ఉన్న వెనుకబడిన వర్గాలు త్వరలో తమ హక్కుల సాధన కోసం ప్రభుత్వం పై ముందు ఎప్పుడూ లేనంత ఒత్తిడి పెంచనున్నాయి.

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం వేసిన రెండు ముందడుగుల ప్రభావం పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ పైన పడింది. అందుకు అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసి గవర్నర్ చేత ఆర్డినెన్స్ జారీ చేయించి ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన విషయం తెలిసినదే. ఇకపోతే సామాజిక కులగణన తమ రాష్ట్రంలో డిమాండ్ రూపం తీసుకోకముందే కేంద్ర ప్రభుత్వం ద్వారా దేశ జనాభా గణనతో పాటు కుల గణన చేపట్టడానికి దోహదం చేసిందని చెప్పవచ్చును. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి బోలెడు రాజకీయ అనుభవం చతురత నైపుణ్యం కలిగినవాడు. సకాలంలో రాజకీయ సుదర్శన చక్రం తిప్పడంలో కడు నేర్పరి కాబట్టి కానున్న పనిని గంధర్వులు చేసేలా చూడగలిగాడు.

Tags:    

Similar News