కుప్పకూలిన బోయింగ్ 787 డ్రీమ్లైనర్ ఫ్లైట్..
అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం..;
అహ్మదాబాద్ (Ahmedabad) సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఎయిర్ ఇండియా (Air India flight) ప్యాసింజర్ విమానం (Plane crash) కూలిపోయింది. గురువారం మధ్యాహ్నం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఎయిర్పోర్టుకు సమీపంలోని మేఘనినగర్ ప్రాంతంలో క్రాష్ అయిపోయింది. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఈ విమానంలో 242 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం.
Air India confirms that flight AI171, from Ahmedabad to London Gatwick, was involved in an accident today after take-off.
— Air India (@airindia) June 12, 2025
The flight, which departed from Ahmedabad at 1338 hrs, was carrying 242 passengers and crew members on board the Boeing 787-8 aircraft. Of these, 169 are…
#WATCH | Gujarat | Row of ambulances arrive at the Civil Hospital following the Air India plane crash in Ahmedabad pic.twitter.com/l0C2phj3GY
— ANI (@ANI) June 12, 2025
మరికొన్ని వివరాలు..
ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోంది: అహ్మదాబాద్ నుంచి లండన్కు
విమానం: ఎయిర్ ఇండియా విమానం (AI-171)
విమానం రకం: బోయింగ్ 787 డ్రీమ్లైనర్
రిజిస్ట్రేషన్: VT-ANB
విమానంలో ఉన్నవారు: 242 (230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది)
కమాండర్: కెప్టెన్ సుమీత్ సబర్వాల్ (లైన్ ట్రైనింగ్ కెప్టెన్)
అనుభవం: 8,200 గంటలు
మొదటి అధికారి: క్లైవ్ కుందర్
అనుభవం: 1,100 గంటలు
ప్రమాదం జరిగిన ప్రదేశం: సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని మేఘనినగర్ ప్రాంతంలో
విమానం బయలుదేరిన సమయం: 13:39 IST (08:09 UTC)
ఘటన ఎలా జరిగింది: టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోయింది. మేడే (MAYDAY) ప్రమాద కాల్ ATCకి వచ్చింది. ఆ తర్వాత ఎటువంటి సమాచారం అందలేదు.
ప్రస్తుత స్థితి: అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేస్తున్నారు.
ప్రాణనష్టం: తెలియాల్సి ఉంది.
దర్యాప్తు: విమానాశ్రయ అధికారులు అంతర్గత విచారణ ప్రారంభించారు. ఈ దుర్ఘటనను DGCA (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) అంగీకరించింది. దర్యాప్తు కూడా మొదలుపెట్టింది.