ఎయిర్ ఇండియా (Air India flight) ప్యాసింజర్ విమానం (Plane crash) కూలిపోయింది. అహ్మదాబాద్ (Ahmedabad) విమానాశ్రయానికి సమీపంలోని మేఘనినగర్లో ఈ ప్రమాదం జరిగింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ దుర్ఘటన జరిగింది. విమానంలో 230 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. కూలిపోయిన వెంటనే దట్టమైన పొగలు వ్యాపించాయి. పోలీసులు, పరిపాలన అధికారులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నాయి.