‘మన్ కీ బాత్’‌లో మోదీ వాటి గురించి ఎందుకు మాట్లాడరు?

మోదీ ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో ప్రజల ముఖ్యమైన సమస్యలను ప్రస్తావించడంలో ప్రధాని నరేంద్ర మోదీ విఫలమయ్యారని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు.

Update: 2024-06-30 12:39 GMT

మోదీ ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో ప్రజల ముఖ్యమైన సమస్యలను ప్రస్తావించడంలో ప్రధాని నరేంద్ర మోదీ విఫలమయ్యారని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు.

మోదీ మూడో సారి అధికార పగ్గాలు చేపట్టాక మొదటిసారి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. అయితే నీట్, రైల్వే ప్రమాదం, ఢిల్లీ విమానాశ్రయంలో టెర్మినల్ పైకప్పు కూలడం గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

"ఢిల్లీ విమానాశ్రయంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఆయన మాట్లాడలేదు. ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన ఏ అంశంపైనా ప్రధాని మాట్లాడలేదు. ఎజెండా మార్చడమే ఆయన పద్ధతి. అందరూ నీట్, స్కామ్‌ల గురించి మాట్లాడుతున్నారు. కాని ఆయన మాత్రం మాట్లాడరు" అని ఆరోపించారు.

Tags:    

Similar News