‘శశి థరూర్’ పనామా ప్రకటనతో కాంగ్రెస్ చిక్కుల్లో పడిందా?

2016 కి ముందు భారత్, ఎల్ఓసీ దాటలేదనే వ్యాఖ్యలను ఖండించిన పవన్ ఖేరా;

Update: 2025-05-29 07:40 GMT
పనామా లో ఉన్న భారత ప్రతినిధి బృందంతో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్

ఆపరేషన్ సిందూర్ ను, ప్రధాని మోదీని విదేశీ వేదికలలో కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ బహిరంగంగా సమర్థించడం గ్రాంట్ ఓల్డ్ పార్టీ నాయకత్వానికి, ఆయనకి మధ్య అగాధం పెరిగినట్లు అయింది.

ఇదే సమయంలో శశిథరూర్ కు మాత్రం బీజేపీ ఎకో సిస్టమ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగి ఉంటుంది. పనామాలో ప్రవాస భారతీయులతో జరిగిన సంభాషణలో థరూర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉన్నాయి.

భారత్ ప్రతిస్పందన..
ప్రవాస భారతీయులతో జరిగిన సమావేశంలో శశిథరూర్ మాట్లాడుతూ.. ‘‘ఇటీవల సంవత్సరాలలో దేశంలో వచ్చిన మార్పు ఏంటంటే... ఉగ్రవాదులు కూడా తాము చెల్లించాల్సిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని గ్రహించారు.
2016 సెప్టెంబర్ లో ఉరి దాడి తరువాత భారత్ మొదటిసారిగా ఎల్ఓసీ దాటి వెళ్లి సర్జికల్ స్టైక్ నిర్వహించింది. 2019 పుల్వామా ఉగ్రవాద దాడి తరువాత మేము నియంత్రణ రేఖ దాటడమే కాదు, అంతర్జాతీయ సరిహద్దును కూడా దాటి ఉగ్రవాద ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేశాము.
ఈ సారి ఆపరేషన్ సిందూర్ మేము రెండింటిని దాటి వెళ్లాము. పాకిస్తాన్ హర్ట్ ల్యాండ్ అయిన పంజాబ్ పైనే మేము దాడి చేశాము’’ అని దౌత్యవేత్త నుంచి రాజకీయ నేతగా మారిన థరూర్ అన్నారు.
ప్రస్తుతం థరూర్ విదేశాల్లో అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, భారత్ ప్రపంచవ్యాప్తంగా తన విధానాలను వివరిస్తోంది. ఈ బృందం మే 23న భారత్ నుంచి బయల్దేరి, అమెరికాలో ఆగారు. తరువాత ఈ బృందం గయానాను సందర్శించింది. ఇప్పుడు పనామాలో ఉంది.
ఈ బృందంలో ఎంపీ శాంభవి చౌదరి, జేఎంఎం ఎంపీ సర్పరాజ్ అహ్మాద్, టీడీపీ ఎంపీ జీఎం హరీష్ బాలయోగి, బీజేపీ ఎంపీ లు శశాంక్ మణి త్రిపాఠి, తేజస్వీ సూర్య, భువనేశ్వర్ కలిత, శివసేన ఎంపీ మిలింద్ దేవరా, మాజీ రాయబారీ తరంజిత్ సింగ్ సంధు ఉన్నారు. అమెరికాలో మరో రౌండ్ చర్చల కోసం అమెరికా వెళ్లే ముందు బ్రెజిల్, కొలంబియాలను సైతం సందర్శించనున్నారు.
పార్టీ ఎంపిక చేసిన వ్యక్తి కాదు..
కాంగ్రెస్ నాయకత్వం విదేశాలకు వెళ్లే బృందాలలో థరూర్ పేరు సూచించలేదు. దేశం నుంచి విదేశాలకు వెళ్లే ఏడు బృందాలకు పలు పార్టీలు వివిధ నాయకుల పేర్లను సూచించాయి.
అయితే కేంద్రం కొన్ని పేర్లను నేరుగా తీసుకుంది. అందులో భాగంగా శశిథరూర్ పేరును ప్రభుత్వం ప్రస్తావించడంతో ఆ పార్టీలో తుఫాన్ కు దారితీసింది. లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పేర్లను ప్రభుత్వం పక్కన పెట్టింది.
కేంద్రం తీసుకున్న చర్య పార్టీలో వివాదానికి దారితీసింది. ప్రభుత్వం దూకుడు ముందు కాంగ్రెస్ కూడా రాజీపడింది. ప్రభుత్వ ప్రతినిధి బృందానికి దేశ దౌత్య కథనాన్ని ప్రచారం చేయాల్సి ఉంటుందని, మోదీ పాలనా విధానాన్ని సమర్థించాల్సి ఉంటుందని అంగీకరించడం ప్రారంభించింది.
అయితే విదేశాలలో ఉన్న థరూర్ చేసిన పనామా ప్రకటన పార్టీలో కొత్త వివాదాలను కేంద్రమైంది. ‘‘గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాలు పాకిస్తాన్ పై నిర్ణయాత్మకంగా వ్యవహరించలేదని, అది భారత్ పైకి ఉగ్రవాదాన్ని ఎగదోసిన ఏం చేయలేకపోయిందని, ఇది బీజేపీ కథనాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను చెప్పకుండా ఉండటమే’’ అని పార్టీ నాయకత్వం విశ్వసిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు ది ఫెడరల్ తో అన్నారు.
సూపర్ ప్రతినిధి
కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ ఉదిత్ రాజ్ ఎక్స్ లో థరూర్ ను విమర్శించారు. ఈ ప్రతినిధులు భారత్ కు తిరిగి రాకముందే ఆయనను(థరూర్) బీజేపీకి సూపర్ ప్రతినిధిగా ప్రకటించాలా లేదా భారత్ కొత్త విదేశాంగ మంత్రిగా ప్రకటించాలా అని ప్రశ్నించారు.
‘‘ప్రధాని మోదీకి ముందు భారత్ ఎల్ఓసీ, అంతర్జాతీయ సరిహద్దును దాటలేదని చెప్పడం ద్వారా మీరు కాంగ్రెస్ స్వర్ణ చరిత్రను ఎలా కించపరుస్తారు? 1965 లో భారత్ సైన్యం పాకిస్తాన్ లోకి అనేక చోట్ల ప్రవేశించింది.
ఇది లాహోర్ సెక్టార్ లోని పాకిస్తానీయులను పూర్తిగా ఆశ్చర్యపరిచింది. 1971 లో భారత్, పాకిస్తాన్ ను రెండు ముక్కలు చేసింది. యూపీఎ హాయంలో అనేక సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి.
కానీ రాజకీయంగా ఇమేజ్ సంపాదించడానికి డ్రమ్ బీటింగ్ చేయలేదు. మీకు చాలా ఇచ్చిన పార్టీకి మీరు ఇంత నిజాయితీ లేని విధంగా ఎలా అంటారు’’ అని రాసుకొచ్చారు.
టాప్ బ్రాస్..
పనామా లో థరూర్ చేసిన ప్రకటనపై పార్టీ తీవ్రంగా పరిగణించిందనే సంకేతాలు బుధవారం పార్టీ ఇచ్చింది. సాయంత్రం కాంగ్రెస్ మీడియా విభాగం చీఫ్ పవన్ ఖేరా పలు విషయాలను ఎక్స్ లో ట్వీట్ చేశారు.
మోదీ ప్రధానమంత్రి అయిన తరువాత పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ ప్రారంభించిందనే వాదనను ఖండించే వార్తా నివేదికలు, చారిత్రక దృశ్యాలను వారు థరూర్ కు ట్యాగ్ చేశారు.
ఖేరా పోస్ట్ చేసిన పోస్ట్ లలో మే 2019 నాటి ఒక వార్తా క్లిప్ ఉంది. ఇందులో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోసింగ్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఉంది. ‘‘ ప్రతి ముప్పుకు కార్యాచరణపరంగా స్పందించడానికి మన సాయుధ దళాలకు ఎల్లప్పూడూ స్వేచ్ఛ ఇచ్చామని నేను మీకు గుర్తు చేస్తున్నాము.
మా పదవీకాలంలో చాలా సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి. గత 70 సంవత్సరాలలో అధికారంలో ఉన్న ప్రభుత్వం మన సాయుధ దళాల పరాక్రమం వెనక ఎప్పుడూ దాక్కోవాల్సిన అవసరం లేదు.
మన దళాలను రాజకీయం చేయడానికి ఇటువంటి ప్రయత్నాలు సిగ్గుచేటు, ఆమోదయోగ్యం కాదు’’ అని జాతీయ మీడియాలో అన్నారు.
2008-2014 మధ్య పాకిస్తాన్ లోని భట్టల్, నీలం, శారదా, సావన్, నజాపిర్ సెక్టార్ లో నిర్వహించిన ఆరు సర్జికల్ స్ట్రైక్స్ వివరాలను, అలాగే 2000-03 మధ్య అటల్ బిహారీ వాజ్ పేయ్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో నాడాలా, బరోహ్ సెక్టార్లలో నిర్వహించిన వాటిని కూడా ఈ వార్తా క్లిప్ ప్రస్తావించింది.
చిన్న విషయాలను కూడా..
2016 లో పీటీఐ వార్తను కూడా ఖేరా పంచుకున్నారు. అప్పటి విదేశాంగ కార్యదర్శి, ప్రస్తుత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఎక్స్ టర్నల్ అఫైర్స్ కు తన వృత్తిపరంగా చేసిన విషయాలను వెల్లడించారు.
అంతకుముందు నియంత్రణ రేఖ వెలుపల అనేకసార్లు సర్జికల్స్ స్టైక్స్ జరిగాయని, కానీ వీటిని మొదటిసారిగా బహిరంగ పరిచామని చెప్పినట్లు సదరు క్లిప్ లో ఉంది. కాంగ్రెస్ కమ్యూనికేషన్ చీఫ్ జైరామ్ రమేష్ కూడా పవన్ ఖేరా పోస్ట్ ను షేర్ చేశారు. థరూర్ ప్రకటనను తమ పార్టీ సవాల్ చేయకూడదని నిర్ణయించినట్లు ఆయన స్పష్టం చేశారు.
‘‘ఆయన ప్రతినిధి బృందం నాయకుడిగా అన్ని హద్దులను దాటి పార్టీ వైఖరినే కాకుండా, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పత్రికలకు చెప్పిన విషయాలకు కూడా విరుద్దంగా ఒక ప్రకటన చేశారు.
ఇది ఆమోదయోగ్యం కాదు. ప్రతినిధి బృందానికి అధిపతిగా థరూర్ పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కథనాన్ని ముందుకు తీసుకురావాలని మేము అర్థం చేసుకున్నాము. దానికి అభినందిస్తున్నాము.
పనామాలో ఆయన చేసినది ఆ వివరణను మించిపోయింది. కాంగ్రెస్ ను తక్కువ చేసి మాట్లాడానికి ప్రధాని, బీజేపీ ఆయనకు ఇస్తున్న సమాచారాన్ని దేశీయంగా ఎలా ప్రచారం చేస్తున్నారో, అంతర్జాతీయ వేదికలపైకి ఆయన అలాగే ప్రచారం చేస్తున్నారు’’ అని కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త ది ఫెడరల్ తో అన్నారు.
రాజకీయ ప్రకటనలు..
థరూర్ తో పాటు మరో నలుగురు కాంగ్రెస్ నాయకులు మాజీ కేంద్రమంత్రులు సల్మాన్ ఖుర్షీద్, ఆనంద్ శర్మ, ప్రస్తుత ఎంపీలు మనీష్ తివారీ, అమర్ సింగ్, వివిధ దేశాలకు పంపిన అఖిలపక్ష ప్రతినిధుల బృందంలో భాగమని, రాహుల్ గాంధీ సిఫార్సు చేసిన శర్మ తప్ప, మిగతా వారందరిని ప్రభుత్వమే ఎంపిక చేసిందని మరో నాయకుడు గుర్తు చేశారు.
‘‘ఈ ప్రతినిధి బృందాలతో వెళ్లిన ఇతర పార్టీ నాయకులందరూ భారత్ తన సార్వభౌమత్వాన్ని ఎలాగైనా కాపాడుకుంటుందని, పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలకు బలంగా, ఐక్యంగా ప్రతిస్పందిస్తుందని మిగిలిన దౌత్యవేత్తలు ఇలా సంక్షిప్త ప్రకటనకు కట్టుబడి ఉన్నారు.
థరూర్ లాగా ప్రతినిధి బృందాలకు నాయకత్వం వహిస్తున్న కనిమొళి, సుప్రియా సూలే వంటి ప్రతిపక్ష నాయకులు కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు కానీ, థరూర్ దేశ వైఖరిని కాకుండా, బీజేపీ కథనాన్ని ముందుకు తీసుకువచ్చే ప్రకటనలు చేస్తున్నారు’’ అని ఆ పార్టీ నాయకుడు అన్నారు.
థరూర్ పనామా ప్రకటనను బీజేపీ రాజకీయంగా, ఎన్నికలపరంగా ఆయుధంగా ఉపయోగిస్తుందని, కాంగ్రెస్ నాయకత్వం నమ్ముతున్నట్లు వర్గాలు తెలిపాయి. ‘‘బీజేపీ దీనికి కచ్చితంగా ఉపయోగించుకుంటుంది. పాకిస్తాన్ పై కాంగ్రెస్ మృదువుగా ఉందని చెప్పడానికి దాని సోషల్ మీడియా సైన్యం ఇప్పటికే థరూర్ వీడియోను ప్రసారం చేస్తోంది.
మోదీ ఆయన పరివారం థరూర్ ను ఉటంకిస్తూ తిరుగుతారు. పాకిస్తాన్ కు గుణపాఠం నేర్పే ధైర్యం మోదీకి మాత్రమే ఉందని కాంగ్రెస్ నాయకులు కూడా అంగీకరిస్తున్నారని చెబుతారు.’’ ఈ ప్రతినిధి బృందాలకు కాంగ్రెస్ సూచించిన ఎంపీ పేర్లను సిఫార్సు చేసినప్పటికీ కేంద్రం తిరస్కరించి, తనకు ఇష్టమైన పేర్లనే తీసుకుంది.
జాగ్రత్తగా కథనం..
థరూర్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ లో గందరగోళం, భయం పెరుగుతోంది. అయితే దానికి ఖండనలు జారీ చేయడం తప్ప వేరే మార్గం లేదు. తిరువనంతపురం ఎంపీ విదేశాలలో అధికారిక పర్యటనలో ఉన్నప్పుడూ ఆయన పై పార్టీ చర్య తీసుకోలేమని, ఇక్కడికి వచ్చామని కూడా చర్య తీసుకోలేమని, ఒకవేళ అదే చేస్తే ఆయనను వీరుడిగా చేసినట్లు అవుతుందని ఆపార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఎందుకంటే విదేశాలలో భారత్ ప్రయోజనాల గురించి ఎంపీ మాట్లాడితే, తనపై చర్యలు తీసుకుందని బీజేపీ ప్రజలకు వద్దకు వెళ్లే అవకాశం ఉంటుందని అంటున్నాయి.
ఇదే సమయంలో పార్టీలోని మరో వర్గం మాత్రం థరూర్ చేస్తున్న ప్రకటనలు, పనులను ఎండగట్టడానికి సిద్దంగా ఉంది. ‘‘మనం ఎలా వ్యవహరించాలో జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి.
కొంతకాలంగా థరూర్ ఈ ఆరోపణలను పదేపదే తోసిపుచ్చుతున్నారు. కానీ ఆయన కాంగ్రెస్ నుంచి వెళ్లిపోవవడానికి సిద్దంగా ఉన్నట్లు అర్థమవుతోంది. కానీ ఆయన చేస్తున్న ప్రకటనలు ఎలాంటి సందేహాన్ని కలిగించట్లేవు.
ఇప్పుడు మా ముందున్న ప్రశ్న ఎంటేంటే ఇప్పుడు మనం ఏం చేయాలి. ఎలా చేయాలి? ఇప్పుడు మాముందున్న ఓ మార్గం ఏంటంటే పార్టీ తరఫున క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాము. అతనికి షోకాజ్ నోటీస్ ఇస్తాము. అతని వ్యాఖ్యలకు వివరణ అడుగుతాము.
కానీ అతను చాలా తెలివిగా సమాధానం ఇచ్చి దాన్నుంచి బయటపడతాడు. మరో ప్రత్యమ్నాయం ఏంటంటే.. మరోసారి అతను గీత దాటేవరకూ వేచి చూడటం’’ అదే జరిగితే అతనికి మేము ఎలాంటి అవకాశం ఇవ్వము. పార్టీని అణగదొక్కడానికి, నాయకత్వాన్ని అవమానించడానికి మేము ఆయనకు అనుమతి ఇవ్వము’’ అని రాహుల్ గాంధీకి దగ్గరగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ బేరర్ ది ఫెడరల్ తో అన్నారు.
Tags:    

Similar News