చీనాబ్ వంతెనలో నిర్మాణ సంస్థ ఎదుర్కొన్న సవాళ్లేంటీ?
నిర్మాణ ప్రదేశానికి చేరుకోవడానికి గుర్రాలు, గాడిదలే ఆధారం, అయిన పని పూర్తి చేసిన సంస్థ;
By : The Federal
Update: 2025-06-07 07:15 GMT
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ వరకు ఏకధాటిగా రైలు ప్రయాణించేందుకు మార్గం సుగమం అయింది. భారత ప్రధాని మోదీ చీనాబ్ వంతెన్ ప్రారంభించిన దానిని జాతికి అంకితం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైనగా చరిత్ర పుటాల్లోకెక్కింది. అయితే ఈ వంతెన పనిని ప్రారంభించడానికి నిర్మాణ సంస్థ అనేక అడ్డంకులు దాటాల్సి వచ్చింది.
గాడిదలు, గుర్రాలే ఆధారం..
హిమాలయా పర్వత సానువుల్లో ఉన్న ఈ ప్రాంతానికి చేరుకోవకోడానికి ఎటువంటి దారులు మొదట్లో లేవు. ఎత్తైన ఈ ప్రాంతానికి చేరుకోవడానికి, నిర్మాణ సామగ్రిని చేర్చడానికి స్థానికంగా లభించే గుర్రాలు, గాడిదలను గుత్తేదారు ఉపయోగించారు.
తరువాత కొన్ని రోజులుగా మనుషులు నడిచే దారి, ఇంకొన్ని రోజులకు రహదారులను నిర్మించగలిగారు. ఈ ప్రఖ్యాత బ్రిడ్జిని దేశంలోనే పేరుపొందిన నిర్మాణ సంస్థ అయిన ‘ఆఫ్కాన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్’ నిర్మించింది.
‘‘ప్రారంభంలో ప్రాజెక్ట్ బృందానికి అనేక సవాళ్లు ఎదురయ్యాయి. నిర్మాణ ప్రదేశానికి చేరుకోవడానికి కంచరగాడిదలు, గుర్రాలను ఉపయోగించాము. కొంతకాలం తరువాత తాత్కాలిక రోడ్లను నిర్మించగలిగాము. ఆ తరువాతనే పనిలో వేగం పెరిగింది’’ అని కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు.
రెండు వైపులా రహదారులు
చీనాబ్ నది ఒడ్డుకు ఉత్తరం వైపు 11 కిలోమీటర్ల రహదారిని, దక్షిణం వైపున 12 కిలోమీటర్ల రహదారిని నిర్మించామని ప్రతినిధి ఒకరు తెలిపారు.
చీనాబ్ రైల్వే వంతెన నిర్మాణం ఇంజనీరింగ్ అద్భుతం అనే మాటకంటే ఎక్కువ అని, అసలు దాన్ని పదాల్లో వర్ణించలేమని ఆఫ్కాన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ అన్నారు.
‘‘తెలివితేటలు, ధైర్యంతో అత్యంత బలీయమైన సవాళ్లను జయించాలనే భారత్ సంకల్పానికి ఈ బ్రిడ్జి చిహ్నం’’ అని సుబ్రమణియన్ జాతీయ మీడియాకు చెప్పారు.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం కంపెనీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన క్రాస్ బార్ కేబుల్ క్రేన్ లు, ప్రత్యేకమైన భారీ యంత్రాలను ఉపయోగించింది.
‘‘హిమాలయాలు నిటారుగా, భారీ వాలులుతో ఉన్నాయి. వీటిని కన్సాలిడేషన్ గ్రౌంటింగ్ ఉపయోగించి, పటిష్టం చేశాము. భారీ ఆర్చ్ ల పునాదులను ఇవి బలోపేతం చేశాయి’’ అని కంపెనీ ఎదుర్కొన్న భారీ సవాళ్లను ఆయన వివరించారు.
‘‘పునాదులు వేయడంతో రెండు వైపుల నుంచి తోరణాన్ని నిర్మించడం కాంటిలివర్ నిర్మాణ సాంకేతికత ద్వారా ప్రణాళిక వేశాము. మా పనిలో మొదటి విజయం ఏప్రిల్ 5, 2021న వచ్చింది. రెండు ఒడ్డుల నుంచి క్రమంగా వస్తున్న నిర్మాణాలు ఒకే తోరణం వద్ద కలుసుకున్నాయి’’ అని కంపెనీ తెలిపింది.
‘‘వయాడక్ట్ నిర్మాణం మరొక ప్రత్యేకమైన సవాల్. దీనికి అనేక మార్పులు తీసుకురావాల్సి ఉండేది. దీన్ని దృష్టిలో తీసుకుని ప్రయోగ క్రమాన్ని నాలుగు విభాగాలుగా విభజించి జాగ్రత్తగా ప్రణాళిక వేశాము’’ అని ప్రతినిధి అన్నారు.
ఆఫ్కాన్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గిరిధర్ రాజగోపాలన్ జాతీయ మీడియాతో మాట్లాడారు. ‘‘భారతీయ రైల్వేలలో మొదటిసారిగా చీనాజ్ వంతెన వయాడక్ట్ భాగం, డెక్ లాంచింగ్ కోసం పరివర్తన వక్రరేక, రేఖాంశ ప్రవణతపై ఇంక్రిమెంటల్ లాంచింగ్ జరిగిందని రెండూ ఒకే చోట సంభవించాయని అన్నారు.
‘‘దేశ నిర్మాణం పై అచంచల నిబద్దతను, అత్యంత కఠినమైన భూభాగాలలో మౌలిక సదుపాయాలను తిరిగి ఊహించుకునే మా సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఈ వంతెన తరతరాలుగా ఇంజనీర్లకు స్పూర్తినిస్తుంది.
భారతీయ ఇంజనీరింగ్, జట్టుగా కృషి మన శక్తికి ఆఫ్కాన్స్ నిదర్శనంగా నిలుస్తుంది’’ అని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
‘‘భారతీయ రైల్వేలల చరిత్రలో మొదటిసారిగా ప్రాజెక్ట్ ప్రతి దశలోనూ నాణ్యతను పర్యవేక్షించేలా చూసుకోవడానికి నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ద్వారా గుర్తింపు పొందిన ప్రయోగశాలను ఏర్పాటు చేశారు.
చీనాబ్ నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జి నదిపైన 359 మీటర్ల ఎత్తులో, ఐఫిల్ టవర్ కంటే 35 మీట్లర్ల ఎత్తులో ఉంది. చీనాబ్ నదిపై నిర్మించిన బ్రిడ్జి ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనగా ప్రసిద్ది కెక్కింది.
ప్రధాని శుక్రవారం ఉధంపూర్- శ్రీనగర్- బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. అలాగే కత్రా నుంచి శ్రీనగర్ వరకూ ప్రయాణించే వందే భారత్ రైలుకు జెండా ఊపి ప్రారంభించారు. వంతెన ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని జాతీయ జెండాను ఎత్తుకుని దానిపై నడిచారు. ఆయన రైలు కోచ్ లో ప్రయాణించి ఇక్కడకు చేరుకున్నారు.