అధికారిక లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు.. ప్రకటించిన సీఎం రేవంత్

ఈనాడు అధినేత, పద్మవిభూషన్ గ్రహీత రామోజీ రావు ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆయన మరణంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

Update: 2024-06-08 03:57 GMT

ప్రముఖ పారిశ్రామికవేత్త, ఈనాడు అధినేత, పద్మవిభూషన్ గ్రహీత రామోజీ రావు ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆయన మరణంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు జర్నలిజం విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత రామోజీకే దక్కుతుందని రేవంత్ తెలిపారు. తెలుగు మీడియా, పత్రిక, సీనీ రంగానికి ఆయన అందించిన సేవలు ఎనలేనివని, ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేనిదని రేవంత్ తన సంతాపం తెలిపారు. అనంతరం రామోజీ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి.. అక్కడి నుంచే ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్‌కు సీఎస్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News