శ్రీవారి సేవకుల సంఖ్య ఐదు లక్షలకు చేరడం ఆనందంగా ఉందని ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి, టీటీడీ మాజీ ఈఓ డాక్టర్ పి. కృష్ణయ్య పరమానందపడ్డారు.
"ఆ నాడు కూడా సీఎంగా చంద్రబాబే ఉన్నారు. బ్రహ్మోత్సవాల వేళ, నారాయణ హృదయాలకు సంబంధించి ఉచిత ఆపరేషన్లు పుట్టపర్తి సత్యసాయి ఆస్పత్రిలో పరిశీలించాలని సూచించారు. నా కుటుంబ సమేతంగా వెళ్లి సత్యసాయిబాబాను దర్శించుకున్నా. అక్కడి వంటశాల, అన్నదానం, ఆస్పత్రిలో స్వచ్ఛంద సేవకుల పనితీరును పరిశీలించా. ఆ తరహాలోనే టీటీడీలో శ్రీవారిసేవ ప్రారంభానికి పునాది పడింది" అని ప్రస్తుతం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ గా ఉన్న మాజీ ఈఓ కృష్ణయ్య తన భావాలను పంచుకున్నారు.
శ్రీవారిసేవకు తీవ్ర పోటీ..
“శ్రీవారి సేవకు వచ్చే సేవకుల్లో మహిళలు ఆరంజ్ కలర్ చీర, తెలుపు రవిక, మెడకు స్కార్ఫ్, పురుషులు తెలుపు పంచ లేదా ప్యాంటు, చొక్కా ధరించాలి. మెడకు స్కార్ఫ్ కట్టుకునే విధంగా డ్రస్ కోడ్ అమలు చేశారు. 2000 సంవత్సరంలోటిటిగి ఎగ్జిక్యూటివ్ అధికారి పి. కృష్ణయ్య ఈ శ్రీవారిసేవను కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశంకరాచార్య ద్వారా ప్రారంభింప చేశారు,” అని సుభాష్ గౌడ్ చెప్పారు.
"శ్రీవారి సేవ ప్రారంభించాం. దాని లక్ష్యం అర్ధం చేసుకుని వలంటీర్ గా పేర్లు నమోదు చేసుకునేందుకు నిదానంగా స్పందన వచ్చింది. తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద యాత్రికులు తిరుమల వెళ్లే మార్గం చెప్పడం, తిరుపతిలో అతిథి గృహాలకు ఎలా వెళ్లాలనే విషయాల మీద ఈ వలంటీర్లకు శిక్షణ ఇచ్చాం. తిరుమలలో కూడా ఆ శ్రీవారి సేవకులు ప్రత్యేక ఆకర్షణగా మారారు,” అని సుభాష్ గౌడ్ గుర్తు చేసుకున్నారు.
తొలి అనుభవం
"తిరుమల ఆలయం ముందు చంకలో ఓ పెద్ద నోటుపుస్తకం పెట్టుకుని నిలబడ్డా. శ్రీవారి దర్శనం చేసుకుని యాత్రికుల వెలుపలికి వస్తున్న యాత్రికులను పలకరిస్తున్నా. అయ్యా.. మీ పేరు, అడ్రస్, ఫోన్ (ల్యాండ్ ఫోన్) నంబర్ చెబుతారా? మిమ్మలిని శ్రీవారిసేవకు పిలుస్తా.. అని అడిగితే నన్ను ఒక పిచ్చోడు మాదిరి చూశారు" అని సుభాష్ గౌడ్ గుర్తు చేసుకున్నారు. కొన్ని నెలల్లోనే మీడియా ద్వారా చేసిన ప్రచారం వల్ల
తిరుమలలోని ఏపీఆర్ఓ కార్యాలయాలనికి రిజిస్టర్ పోస్టు ద్వారా దరఖాస్తులు రావడం ప్రారంభం అయ్యాయి అని సుభాష్ గౌడ్ వివరించారు. కొద్ది నేలల్లోనే వలంటీర్ గామారాలని ఆసక్తి కనపర్చే వారి సంఖ్యలక్షలోకి మారిందని అపుడు ‘శ్రీవారి సేవ’కు ఓఎస్ డిగా ఉన్న తలారి రవి చెప్పారు.
"శ్రీవారిసేవకు ప్రచారం కల్పించాం. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో లక్షలాది కరపత్రాలు ముద్రించి, పంపిణీ చేశాం. వీటన్నింటికంటే కొత్తగా, వింతగా కనిపించిన డ్రెస్ కోడ్, సేవకులపై మీడియా లో వచ్చిన కథనాల వల్ల మంచి ఫలితం వచ్చింది" అని ఇపుడు చీఫ్ పీఆర్ఓగా ఉన్న రవి గుర్తుచేసుకున్నారు. 200 మందితో ఈ కార్యక్రమం ప్రారంభించిన నెలల వ్యవధిలోనే వందల దరఖాస్తులు సేవకుల నుంచి అందాయి. ఆ సంఖ్య 2008 నాటికి 1.75 లక్షలకు చేరింది,” అని రవి వివరించారు.
ఆన్ లైన్ కోటాలో..