విశాఖపట్నం రాజధాని అన్నా.. ఎందుకు నమ్మలేదు?

విశాఖపట్నం రాజధాని. నేను గెలవగానే ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేస్తున్నా.. రాష్ట్ర రాజధాని కేంద్రం విశాఖ.

Update: 2024-06-05 10:12 GMT

ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు, ఎన్నికల తరువాత ఈ మాటలు అన్నది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. తాను గత ఎన్నికల్లో అధికారం చేపట్టిన రోజు నుంచి రాష్ట్రంలో మూడు రాజధానులు ఉంటాయని, విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని ఉంటుందని పలు మార్లు చెప్పారు. పలు సందర్బాల్లో హెచ్‌వోడీలను విశాఖకు తరలించేందుకు తగిన జీవోలు కూడా ఇచ్చారు. ఇవన్నీ పక్కన బెడితే ఎన్నికల ప్రచారంలోనూ నేను విశాఖపట్నం నుంచే తిరిగి ముఖ్యమంత్రిగా పనిచేస్తానని ప్రకటించారు. అయినా ఉత్తరాంధ్ర వాసులు జగన్‌ను నమ్మలేదు. కారణాలు ఏమిటనే అంశంపై వైఎస్సార్‌సీపీలో అంతర్మధనం మొదలైంది. వారు ఎంత మధనపడ్డా చేసేదేమీలేదనేది స్పష్టమైంది. ఉత్తరాంధ్ర ఉమ్మడి మూడు జిల్లాలోని ప్రజలు తిరస్కరించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో వైఎస్సార్‌సీపీకి ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. వైఎస్సార్‌సీపీకి ఇది వినేందుకే ఒళ్లు జలదరిస్తోంది. విజయనగరం, విశాఖలో అన్నీ తానై చక్రం తిప్పిన బొత్స సత్యనారాయణ కుటుంబం కూడా ఘోరంగా ఓటమిపాలైంది. వారి ఇంటి నుంచి పోటీ చేసిన వారందరినీ ఓటర్లు ఓడించారు. వారినే కాదు, ఎంతటి గొప్పవారైనా వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మంత్రి రాజన్నదొర వరుసగా గెలుస్తూ వస్తున్నారు. అవినీతి మచ్చలేని నాయకుడిగా గుర్తింపు ఉంది. అయినా గిరిజనులు ఆయనను ఓడించి తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించారు. ఉత్తరాంధ్రలో వైఎస్సార్‌సీపీకి దక్కింది అరకు ఎంపీ, పాడేరు, అరకు ఎమ్మెల్యే స్థానాలు. కేవలం గిరిజనుల్లో వైఎస్సార్‌పై ఉన్న సానుభూతి తప్ప జగన్‌పై ఉన్న ప్రేమ వారిని గెలిపించలేకపోయింది.

ఇంత ఘోర పరాజయమెందుకు?
ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో బీసీ, ఎస్టీ, ఎస్సీలు ఎక్కువ. విశాఖ నగరం మినహాఇస్తే ఎక్కువ మంది బీసీ, ఎస్టీల్లో వైఎస్సార్‌సీపీకి మొదటి నుంచీ పట్టుంది. అయినా ఓటర్లు ఈ సారి ఓడించారు. ఐదు సార్లు గెలిచిన రాజన్నదొరను. రెండు సార్లు గెలిచిన పుష్ప శ్రీవాణిని మట్టి కరిపించారు. వీరు ఇరువురూ మంత్రులుగా పనిచేశారు. బొత్స సంగతి తెలిసిందే. ఇంత కసిగా ఓటు వేయడానికి కారణాలు ఏమిటనే విషయమై ఉత్తరాంధ్ర పజల మనస్సుల్లో ఏముందో తెలుసుకునేందుకు ప్రయత్నించినా వారు సమాధానం చెప్పేందుకు సుముఖత చూపలేదు. అయితే ఇక్కడ ఒక్కటి మాత్రం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాజధాని లేకపోయినా ఇప్పటికే నగరం అబివృద్ధి చెంది ఉంది. విశాఖ నగరానికి ఎవరు వచ్చినా సంతోషంగా బతకొచ్చనే భరోసా ఉంటుంది. ఎటువటంటి హింస ఉండదు. నేరాలు పెద్దగా ఉండవు. ప్రశాంత జీవనం సాగుతుంది. ప్రజలు ఎక్కువ మంది సంతోషమైన జీవితాన్ని గడపడానికి అలవాటు పడ్డారు. ఎప్పుడైతే జగన్‌ రాజధాని మాట ఎత్తారో అప్పటి నుంచి నగరంలో రాయలసీమ వాసుల హడావుడి ఎక్కువైంది. భూముల కబ్జాలు వరుసగా జరగటం మొదలయ్యాయి. పలు కేసులు నమోదవడం మొదలయ్యాయి. హోటళ్ల వద్ద అప్పుడప్పుడూ గొడవలు జరగటం ప్రారంభమయ్యాయి. ఇవన్నీ చూసిన ప్రజలు జగన్‌ ప్రభుత్వాన్ని తిరస్కరించినట్లు కొందరు సన్నిహితులు చెబుతున్న మాటలు.
సంపద దోస్తారననే భయం..
ఉత్తరాంధ్ర ఏజెన్సీలో ఎంతో సంపద ఉంది. ఈ సంపదపై వైఎస్సార్‌సీపీ పెద్దల కన్నుపడింది. ఇక గిరిజనం ఉండేందుకు స్థలం కూడా ఉండదు. అందువల్ల విశాఖపట్నంలో రాజధాని అవసరంలేదు. ఈ ఐదేళ్లు రాజధాని పేరు చెప్పి విశాఖపట్నంలోని ఖాళీగా ఉండే పొలాలు, స్థలాలు కబ్జాలకు గురయ్యాయి. విశాఖ నగరానికి అందాలను పంచే కొండలు పచ్చదనాన్ని కోల్పోయాయి. కడప ప్రాంతానికి చెందిన వారు వచ్చి నిలువునా కొండల్ని తవ్వి భవనాలు నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరో ఐదేళ్లు కొనసాగితే పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ఇక అరకు ప్రాంతంలో ఉండే విలువైన వనరులు కూడా దోపిడీకి గురయ్యే అవకాశం ఉందని భావించినట్లు ఉత్తరాంధ్ర ఓటర్లు భావించారనటంలో సందేహం లేదు. కొండకింద కూర్చొని కొండ పైభాగం ౖÐð పు చూస్తూ హాయిగా గాలి పీల్చుకునే గిరిజనుల మదిలో ఆ చెట్లే లేకుండా పోతే మెమెలా బతకాలనే ఆలోచన మెదలడంతో వైఎస్సార్‌సీపీని వద్దనుకున్నారని సమాచారం.
విశాఖ పట్నాన్ని ఎందుకు రాజధానిగా వద్దని కోరుకుంటున్నారో ఫ్రొఫెసర్‌ ఎస్‌కె చలం పూస గుచ్చినట్లు వివరించారు. ఉత్తరాంధ్రలో అగ్రకులాలు లేవు. ఆదిపత్యం లేదు. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు మాత్రమే ఉన్నారు. వీరు ఎవరు ఏమి చెప్పినా నమ్మేస్తారు. వీరిని నమ్మకంగా మోసం చేయొచ్చని పాలకులు గుర్తించారు. వైఎస్సార్‌సీపీలోని పెద్దలు అక్కడి భూములు లాక్కోవచ్చనే ప్రణాళికలు వేశారు. ఈ వ్యవహారాలు ఆనోటా, ఈనోటా పడి గిరిజనులకు చేరాయి. బీసీలు కూడా దీనిని సహించలేకపోయారు. ఇప్పటికే విశాఖ చుట్టుపక్కల భూములన్నీ కడప ప్రాంతానికి చెందిన పలువురు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వెళ్లి కొనుగోళ్లు చేసి వెంచర్లు వేశారు. ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ భూములను స్వాహా చేసి పెద్ద పెద్ద భవంతులు కట్టారు. ప్రాజెక్టుల పేరుతో, బోగాపురం ఎయిర్‌పోర్ట్, గంగవరం పోర్టు వంటి పలు పేర్లు చెప్పి వేలకు వేల ఎకరాలు దోచుకున్నారు. విశాఖపట్నం రాజధాని అనగానే రాయలసీమ బృందాలు వచ్చాయి. ఇటీవల క్రైం రేటు కూడా పెరిగింది. కక్షలు పెరుగుతున్నాయి. ఇవన్నీ స్థానికులకు నచ్చలేదు. అందుకే జగన్‌ ప్రభుత్వాన్ని తిరస్కరించారు.
Tags:    

Similar News