కోయంబత్తూర్ పేలుళ్ల కేసు: నలుగురిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

డీఎంకే పై విమర్శలు గుప్పించి బీజేపీ, బుజ్జగింపు రాజకీయాలతో జాతీయ భద్రతను పణంగా పెడుతున్నాన్న అన్నామలై;

Update: 2025-06-19 12:03 GMT
అరెస్ట్ అయిన నిందితులు అహ్మద్ అలీ, జవహార్ సాథిక్, రాజా అబ్ధుల్లా, షేక్ దావూద్

మహాలింగం పొన్నుస్వామి

అక్టోబర్ 2022 లో కోయంబత్తూర్ కారు బాంబు పేలుళ్ల తో సంబంధం ఉన్న కేసులో ఎన్ఐఏ మరో నలుగురి అరెస్ట్ చేసింది. ఈ కేసుకు కోవై(కోయంబత్తూర్ కు ఉన్న మరో పేరు) అరబిక్ కళాశాలకు సంబంధించినది.

తమిళనాడు రాడికలైజేషన్ అండ్ రిక్రూట్ మెంట్ లో ఐఎస్ఎస్ తో ఈ వ్యక్తులకు సంబంధాలు ఉన్నట్లు ఎన్ఐఏ తెలిపింది. అరెస్ట్ అయిన నిందితులు అహ్మద్ అలీ, జవహార్ సాథిక్, రాజా అబ్ధుల్లా, షేక్ దావూద్ లు గా దర్యాప్తు సంస్థ పేర్కొంది.

నేరారోపణ రుజువు..
ప్రధాన నిందితురాలు జమేషా ముబిన్ తో పాటు నలుగురు నిందితులు అరబిక్ భాషా విద్యా ముసుగులో నిర్వహించిన రాడికలైజేషన్ తరగతులకు హజరయ్యారని దర్యాప్తులో వెల్లడైంది.
మద్రాస్ అరబిక్ కళాశాల వ్యవస్థాపకుడు జమిల్ బాషా, ఇర్షత్, సయ్యద్ అబ్దుర్ రెహమాన్, మహ్మద్ హుస్సేన్ వంటి అతని సహచరులు నేతృత్వంలోని జరిగిన తరగతుల్లో ప్రధానంగా బలహీన యువతలో సలాఫి- జిహాది భావజాలాన్ని నింపాయి.
వారి ఇళ్ళు, ఇతర ప్రదేశాలలో సోదాల సమయంలో స్వాధీనం చేసుకున్న ఆధారాలతో ఈ నలుగురు నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. ఈ బృందం దేశంపై గణనీయమైన దాడికి సిద్దమవుతున్నట్లు ఆధారాలు దొరికాయని ఎన్ఐఏ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
ఖిలాపత్ భావజాలం..
తరగతి గదులు, సామాజిక వేదికలను ఉపయోగించుకున్న రాడికలైజేషన్ ప్రయత్నాలు చేయడం, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టడం ద్వారా ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించే అంతిమ లక్ష్యంతో జిహాద్ చేయడం వారి లక్ష్యం. తరగతుల పేరుతో ఖిలాపత్ భావజాలం, బలిదానాలను ప్రొత్సహించాయని ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి.
ఈ నెట్వర్క్ కార్యకలాపాలు కోయంబత్తూర్ కార్ బాంబు పేలుడుతో ముగిశాయి. అక్కడ జమేషా ముబీన్ ఒక పురాతన ఆలయం ముందు వాహనంతో ఐఈడీ దాడికి పాల్పడ్డాడని ఎన్ఐఏ సీనియర్ అధికారి తెలిపారు.
అంతేకాకుండా ఈ ముఠా యువకులను ముఖ్యంగా తల్లిదండ్రులను సంరక్షణ లేని వారిని లక్ష్యంగా చేసుకుని అరబిక్ బాష నేర్పించే నెపంతో ఉగ్రవాదులుగా తయారు చేయడానికి ప్రయత్నించినట్లు వెల్లడించింది.
బీజేపీ విమర్శలు..
‘‘ఇది కేవలం సిలిండర్ పేలుడు అని వారు(డీఎంకే) అన్నారు. ఇది డీఎంకే ప్రభుత్వం కింద పనిచేస్తున్న ఐసిస్ తో సంబంధం ఉన్న పూర్తి స్థాయి రాడికలైజేషన్, రిక్రూట్ మెంట్ నెట్వర్క్ అని తేలింది.
తరగతి గదులను ఉగ్రవాద కర్మాగారాలుగా ఉపయోగిస్తోంది. నిన్న మరో నలుగురిని అరెస్ట్ చేశారు. మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. వీరందరూ అక్టోబర్ 2022 కోయంబత్తూర్ ఆత్మాహుతి బాంబుదాడితో సంబంధం కలిగి ఉన్నారు’’ అని బీజేపీ నాయకుడు అన్నామలై అన్నారు.
‘‘ఈ ఉగ్రవాద స్థావరాలను నిర్వీర్యం చేయడానికి ఎన్ఐఏ అవిశ్రాంతంగా కృషి చేస్తుండగా, డీఎంకే బెదిరింపును తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తుంది. ఆత్మాహుతి బాంబ దాడులను కేవలం ప్రమాదాలుగా చిత్రీకరిస్తోంది. జవాబుదారీతనంలో బుజ్జగింపులు వచ్చినప్పుడూ జాతీయ భద్రతు ప్రమాదం ఏర్పడుతుంది. ’’ అని అన్నామలై అన్నారు.
Tags:    

Similar News