విధాన సౌధ లో ఆర్సీబీని సన్మానించాలనుకున్న సిద్ధరామయ్య

రాజ్ భవన్ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనం, ఖండించిన కర్ణాటక సీఎం;

Update: 2025-06-10 10:08 GMT
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆర్సీబీని సన్మానించేందుకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విధానసభకు గవర్నర్ థాపర్ చంద్ గెహ్లట్ ను ఆహ్వనించారని ఓ నివేదిక బయటకు వచ్చింది.

ఈ కార్యక్రమం విధాన సభలో జరుగుతుందని ప్రభుత్వం తమకు అధికారికంగా తెలియజేసిందని రాజ్ భవన్ వర్గాలు తమకు తెలియజేసినట్లు ఓ జాతీయ మీడియా వార్తా కథనం ప్రసారం చేసింది.

విధాన సౌధలో జరిగే సన్మాన కార్యక్రమానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ను అధికారికంగా ఆహ్వానించారని రాజ్ భవన్ వర్గాలను ఉటంకిస్తూ నివేదికు బయటపెట్టింది.
సిద్ధరామయ్య ఏమన్నారంటే..
రాజ్ భవన్ వాదనలను ఆదివారం సీఎం సిద్ధరామయ్య ఖండించారు. ఈ సన్మానం ప్రభుత్వం చేయబోయేది కాదని, కర్ణాటక క్రికెట్ సంఘం(కేఎస్సీఏ) చేసిందని ఆయన గుర్తు చేశారు.
విధాన సౌధ ముందు ఆర్సీబీ విజయోత్సవ వేడుకలను కొనసాగించాలనే నిర్ణయాన్ని సమర్థిస్తూ క్రికెట్ అసోసియేషన్ తనను(సీఎం), గవర్నర్ ను కార్యక్రమానికి ఆహ్వానించిందని, అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఆయన గుర్తు చేశారు.
‘‘డీపీఆర్ కమ్యూనికేషన్ తరువాత ప్రధాన కార్యదర్శి నన్ను అడిగారు. పోలీసులు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అంగీకరించారు. అప్పుడు నేను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను.
ఆ తరువాత కేఎస్సీఏ కోశాధికారి, కార్యదర్శి నన్ను హాజరుకావాలని ఆహ్వానించారు. ఇది నేను నిర్వహించిన కార్యక్రమం కాదు. ఇది వారి కార్యక్రమం. వారు గవర్నర్ ను కూడా ఆహ్వానించారు. కాబట్టి నేను హాజరయ్యాను. అంతకుమించి నాకు ఇందులో ఎటువంటి పాత్ర లేదు’’ అన్నారు.
డీసీపీ లేఖ..
విధాన సౌధలో సత్కార కార్యక్రమాలు తొందరపడి నిర్వహించరాదని హెచ్చరిస్తూ కార్యక్రమానికి ముందు డీసీసీ(విధాన సభ భద్రత) రాసిన లేఖ వెలువడిన తరువాత ముఖ్యమంత్రి ఆదివారం ఈ విధంగా స్పందించారు.
జూన్ 4న విధాన సౌధలో ఐపీఎల్ విజయంపై ఆర్సీబీకి అభినందనలతో పాటు చిన్నస్వామి స్టేడియంలో మరో వేడుక సైతం నిర్వహించారు. అక్కడ ప్రజలు పెద్ద సంఖ్యలో రావడంతో గందరగోళం నెలకొని తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 11 మంది మరణించారు. మరో 56 మంది గాయపడ్డారు.
జూన్ 4 నాటి లేఖలో కూడా డీసీపీ ప్రభుత్వ కార్యదర్శి, సిబ్బంది పరిపాలన సంస్కరణల శాఖకి రాసిన లేఖలో అనేక కీలక విషయాలు సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ కార్యక్రమాన్ని తొందరపడి నిర్వహించవద్దని, తక్కువ సమయంలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు గుమిగూడే అవకాశం ఉంటుందని కూడా లేఖలో హెచ్చరించారు. ప్రజలను నియంత్రించడానికి తగినంత సిబ్బంది కూడా లేరని హైలెైట్ చేశారు.
లేఖలో ఇంకా ఏమున్నాయి...
ఆర్సీబీ ఆటగాళ్లను సత్కరించడానికి విధాన సౌధ గ్రాండ్ మెట్లపై సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడానికి డీపీఏఆర్ తన అభిప్రాయం కోరినందుకు ప్రతిస్పందనగా లేఖ రాశారు.
‘‘ఆర్సీబీ క్రికెట్ జట్టుకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. విధాన సౌధలో గ్రాండ్ మెట్లపై ఈ కార్యక్రమాన్ని హాడావుడిగా నిర్వహించడం వలన లక్షలాది మంది క్రికెట్ అభిమానులు విధాన సౌధకు చేరుకుంటారు.
విధానసభ భద్రతా విభాగంలో అధికారులు, సిబ్బంది కొరత ఉన్నందున బందోబస్తులో సమస్యలు తలెత్తుతాయి’’ అని డీసీపీ లేఖలో పేర్కొన్నారు.
‘‘ఆర్సీబీకి అభిమానులు భారీగా ఉండటంతో బందోబస్తు కోసం నగరం వెలుపల నుంచి పోలీసులు అవసరం అవుతారు. దీనికి సమయం పడుతుంది. ’’ అని లేఖలో ఆయన ప్రస్తావించారు.
ఇలాంటి మెగా ఈవెంట్ కోసం శాంతి భద్రతలు, ట్రాఫిక్ పోలీసులు పరస్పరం సమన్వయం చేసుకోవాల్సి ఉంటుందని కానీ ప్రస్తుతానికి అంత సమయం లేదని అన్నారు.
అది నా దృష్టికి రాలేదు..
బీజేపీ, జేడీ(ఎస్) లు ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నాయని సీఎం ఆరోపించారు. ఆ కార్యక్రమం వివరాలు తనకు తెలియవని, డీసీపీ కమ్యూనికేషన్ తమకు లేఖ రాసిన విషయం తెలిదన్నారు.
‘‘ఆ లేఖ నాకు అందలేదు. డీపీఆర్ విభాగం అనుమతి ఇచ్చింది. నాకు సమాచారం ఇచ్చి ముందుకు సాగమని చెప్పారు. కానీ విధాన సౌధ ముందు నిర్వహించమని నేను ఆదేశించలేదు’’ అని సీఎం అన్నారు.
బెంగళూర్ పోలీసులు ఆదివారం సన్మాన కార్యక్రమం నిర్వహించాలని సూచించారని, కానీ ప్రభుత్వం ఆ అభ్యర్థన పట్టించుకోకుండా జూన్ 4 నే నిర్వహించాలని ఆదేశించిందని గతంలో వర్గాలు తెలిపాయి.
సీఎం, డిప్యూటీపై బీజేపీ విమర్శలు..
తొక్కిసలాట ఘటనపై బీజేపీ సీఎం, డిప్యూటీ సీఎం లక్ష్యంగా విమర్శలు చేస్తోంది. జాతీయ మీడియా కథనాలను పంచుకుంటూ జూన్ 4 నాటి ఘటనపై సిద్దరామయ్య, డీకే శివకుమార్ బాధ్యత వహించాలని పేర్కొంది.
‘‘మొదట భద్రతా హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆర్సీబీ కార్యక్రమాన్ని నిర్వహించిందని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇప్పుడు రాజ్ భవన్ వర్గాలు కూడా ముఖ్యమంత్రే తమను ఆహ్వనించినట్లు వెల్లడించింది.
ఇది ప్రభుత్వం నిర్వహించకపోతే గవర్నర్ ను ఎందుకు ఆహ్వానించారు. విధాన సౌధ వెలుపల జరిగి ముఖ్యమంత్రి కుటుంబ కార్యక్రమమా? ఈ హత్యలకు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ప్రత్యక్ష బాధ్యులని, ఎటువంటి ఆలస్యం చేయకుండా వీరిపై చట్టప్రకారం చర్య తీసుకోవాలి’’ అని పార్టీ ఎక్స్ లో పోస్ట్ చేసింది.
Tags:    

Similar News