‘‘ఇవేం ఆదేశాలు’’.. మద్రాస్ హైకోర్టు పై సుప్రీం అసహనం

కిడ్నాప్ కేసులో ఏడీజీపీ సస్పెన్షన్ పై విస్మయం, సీనియర్ పోలీసులకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆగ్రహం;

Update: 2025-06-18 10:36 GMT
సస్పెన్షన్ కు గురైన ఏడీజీపీ హెచ్ ఎం జయరామ్

మహాలింగం పొన్నుస్వామి

ప్రేమ వివాహాం వివాదంలో ఓ మైనర్ వ్యక్తిని కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు ఏడీజీపీ పై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. జయరామ్ అరెస్ట్ ను చేయాలని కోర్టులోనే అదుపులోకి తీసుకోవాలనే ఆదేశాలు ఎలా ఇస్తారని ప్రశ్నించింది.

‘‘ఆయన ఒక సీనియర్ పోలీస్ అధికారి. ఈ రకమైన ఆదేశాలు దిగ్బ్రాంతికరమైనవి, నిరుత్సాహపరిచేవి’’ అని న్యాయమూర్తులు సందీప్ మెహతా, ప్రసన్న బి వరలేతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
త్వరగా ఎందుకు సస్పెన్షన్..
హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా జయరామ్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం, ఆయన సస్పెండ్ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించింది. అదే సమయంలో సస్పెన్షన్ కు చట్టపరమైన ప్రక్రియ చాలా అవసరమని నొక్కి చెప్పింది.
రాష్ట్ర ప్రభుత్వం తన వాదనను వినిపిస్తూ జయరామ్ ను అధికారికంగా అరెస్ట్ చేయలేదని, హైకోర్టు ఆదేశాల మేరకు స్వచ్ఛందంగా దర్యాప్తులో పాల్గొన్నారని స్పష్టం చేసింది. నిన్న సాయంత్రం ప్రభుత్వ అధికారిని విడుదల చేసినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
జయరామ్ పై ఉన్న ఆరోపణ ఏమిటీ?
తిరువళ్లూర్ నివాసి లక్ష్మీ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు వచ్చింది. తన పెద్ద కుమారుడు తన కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా ఒక మహిళను వివాహం చేసుకున్న తరువాత తన 16 ఏళ్ల చిన్న కొడుకును దుండగులు అపహరించారని ఆమె ఆరోపించారు.
కేవీ కుప్పం ఎమ్మెల్యే పూవై జగన్ మూర్తి ముందస్తు బెయిల్ పిటిషన్ ను విచారించిన మద్రాస్ హైకోర్టు తన అధికారిక వాహానాన్ని అందించడం ద్వారా కిడ్నాప్ కు ఆయన సహకరించారని జయరామ్ పాత్రపై దర్యాప్తు చేయడానికి పోలీసులను అరెస్ట్ చేయాలని ఆదేశించింది.
హైకోర్టు న్యాయమూర్తి పి. వెల్మురుగన్.. చట్టానికి ఎవరూ అతీతులు కారని చెప్పారు. ఏడీజీపీ చర్యలు, ఎమ్మెల్యే ప్రమేయాన్ని ఆయన కంగారూ కోర్టు అని విమర్శించారు.
అరెస్ట్, సస్పెన్షన్..
హైకోర్టు ఆదేశాలపై జూన్ 17న జయరామ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత తమిళనాడు ప్రభుత్వ హోంశాఖ కార్యదర్శి ఆయనను సస్పెండ్ చేసింది.
సుప్రీంకోర్టు లో విచారణ సందర్బంగా ఆయనను విడుదల చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. దర్యాప్తుకు ఆయన సహకరిస్తున్నారని కూడా పోలీసులు ఉన్నత న్యాయస్థానానికి వివరించారు.
తన సస్పెన్షన్, అరెస్ట్ న్యాయబద్దతపై జయరామ్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది.
గంటల పాాటు విచారణ..
మద్రాస్ హైకోర్టు కిడ్నాప్ కేసుకు సంబంధించి సమన్లు జారీ చేసిన నేపథ్యంలో తమిళనాడులోని తిరువాలంగాడు పోలీస్ స్టేషన్ లో జయరామ్ ను అనేక గంటల పాటు విచారించారు.
విచారణ తరువాత ఆయనను విడుదల చేసినట్లు ప్రభుత్వం ధృవీకరించింది. సీనియర్ ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేయలేదని కోర్టు ఆదేశాల మేరకే ఆయన లొంగిపోయారని, దర్యాప్తులో స్వచ్చందంగా సహకరిస్తున్నారని కూడా తెలిపింది.
Tags:    

Similar News