తెలంగాణలో లొంగిపోతున్న ఛత్తీష్ గడ్ మావోయిస్టులు

భద్రాద్రి-కొత్త గూడెం పోలీసుల ఎదుట లొంగిపోయిన 17 మంది మాయివోస్టులు;

Update: 2025-05-30 12:12 GMT

వచ్చే ఏడాది మార్చి నెల చివరి నాటికి మావోయిస్టు పార్టీని అంతం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన తర్వాత జరుగుతున్న ఆరేషన్ కగార్‌తో మావోయిస్ట్ పార్టీ కకావికలం అవుతోంది. పార్టీ అగ్రనేతలు సెక్యూరిటీ దళాల చేతిలో హతం కావడమో, అరెస్టు కావడమో జరుగుతూ ఉంది. మరొక వైపు లొంగుబాట్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్)కి చెందిన 17 మంది సభ్యులు శుక్రవారం, మే 30న భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా (Bhadradri-Kothagudem District) పోలీసుల ముందు లొంగిపోయారు. వారిలో 14 ఏళ్ల బాలిక కూడా ఉంది. సాయుధపోరాట బాట వీడి, ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలోకి వచ్చేందుకు లొంగిపోయిన మావోయిస్టులకు "ఆపరేషన్ చేయూత’ (Operation Cheyuta) కింద పునరావాసం కల్పిస్తారు.

"ఆపరేషన్ చేయూత" అనేది తెలంగాణ ప్రభుత్వం నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి వారికి పునరావాసం కల్పించడానికి తీసుకువచ్చిన కార్యక్రమం. లొంగిపోయిన నక్సలైట్లకు ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందించడం,విద్య వసతి కల్పించడం, నైపుణ్యాభివృద్ధికోసం శిక్షణ ఇప్పించడం, ఇతర పునరావాస సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. ఛత్తీస్ గడ్ ప్రాంతంలో విపరీతంగా సాయుధ దళాల గాలింపు సాగుతూ ఉండటంతో అక్కడి నక్సలైట్లు సరిహద్దునే ఉన్న తెలంగాణకు వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ఈరోజు లొంగిపోయిన వారంతా మావోయిస్టు ప్రాబల్యం ఉన్న బీజాపూర్. సుక్మా జిల్లాల నుండి వచ్చిన వారే.

ఈ సంవత్సరం ఇప్పటివరకు తెలంగాణలోని భద్రాద్రి-కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో ఆయుధాలు విడిచిపెట్టిన మావోయిస్టుల సంఖ్య పెరుగుతూ ఉంది. పోలీసు వర్గాల ప్రకారం, ఈ సంవత్సరం భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోనే దాదాపు 282 మంది సీపీఐ (మావోయిస్ట్) సభ్యులు లొంగిపోయారు.

ఉన్నత స్థాయి సభ్యులు లొంగిపోవడం

లొంగిపోయిన కార్యకర్తలలో ప్లాటూన్ పార్టీ కమిటీ సభ్యులు (PPCM), మిలిషియా కమాండర్లు వంటి ఉన్నత స్థాయి సభ్యులు ఉన్నారు.

"ఆపరేషన్ చేయూత" కింద సంక్షేమ చర్యలు మరియు అభివృద్ధి కార్యకలాపాల ద్వారా లొంగిపోయిన వారు స్వచ్ఛందంగా ఉన్నారని పోలీసులు తెలిపారు.

ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ మరియు సుక్మా జిల్లాలు మావోయిస్టు కార్యకలాపాలకు కేంద్రంగా ఉంటూ వస్తున్నాయి. బస్తర్ ప్రాంతంలో 2025లో గణనీయమైన మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలు జరిగాయి. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), CRPF సహా భద్రతా దళాలు ఈ సంవత్సరం ఛత్తీస్ గఢ్ లో 168 మంది నక్సలైట్లను మట్టుబెట్టాయి. బస్తర్ డివిజన్ లోనే 151 మందిని హతమార్చాయి.

ఏప్రిల్ 5న భద్రాద్రి-కొత్తగూడెంలో 86 మంది మావోయిస్టులు లొంగిపోయారు.

లొంగిపోయిన మావోయిస్టుల పేర్లు

1) మోడవి హుంగా, వయసు 29 సంవత్సరాలు, ఛత్తీస్ గడ్ లోని సుక్మా జిల్లా, గద్రాస్ నివాసి. ప్లాటూన్ పార్టీ కమిటీ సభ్యుడు (PPCM), సెక్షన్ B, 2వ ప్లాటూన్, 1వ కంపెనీ, PLGA బెటాలియన్.

2) సున్నం లచు, వయస్సు: 25, బీజాపూర్ జిల్లా, బసగుడ పీఎస్ పరిధిలోని మల్లెంపాల్ గ్రామ నివాసి. PPCM, సెక్షన్ A, డిప్యూటీ కమాండర్, 2వ ప్లాటూన్, 1వ కంపెనీ, PLGA 1వ బెటాలియన్.

3) సవలం లలిత, వయస్సు: 22, బీజాపూర్ జిల్లా, ఉసుర్ పీఎస్ పరిధిలోని మారేడుబాక గ్రామ నివాసి. మావోఇస్టు పార్టీ సభ్యుడు (PM), సెక్షన్ A, 2వ ప్లాటూన్, 1వ కంపెనీ, PLGA 1వ బెటాలియన్.

4) మాద్వి షులా, వయస్సు: 23, ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా, జెగురుగొండ పీఎస్ పరిధిలోని పువర్తి గ్రామం, తుమ్రేలి పారా నివాసి. పార్టీ సభ్యురాలు, ఎర్రా DKSZCM ప్రొటెక్షన్ టీం, సౌత్ బస్తర్ డివిజినల్ కమిటీ (DVC).

5) అమ్మాయి, వయస్సు: 14, పార్టీ సభ్యురాలు.

6) నుప్ప లక్ష్మి, వయస్సు: 26, తుమ్మిరిగూడెం గ్రామం, ఉసూర్ పీఎస్ పరిధిలోని బీజాపూర్ జిల్లా పాత్ర: పమేడ్ LOS, సౌత్ బస్తర్ DVC, పార్టీ సభ్యురాలు.

7) కోవాసి అడుమా, వయస్సు: 33, పమేడ్ పీఎస్ పరిధిలోని బీజాపూర్ జిల్లా, గాధిగూడెం గ్రామ నివాసి. పాత్ర: మిలిషియా సభ్యుడు, ధర్మారం RPC, పమేడ్ ఏరియా కమిటీ (AC), సౌత్ బస్తర్ DVC.

8) మడకం సోమడు (అలియాస్ గోపి) వయస్సు: 27, గాధిగూడెం గ్రామ నివాసి, పమేడ్ PS పరిమితులు, బీజాపూర్ జిల్లా. మిలీషియా సభ్యుడు, ధర్మారం RPC, పమేడ్ AC, సౌత్ బస్తర్ DVC.

9) నుప్పా ఉంగి, D/o నుపో మడ్కా, వయస్సు: 28, పువర్తి గ్రామ నివాసి, జేగురుగొండ PS పరిధి, సుక్మా జిల్లా, ఛత్తీస్‌గఢ్. పాత్ర: మిలీషియా సభ్యుడు, పువర్తి RPC, పమేడ్ AC, సౌత్ బస్తర్ DVC.

10) వంజం ఉంగ, వయస్సు: 34, పోలంపల్లి గ్రామ నివాసి, పమేడ్ PS పరిమితులు, బీజాపూర్ జిల్లా, మిలీషియా కమాండర్, ధర్మారం RPC, పమేడ్ AC, సౌత్ బస్తర్ DVC.

11) కల్ము దుద్వా, వయస్సు: 32, రసపాలి గ్రామ నివాసి, పామేడు PS పరిమితులు, బీజాపూర్ జిల్లా. మిలీషియా సభ్యుడు, ఎర్రపల్లి RPC, పమేడ్ AC, సౌత్ బస్తర్ DVC.

12) మడివి కక్మా, వయస్సు: 28, భీమారం గ్రామ నివాసి, ఉసూర్ PS పరిమితులు, బీజాపూర్ జిల్లా. పాత్ర: మిలీషియా సభ్యుడు, పూజారి కంకేర్ RPC, BKASR DVC.

13) మడకం సహదేవ్, వయస్సు: 20, భీమారం గ్రామ నివాసి, ఉసూర్ PS పరిధి, బీజాపూర్ జిల్లా. పాత్ర: మిలీషియా సభ్యుడు, పూజారి కంకేర్ RPC, BKASR DVC.

14) ముచకి దాడే, ( జోగా అనే వ్యక్తి భార్య), వయస్సు: 20, భీమారం గ్రామ నివాసి, ఉసూర్ PS పరిమితులు, బీజాపూర్ జిల్లాజ మిలీషియా సభ్యుడు, పూజారి కంకేర్ RPC, BKASR DVC.

15) కోవాసి నాంధే, వయస్సు: 20, భీమారం గ్రామ నివాసి, ఉసూర్ PS పరిమితులు, బీజాపూర్ జిల్లా, మిలీషియా సభ్యుడు, పూజారి కంకేర్ RPC, BKASR DVC.

16) మడకం హద్మా, S/o కోస, వయస్సు: 25, రసపాలి గ్రామ నివాసి, పామేడు PS పరిధి, బీజాపూర్ జిల్లా, మిలీషియా సభ్యుడు, ఎర్రపల్లి RPC, పమేడ్ AC, సౌత్ బస్తర్ DVC.

17) నుప్పా ముయ, వయస్సు: 40, పువర్తి గ్రామ నివాసి, జేగురుగొండ PS పరిధి, సుక్మా జిల్లా, మిలీషియా డిప్యూటీ కమాండర్, పువర్తి RPC, జాగుర్గొండ AC.

Tags:    

Similar News