తెలంగాణ వ్యాప్తంగా ఎసిబి సోదాలు

అధికారులను చూసి పరారైన బ్రోకర్లు;

Update: 2025-06-26 10:28 GMT

ఎసీబి అధికారులు తెలంగాణ లో ఆర్టీఏ కార్యాలయాల్లో ఏక కాలంలో తనిఖీలు చేస్తున్నారు. అధికారులపై అవినీతి ఆరోపణలు రావడంతో ఎసిబి ఈ సోదాలు చేస్తుంది. హైద్రాబాద్ తిరుమలగిర5, మన్నెగూడ ఆర్టీఏ కార్యాలయాల్లో ఇద్దరు ఏజెంట్లను, 10మంది క్లర్క్ లను ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయంలో మరో పది మందిని ఎసిబి అధికారులు పట్టుకున్నారు. ఆర్టీఏ కార్యాలయాల గేట్లను మూసి సోదాలు చేయడంతో కొందరు బ్రోకర్లు పరారయ్యారు. అక్రమాలు జరుగుతున్నట్టు అధికారులకు సమాచారమందడంతో సుమోటా స్వీకరించి సోదాలు చేస్తున్నారు. దళారీ వ్యవస్థ ఆర్టీ ఏ కార్యాలయాల్లో కొనసాగుతుంది. పైళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రాత్రి వరకు సోదాలు జరిగే అవకాశముంది.


తెలంగాణ వ్యాప్తంగా జరిగి సోదాల్లో   అవకతవకలకు పాల్పడిన ప్రాంతాల్లో  లక్షా ఎనభై ఒక్క వేయి రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఒక్క ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో తొంభై ఒక్క వేయి రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. లంచం అడిగితే  వెంటనే   ఫిర్యాదు చేయాల ని ఎసిబి ఒక ప్రకటనలో తెలిపింది. 

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక యాక్టివ్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఎసిబి యాక్టివ్ అయ్యింది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇద్దరు అవినీతి ఇంజనీర్లను అరెస్ట్ చేసి రిమాండ్ చేసింది.

ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ప్రధాన నిందితుడైన మాజీ మంత్రి కెటిఆర్ ను ఇప్పటికే మూడు పర్యాయాలు విచారించిన ఎసిబి A2 ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు నోటీసులు జారి చేసింది.  ్ యూరప్ పర్యటనలో ఉన్న ఆయన జులై ఒకటో తేదీన విచారణకు రానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఎసిబి చురుకుగా విచారిస్తోంది.

Tags:    

Similar News