అన్ని పార్టీలు కోర్టులో అఫిడవిట్ సమర్పించాలి

బీసీ రిజర్వేషన్లకు మద్దతు తెలిపిన పార్టీలన్నీ కోర్టులోనూ వైఖరి స్పష్టం చేయాలని కోరిన మంత్రి పొన్నం

Update: 2025-10-02 11:48 GMT

శాసనసభలో మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీలన్నీ కోర్టులో బలహీన వర్గాల రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని అఫిడవిట్లు సమర్పించాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. శాసనసభలో ఏకాభిప్రాయంతో బలహీన వర్గాల రిజర్వేషన్ల పెంపుకు మద్దతు తెలిపామని కోర్టుకు తెలపాలని మంత్రి డిమాండ్ చేశారు.గత ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో 50% క్యాప్ తెస్తే ప్రత్యేక సమావేశల ద్వారా ఆ క్యాప్ తొలగిస్తూ చట్టం చేసి గవర్నర్ దగ్గరకు పంపించడం జరిగిందని తెలిపారు. గవర్నర్ దానిని ఆమోదించలేదని,ఆ బిల్లును ఆమోదించాల్సి ఉందన్నారు.

కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో నిర్ణయం తీసుకోకపోవడానికి బీజేపీ నేతల వైఖరే కారణమని విమర్శించారు. తెలంగాణ సమాజం గమనిస్తోందని తెలిపారు. తెలంగాణ నుంచి బీజేపీకి 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారన్నారు. తెలంగాణ శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సంపూర్ణ మద్దతు తెలిపారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లపై తాము ఎక్కడా నిరసన తెలపడం లేదని,సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలిపారన్నారు. ఒకవైపు అలుముకుంటూనే కడుపులో కత్తులు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ పై మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో అన్ని రకాల చర్యలు తీసుకుని న్యాయపరమైన అంశాలపై కూడా ముందుకు వెళ్లిందన్నారు. సజావుగా ఎన్నికలు సాగడానికి ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందని చెప్పుకొచ్చారు.
హుస్నాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శివాలయం వద్ద జరుగుతున్న శమీ పూజలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆపై ఇటీవల గ్రూప్‌లో ఉద్యోగాలు సాధించిన ముగ్గురు అభ్యర్థులను మంత్రి పొన్నం ప్రభాకర్ సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి విజయదశమి జరుపుకుంటామన్నారు. ‘చెడుపై మంచి గెలవాలి,మీ అందరికీ శుభం కలగాలి’ అని ఆకాంక్షించారు.స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
Tags:    

Similar News