ఫస్ట్ బిసీ బిల్లు.. తర్వాతే స్థానిక ఎన్నికలు

కాంగ్రెస్ ను నిందించిన ఆర్ కృష్ణయ్య;

Update: 2025-06-26 09:33 GMT

స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే అంశం పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం పై ఉందని బిజెపి రాజ్య సభ సభ్యులు ఆర్. కృష్ణయ్య అన్నారు. ఇవ్వాల బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30లోపు జరపాలని హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని స్వాగతించారు.

రేవంత్ రెడ్డి చేతుల్లో 

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ ఇచ్చే అంశం కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఉందని అనవసరంగా బిజెపిపై బురద చల్లే ప్రయత్నం జరుగుతుందన్నారు. సుప్రీం కోర్టు కూడా 50 శాతం వరకు రిజర్వేషన్ పెంచుకునే హక్కు ఉందని చెప్పిందని ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేనప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాత్సారం చేస్తుందన్నారు. అసెంబ్లీలో బీసీ బిల్లుకు అన్ని పార్టీలు సుముఖంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందన్నారు.

సలహాల కోసమే కవిత

ఇటీవలె బిఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత తన వద్దకు సలహాల కోసమే వచ్చినట్లు ఆర్. కృష్ణయ్య చెప్పారు. బిసీ బిల్లు ఈ స్థానిక సంస్థల ఎన్నికలలోపు అమలుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. బిసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక సంస్థలకు నిర్వహించకూడదని ఆయన అన్నారు. సర్పంచ్ నుంచి అన్ని ఎన్నికలకు ఇది వర్తిస్తుందన్నారు

Tags:    

Similar News