ఆదివారం రెండో పూజ కోసం ప్రత్యేక ఏర్పాట్లు
ఆదివారం రెండో పూజ కోసం ప్రత్యేక ఏర్పాట్లు;
తెలంగాణ ప్రాంతంలో అత్యంత భక్తి శ్రద్దలతో జరిగే ఆషాడ మాస బోనాలు గోల్కొండ జగదాంబికా దేవాలయంలో గత గురువారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రతీ గురువారం, రెండో పూజ ఆదివారం బోనాలు ఉండటంతో తెల్లవారు జామునుంచి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు గోల్కోండ అమ్మవారి దగ్గరికి చేరుకోవడంతో భక్తులతో గోల్కొండ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల కోసం రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఈ నెల 26న గోల్కొండ జగదాంబఅమ్మవారికి బంగారు బోనంతో తొలి పూజ ప్రారంభమైంది. ఆదివారం రెండో పూజ జరిగింది. గురు, ఆదివారం బోనాలు మొక్కులు సమర్పించుకుంటారు. నెల రోజుల పాటు 9 పూజల అనంతరం బోనాలు వేడుకలు ముగుస్తాయి. ఆఖరి బోనం సమర్పించడంతో హైద్రాబాద్ లో ఆషాడమాస బోనాలు గోల్కొండ అమ్మవారితో ముగుస్తాయి. మిగతా జిల్లాల్లో శ్రావణ మాసంలో ప్రారంభమౌతాయి.
బిఆర్ ఎస్ హాయంలోనే రాష్ట్ర పండుగ
వరుసగా పదేళ్లు పాలించిన బిఆర్ ఎస్ ప్రభుత్వం బోనాలు పండగను రాష్ట్ర పండుగగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. చిన్న చిన్న అమ్మవారి గుళ్లను ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కో గుడికి కనీసం పదిహేను వేల రూపాయలను విడుదల చేస్తూ వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తోంది. ఈ సంవత్సరం బోనాలు వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై కోట్ల రూపాయలను విడుదల చేసింది.