డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ : రేవంత్ రెడ్డి

డ్రగ్స్ ప్రోత్సహించిన విద్యా సంస్ఠల లైసెన్స్ రద్దు;

Update: 2025-06-26 14:13 GMT

తెలంగాణలో డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అంతర్జాతీయ డ్రగ్స్ నియంత్రణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుతమున్నయాంటీ నార్కోటిక్స్ ఫోర్స్ స్థానే ఈగల్(ఎలైగ్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ ఫోర్స్ మెంట్ ) ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.

తెలంగాణ ఏర్పాటు కావడానికి విద్యార్థులు కీలక పాత్ర పోషించారని,నాడు ఉద్యమానికి ఊపిరిలూదిన విద్యార్థులు డ్రగ్స్ కు బానిన కావడం తనను కలచి వేసిందన్నారు. పాఠశాలల నుంచి యూనివర్శిటీల వరకు విద్యార్థులు డ్రగ్స్ కు బలవుతున్నారని అన్నారు. డ్రగ్స్ రహిత తెలంగాణకు నేటి నుంచే కలిసి నడుద్దామన్నారు.

ఈగల్ జల్లెడపడుతుంది

రాష్ట్రంలో డ్రగ్స్ కార్యకలాపాలను ఈగల్ నిశితంగా గమనిస్తుందన్నారు. శిక్షణ పొందిన ఈగల్ ఫోర్స్ జల్లెడ పడుతుందన్నారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసంప్రజా ప్రభుత్వంతో ప్రతి ఒక్కరూ కలిసి నడవాలని ఆయన పిలుపునిచ్చారు.

నేటి యువత డ్రగ్స్, గంజాయికి జీవితాలను చిద్రం చేసుకుంటున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. , మత్తు పదార్థాలకు యువత ఎక్కువగా బానిస అవుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాసంస్థల్లో మత్తు పదార్థాలకు అలవాటవుతున్నారని, ఒకవేళ అలా జరిగితే ఆయా విద్యాసంస్థల లైసెన్స్ రద్దు చేస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, అనీల్ కుమార్ యాదవ్, ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు, సినీ నటులు రాంచరణ్ , విజయ్ దేవరకొండ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News