మిస్ వరల్డ్ విజేతలకు గవర్నర్ సన్మానం, తేనీటి విందు

తెలంగాణ రాజ్‌భవన్‌లో మిస్ వరల్డ్ విజేతలు సందడి చేశారు. అందాల భామలకు గవర్నర్ విష్ణు దేవ్ శర్మ తేనీటి విందు ఇచ్చారు.;

Update: 2025-06-02 13:58 GMT
రాజ్ భవన్ లో ఫొటో షూట్ లో పాల్గొన్న అందాల భామలు

హైదరాబాద్ లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో విజేతలకు రాజ్ భవన్ లో గవర్నర్ విష్ణు దేవ్ శర్మ తేనీటి విందు ఇచ్చారు.రాజ్ భవన్ లో మిస్ వరల్డ్ ( MISS WORLD-2025) విజేతల అభినందన కార్యక్రమం కోలాహలంగా సాగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ కృష్ణా రావు, డీజీపీ జితేందర్, పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.




 మిస్ వరల్డ్ విజేతలకు ఘన స్వాగతం

రాజ్ భవన్ కు హాజరైన మిస్ వరల్డ్ ఓపల్ సుచాత శ్రీ, ఇతర ఖండాల మిస్ వరల్డ్ విజేతలకు గిరిజన కళాకారులు సంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు.గిరిజనులు తయారుచేసిన అటవీ ఆకులతో రూపొందించిన స్వాగత వేదిక వద్ద ఫోటోషూట్ లో మిస్ వరల్డ్ విజేతలు పాల్గొన్నారు.72 వ మిస్ వరల్డ్ థాయిలాండ్ భామ ఓపల్ సుచాతా చుయాంగ్‌ శ్రీ, ఆఫ్రికా కాంటినెంటల్ విజేత ఈథియోపియా హస్సెట్ దేరేజే (Hasset Dereje), యూరప్ కాంటినెంటల్ మిస్ పోలాండ్ మజ క్లాజ్డా (Maja Klajda), అమెరికన్- కరీబియన్ కాంటినెంటల్ విజేత మార్టినిక్ కు చెందిన ఆరెల్ల జోఅచ్ఛిమ్ (Aurélie Joachim)లు గవర్నర్ తేనీటి విందులో పాల్గొన్నారు.



హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో మిస్ వరల్డ్ 2025 విజేతలకు గవర్నర్ విష్ణుదేవ్ శర్మ, సీఎం రేవంత్ రెడ్డిలు సత్కరించారు.రాజ్ భవన్ లో మిస్ వరల్డ్ 2025 విజేతల సన్మాన కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు.




 మిస్ వరల్డ్ 2025 జ్యూరీకి అభినందనలు

మిస్ వరల్డ్ 2025 జ్యూరీలో మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈఓ జూలియా మోర్లీ, బాలీవుడ్ నటుడు సోను సూద్, సుధా రెడ్డి, ఐఎఎస్ అధికారి జయేష్ రంజన్,మిస్ ఇంగ్లాండ్ 2014 డాక్టర్ కరీనా టైరెల్,మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిస్కోవా,మిస్ వరల్డ్ 2017 మనుషి చిల్లార్,మాజీ అందాల రాణి నమ్రతా శిరోద్కర్ ,నటుడు రాణా దగ్గుబాటిలు సభ్యులుగా ఉన్నారు. మిస్ వరల్డ్ విజేతలను ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులను అభినందించారు.


Tags:    

Similar News