మిస్ వరల్డ్ విజేతలకు గవర్నర్ సన్మానం, తేనీటి విందు
తెలంగాణ రాజ్భవన్లో మిస్ వరల్డ్ విజేతలు సందడి చేశారు. అందాల భామలకు గవర్నర్ విష్ణు దేవ్ శర్మ తేనీటి విందు ఇచ్చారు.;
హైదరాబాద్ లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో విజేతలకు రాజ్ భవన్ లో గవర్నర్ విష్ణు దేవ్ శర్మ తేనీటి విందు ఇచ్చారు.రాజ్ భవన్ లో మిస్ వరల్డ్ ( MISS WORLD-2025) విజేతల అభినందన కార్యక్రమం కోలాహలంగా సాగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ కృష్ణా రావు, డీజీపీ జితేందర్, పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.
మిస్ వరల్డ్ విజేతలకు ఘన స్వాగతం
హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో మిస్ వరల్డ్ 2025 విజేతలకు గవర్నర్ విష్ణుదేవ్ శర్మ, సీఎం రేవంత్ రెడ్డిలు సత్కరించారు.రాజ్ భవన్ లో మిస్ వరల్డ్ 2025 విజేతల సన్మాన కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు.
మిస్ వరల్డ్ 2025 జ్యూరీకి అభినందనలు