హీరో రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్

హీరో రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడంటూ ప్రియురాలు లావణ్య పెట్టిన కేసులో ట్విస్ట్ నెలకొంది.

Update: 2024-07-05 12:11 GMT

హీరో రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడంటూ ప్రియురాలు లావణ్య పెట్టిన కేసులో ట్విస్ట్ నెలకొంది. రాజ్ తరుణ్ నన్ను మోసం చేసి వేరే అమ్మాయితో తిరుగుతున్నాడంటూ ప్రియురాలు ఫిర్యదు చేస్తే.. లేదు తనే నన్ను మోసం చేసి వేరే అబ్బాయితో తిరుగుతుంది, పైగా డ్రగ్స్ తీసుకుంటోంది అంటూ రాజ్ తరుణ్ చెబుతున్నాడు. ప్రస్తుతం రాజ్ తరుణ్ ప్రేమ కథా చిత్రం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఇదే విషయంపై సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చర్చలు కొనసాగుతున్నాయి.

రాజ్ తరుణ్ పై కేసు...

తెలుగు నటుడు రాజ్ తరుణ్, నటి మాళవి మల్హోత్రాపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రాజ్ తరుణ్ వేరే హీరోయిన్‌తో అఫైర్‌ పెట్టుకొని తనని వదిలేశాడని పేర్కొంటూ లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. "రాజ్ తరుణ్, నేను 11 ఏళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నాము. గతంలో మేమిద్దరం గుళ్లో పెళ్లి చేసుకున్నాం. తన సినిమాలో నటిస్తున్న ఓ హీరోయిన్‌తో అఫైర్‌ పెట్టుకొని నన్ను వదిలేశాడు.. రాజ్ మూడు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి.. నాకు దూరంగా ఉంటున్నాడు. ఇద్దరూ కలిసి ఓ ఇంట్లో ఉంటున్నారు. రాజ్‌ తరుణ్ ను వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని నన్ను బెదిరిస్తున్నారు. గతంలో నన్ను డ్రగ్స్‌ కేసులో నన్ను కావాలనే ఇరికించారు. అరెస్టై 45 రోజులు జైల్లో ఉన్నా కూడా రాజ్‌ నాకు ఎలాంటి సాయం చేయలేదు" అని లావణ్య తన ఫిర్యాదులో వెల్లడించింది.

పోలీస్ కేసుపై స్పందించిన రాజ్ తరుణ్..

హీరో రాజ్ తరుణ్ తనని మోసం చేశాడంటూ ప్రేయసి లావణ్య కేసు పెట్టడంపై హీరో రాజ్ తరుణ్ స్పందించారు. "ఆమె నన్ను మోసం చేసింది.. నేను తనను మోసం చేయలేదు. ఆమెతో ఇంతకుముందు రిలేషన్ లో ఉన్నాను. కానీ లావణ్య డ్రగ్స్ వాడడం మొదలుపెట్టింది. వేరే అబ్బాయితో రిలేషన్ షిప్ లో ఉంది. లావణ్య టార్చర్ భరించలేకపోయా.. నేను ఏదైనా లీగల్‌గానే ఫైట్ చేస్తా" అని రాజ్ తరుణ్ చెప్పారు.

Tags:    

Similar News