ఈ ఏడాది ఆషాఢ బోనాలకు రు. 20 కోట్లు రిలీజ్
జూన్ 26 నుంచి ప్రారంభం;
ఈ ఏడాది ఆషాఢం బోనాల పండుగలను ఘనంగా నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రు. 20 కోట్లు విడుదల చేసింది. ఈ ఏడాది బోనాలు జూన్ 26 నుంచి జూలై 27 వరకు జరగనున్నాయి. దేవదాయ శాఖతోపాటు, ప్రైవేట్ ట్రస్టుల ఆధ్వర్యంలో నడుస్తున్న మొత్తం 3026 గుడుల కోసం ఈ నిధులు విడుదల చేస్తారు.
ఆలయాలను వైభవంగా ముస్తాబు చేసేందుకు పెయింటింగ్స్,డేకరెషన్స్ కోసం ఈ నిధులు ఖర్చు చేస్తారు. నగంరలోని 28 ముఖ్యమయిన ఆలయాల్లో ప్రముఖలతో పట్టు వస్త్రాల సమర్పణ జరుగుతుంది. అవసరమయిన చోట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏనుగులను రప్పిస్తారు. బోనాల సందర్బంగా సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.
తెలంగాణ ప్రభుత్వం, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆషాఢ జాతర బోనాల ఉత్సవాలు 2025 ఘనంగా జరగబోతున్నాయి. ఈ ఏడాది బోనాల ఉత్సవాలు, ఏర్పాట్లపై MCRHRD లో అధికారుల సమన్వయ సమావేశం జరిగింది. సమావేశానికి హైదరాబాద్ ఇంచార్జ్ పొన్నం ప్రభాకర్, మంత్రి కొండా సురేఖ, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, డిజిపి జితెందర్, సిపిసివి ఆనంద్,ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, ఎండోన్మెంట్, మూడు కమిషనరెట్ల సీపీ లు, డీసీపీ లు, పోలీస్ , ఎండోన్మెంట్ అన్ని విభాగాల అధికారులు హాజరయ్యారు.
నగరంలో ప్రధాన ప్రాంతాలలో జరిగే బోనాల కార్యక్రమం
గోల్కొండ బోనాలు ప్రారంభం మొదటి పూజ 26.06.25..
గోల్కొండ బోనాల జాతర 28.06.25
సికింద్రాబాద్ బోనాలు, లష్కర్ బోనాలు 13.07.25
ఓల్డ్ సిటీ లాల్ దర్వాజ్ బోనాలు 20.07.25.
గోల్కొండ జనగాంబిక అమ్మవారు తొలి బోనం తో ప్రారంభం అయ్యే బోనాలలతో పాటు బాల్కంపేట అమ్మవారి కళ్యాణం, లస్కర్ లాల్ దర్వాజ్, అమ్మవారి అంబారి ఊరేగింపు, రంగం కార్యక్రమాలు అన్ని సక్రమంగా జరిగేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నామని రవాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తర్వాత మీడియా కు చెప్పారు.
ఈసారి బోనాలకు ప్రభుత్వం 20 కోట్లు రిలీజ్ చేసింది. నూతన దేవాలయాలు తోడయ్యాయి కాబట్టి ఇంకో 10శాతం ఫండ్స్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
‘ఎండోమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ చెక్కులు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం త్వరగా పూర్తి చేయాలి. డ్యూటీ లా కాకుండా ప్రతి ఒక్కరు అమ్మవారి ఆజ్ఞతో సేవ చేస్తున్నామని అనుకోవాలి. ‘హైదరాబాద్ కి షాన్’ బోనాలు విస్తృతంగా ప్రచారం చేయాలి,’ అని పొన్నం అన్నారు.