ఇంజినీర్లకు ఎటిఎం అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్

కెసిఆర్ డైరెక్షన్ లోనే కథ నడిచిందా ?;

Update: 2025-06-15 01:00 GMT

కాళేశ్వరం లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కెసిఆర్ ప్యామిలీకి ఎటిఎం మాదిరిగా ఉఫయోగపడుతుందని రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే.

గతంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ దాదాపు ఇదే అభి ప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేస్తూ ఇటువంటి ప్రకటనలు చేస్తుంటాయి అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది . కెసిఆర్ ఆలోచనల ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగి ఉండవచ్చు.

తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ కోసం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నియమించింది. ఈ విచారణలో మాజీ ముఖ్యమంత్రి కెసీయార్ ఇప్పటికే నోటీసులు అందుకుని విచారణకు హాజరయ్యారు. కెసాఆర్ , హరీష్ రావుల విచారణకు హాజరయ్యారు. పీసీ ఘోష్ నివేదిక ప్రకారం కెసిఆర్ , హరీష్ రావు ల అవినీతికి సంబంధించిన ఆధారాలు బయటపడతాయని కాంగ్రెస్ చెబుతోంది. ఇప్పటివరకైతే కెసీఆర్ అవినీతి బయటపడలేదు.కానీ ఇంజనీర్లు అవినీతికి పాల్పడినట్టు పక్కా ఆధారాలు బయటపడుతున్నాయి. ప్రభుత్వ పెద్దల జోక్యం లేనిదే అధికారులు అవినీతికి పాల్పడుతారా అనేది సందేహమే. నిజం చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్లకు బంగారు బాతు అయ్యిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంజనీర్లకు కల్పతరువుగా మారిందనే అభిప్రాయం వ్యక్తమౌతుంది. ఇప్పుడిప్పుడే ఆధారాలు బయటపడుతున్నాయి.

కోట్లకు పడగలెత్తిన ఇంజనీర్లు

మామూలుగా వంద కోట్లు , రెండు వందల కోట్లు ఆస్తులెవరికి ఉంటాయి. వ్యాపారస్థులుకు, పరిశ్రమల వోనర్లకు, స్మగ్లర్లకు, మాఫియా డాన్ లకు, పొలిటీషన్లకు ఉంటాయి. నెలనెలా జీతాలు తీసుకుని ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్లకు ఎదురుచూస్తుండే ప్రభుత్వోద్యోగులకు కోట్ల ఆస్తులు ఎట్లా లెక్కించిన రావు. అయితే, తెలంగాణలో  కాళేశ్వరం ఇంజినీర్లే  కోట్లకుకోట్లు ఆస్తులు సంపాయించారు.పోనీ వీళ్ల పూర్వీకులెవరై నా జమిందారాలో, భూస్వాములా కాదు. తిండికి లేక నానా ఇబ్బందులు పడి పిల్లలను చదివించినవాళ్లే. తెలంగాణ గురించి మాట్లాడుకునేటపుడు ఒక మాట చెప్పుకోవాలి. అవినీతిలో భారతదే శంలో టాప్ పది  రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేనల్, లోకల్ సర్కిల్   (Transparency International and Local Circle survey on corruption) జరిపిన ఒక సర్వే ప్రకారం అవినీతి భావనలో తెలంగాణలో ఐదో స్థానంలో ఉంది. మొదటి నాలుగు స్థానాలు రాజస్థాన్, బీహార్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్ లవి.

అవినీతి హింస భరించలేక ఎమ్మార్వోని సజీవంగా దహనం చేసిన సంఘటన ఈ రాష్ట్రంలోనే జరిగింది. ఇలాంటి రాష్ట్రంలో లక్ష కోట్ల కాళేశ్వరం అనే ప్రాజక్టు రావడం అవినీతి రాజకీయనాయకులకు, అధికారలకు పండగయింది. ఈ ప్రాజక్టు అక్షరాల అందరికి  ఎటిఎం అయిపోయిందా అనిపిస్తుంది. దీనికి ఇటీవల జరిగిన రెండు అవినీతి నిరోధక శాఖ దాడులే సాక్ష్యం.

ఎసిబి దాడులు

కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షించిన అధికారి, నీటిపారుదల శాఖ ఈఈ నూనే శ్రీధర్ కళ్లు చెదిరే ఆస్తులు కూడ బెట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇళ్లు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు నిర్వహించిన సోదాల్లో 60 కోట్ల ఆస్తులు గుర్తించినట్టు ఏసీబీ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. అనధికారికంగా వందల కోట్ల రూపాయల ఆస్తులున్నట్టు సమాచారం. హైద్రాబాద్ లోని తెల్లాపూర్ లో ఒక విల్లా, షేక్ పేటలో ప్లాట్, అమీర్ పేటలో కమర్షియల్ బిల్డింగ్ తో పాటు కరీంనగర్ లో మూడు ఓపెన్ ప్లాట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. హైదరాబాద్, కరీంనగర్ , వరంగల్, నగరాల్లో మూడు ఇండిపెండెట్ ఇళ్లు, 16 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ వివిధ ప్రాంతాల్లో 19 ఓపెన్ ప్లాట్లు శ్రీధర పేరు మీద ఉన్నట్టు బయటపడింది. వీటితో పాటు రెండు కార్లు, పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు , బ్యాంకు ఖాతాల్లో భారీగా నిల్వలు కూడా ఎసిబి అధికారులు కనుగొన్నారు. ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో వందల కోట్లలో ఉంటుందని ఏసీబీ ప్రాథమికంగా అంచనా వేస్తోంది.

నూనె శ్రీధర్ ప్రస్తుతం ఎస్ఆర్ ఎస్సీ డివిజన్ 8లో ఈఈగా విధులు నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 6,7, 8 ప్యాకేజీలను పర్యవేక్షించారు. ఎసిబి దాడులతో ఆరంకెల జీతం దాటని ఇంజనీర్తకు కోట్లాది రూపాయల ఆర్జన ఎలా వస్తుంది అనే ప్రశ్న ఉత్పన్నమైంది.

గతంలో హరి రాం అనే ఇంజినీర్ ఏకంగా 200 కోట్ల రూపాయలను కూడబెట్టిన విషయం బయటపడింది. గజ్వేల్ లో హరిరామ్ కు భారీగా ఆస్తులున్నట్టు వెల్లడైంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్ చీఫ్ గా హరిరామ్ పని చేశారు. ప్రస్తుతం హరి రామ్ 14 రోజుల రిమాండ్ లో ఉన్నారు.

 

కాళేశ్వరం ఆఫిసర్లకు  టెన్షన్

కాళేశ్వరం ఆఫీసర్లకు ఏసీబీ టెన్షన్ పట్టుకుంది. తమపై దాడులు జరిగే అవకాశం ఉందని అధికారులు బయటపెడుతున్నారు. ప్రాజెక్టు టెండర్ల నుంచీ అవినీతి జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. పంప్ హౌజ్ లలోనే 14వేల కోట్ల అక్రమాలను కాగ్ తేల్చింది. విజిలెన్స్ రిపోర్ట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చర్యలను ప్రారంభించింది. త్వరలో మరికొందరు అధికారులపై ఎసిబి దాడులు చేసే అవకాశం ఉంది. పై స్థాయిలో వేల కోట్ల స్కామ్ జరిగి ఉండొచ్చు.

వరదలై పారిన అవినీతి

లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాల కు సాగు నీరు అందిస్తానని చెప్పిన కెసీఆర్ ప్రభుత్వం రైతులకు నీరు అందిందో తెలియదు గానీ అవినీతి వరదలై పారింది. కాళేశ్వరం టెండర్ల అప్పగింత నుంచి ప్రాజెక్టు ప్రారంభించేంత వరకు అడుగడుగునా అవినీతి జరిగిందన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా కాంట్రాక్ట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరించినందుకు క్రిందిస్థాయి అధికారుల నుంచి రాజకీయ నాయకుల వరకు భారీగా కమీషన్లు నడిచినట్టు ప్రచారంలో ఉంది. అయితే రాజకీయ నాయకుల విషయం పక్కన పెడితే అధికారులు మాత్రం భారీగా అవినీతికి పాల్పడ్డారు. ఇద్దరు ఇంజినర్ల దగ్గర వందల కోట్ల ఆస్తులు బయటపడ్డాయి. అమిత్ షా చెప్పినట్టు కాళేశ్వరం ప్రాజెక్టు కెసిఆర్ ఫ్యామిలీకి ఎటిఎం మెషీన్ గా ఉపయోగపడిందో తెలియదు గానీ ఇంజినీర్తకు మాత్రం ఎటిఎం మెషీన్ మాదిరిగా ఉపయోగపడింది అని చెప్పొచ్చు.

అవినీతి ఇంజినీర్లకు ఇక చిప్పకూడు

కాళేశ్వరం అవినీతి విషయంలో బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాటలు వింటుంటే నవ్వొస్తుంది. మా నాయన కెసిఆర్ వెంట్రుక కూడా పీకలేరని కెటిఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఈ మధ్య తరచుగా ఆయన ప్రకటనలు చేస్తున్నారు.వందల కోట్ల ఆస్తులు కూడబెట్టిన ఇంజినీర్లకు బిఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచిందని చెప్పడం నిర్వివాదాశం. అవినీతికి పాల్పడిన ఇంజనీర్ల ను కటకటాల వెనక్కి పంపాల్సిన గత ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది. గత ప్రభుత్వం చేసిన తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం చేయకూడదని పలువురు కోరుతున్నారు. అవినీతి ఇంజినీర్లపై ఉక్కుపాదం మోపే బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వ భుజ స్కందాలపై ఆధారపడి ఉంది.

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పని చేసిన క్రింది స్థాయి అధికారులే ఒక్కొక్కరూ వందల కోట్లు కమిషన్లు తీసుకుంటే నిర్ణయాత్మక స్థాయిలో ఉన్నవారు ఇంకెంత దోచుకుని ఉంటారో నన్న చర్చ నీటిపారుదలా శాఖలో ఉంది. లక్ష కోట్ల ప్రాజెక్టు గంగలో కొట్టుకు పోయింది. రాష్ట్ర ఖజానా కూడా గంగలో కల్సిపోయింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విజిలెన్స్ రిపోర్టు ఆధారంగానే అవినీతి అధికారులపై చర్యలకు ఉఫక్రమించినట్టు తెలుస్తోంది. కాళేశ్వం ప్రాజెక్టుకు కథ, స్క్రీప్లే, దర్శకత్వం బిఆర్ ఎస్ నేతలే ఉండొచ్చు గాక ప్రస్తుతం ఇంజినీర్లు మాత్రమే నేరస్తులు అనే విషయం బయటపడింది. రానున్న రోజుల్లో మరికొందరు బిఆర్ఎస్ నేతలు నేరస్థులుగా నిరూపితం కానున్నారు.

 

17 మంది ఇరిగేషన్ అధికారులపై క్రిమినల్ చర్యలు

కాళేశ్వరం ఎత్తి పోతల ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ తన పూర్తి స్థాయి నివేదికను ఇటీవల బయటపెట్టింది. ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 17 మంది నీటి పారుదలా శాఖ ఇంజినీర్లపై చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి సంస్థపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ స్పష్టం చేసింది.

1. భూపతి రాజు నాగేంద్రరావు ఇంజినీర్ ఇన్ చీఫ్ ( ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ )

2. తోడుపునూరి శ్రీనివాస్ , చీఫ్ ఇంజినీర్, ఇరిగేషన్ ఆదిలాబాద్, గతంలో చీఫ్ ఇంజినీర్, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్

3. వి. ఫణి భూషణ్ శర్మ డైరెక్టర్ ఆప్ వర్క్స్ , అకౌంట్స్, తెలంగాణ; హైద్రాబాద్

4. మహమ్మద్ అజ్మల్ ఖాన్, డిప్యూటి చీఫ్ ఇంజినీర్

5. కొట్టే సుధాకర్ రెడ్డి చీఫ్ ఇంజినీర్(ఇరిగేషన్), జగిత్యాల

6. సూదగోని సత్యనారాయణ, డిప్యూటి సూపరింటెండింగ్ ఇంజినీర్

7. బి. వెంకట రమణారెడ్డి, గతంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డివిజన్, డివిజన్ 1 మహదేవ్ పూర్

8. సర్దార్ ఓంకార్ సింగ్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, గతంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డివిజన్ 1 మహదేద్ పూర్

9. తిరుపతిరావు, గతంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, కాళేశ్వరం ప్రాజెక్ట్ డివిజన్

10. బానోతు నందా,గతంలో డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్,

11. అజ్మీరా సురేష్ కుమార్, డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్

12. ఎల్ భీమ రాజు డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మరో 20మందికి జరిమానా

విజిలెన్స్ రిపోర్ట్ లో మాజీలు

విజిలెన్స్ రిపోర్ట్ లో ఇంజినీర్ల అవినీతి బయటపడింది.మాజీ ఈ ఎన్సీలు, ప్రస్తుత సిఈలు, ఎస్ ఈల పేర్లు బయటపడ్డాయి. 37 మంది ఇంజినీర్లపై పెనాల్టి వేయాలని విజిలెన్స్ సూచించింది. 7 మంది రిటైర్ ఇంజినీర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసిన అధికారుల జాబితాను విజిలెన్స్ విడుదల చేసింది. అధికారులపై జరిమానాకు విజిలెన్స్ సిఫారసు చేసింది.

Tags:    

Similar News