KTR | కేటీఆర్ గారు ఇంత ఘనం మీ ఆస్తులు ఎలా పెరిగాయి?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ పీఆర్వో బోరెడ్డి అయోధ్య రెడ్డి ఎక్స్ సోషల్ మీడియాలో సంచలన ట్వీట్ చేశారు. కేటీఆర్ ఆస్తులు ఎలా పెరిగాయని ఆయన ప్రశ్నించారు.;

Update: 2025-02-13 08:01 GMT
కేటీఆర్ తో ఎమ్మెల్సీ పోచంపల్లి ఆలింగనం (ఫొటో :ఎక్స్ సౌజన్యంతో)

2009వ సంవత్సరంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి, ప్రస్థుత సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆస్తులు రూ.4.35కోట్లు ఉంటే, ప్రస్థుతం 53.31 కోట్లకు ఎలా పెరిగాయని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి చీఫ్ పీఆర్వో బోరెడ్డి అయోధ్య రెడ్డి ఎక్స్ లో ప్రశ్నించారు.

‘‘మీ ఆస్తులు ఇంత ఘనం పెరగడానికి ఇలాంటి వ్యాపారాలేనా..?? ఇంకా ఏమైనా బయటకు రావాలిసినవి ఉన్నయా...??’’అంటూ ఆయన పేర్కొన్నారు. కేటీఆర్ ను ఉద్ధేశించి పెట్టిన ఎక్స్ పోస్టులో ‘‘భీమవరం నుంచి బోస్టన్ దాకా స్పందించే మీరు... దీనికి కూడా స్పందిస్తారని ఆశిస్తున్నా’’ అంటూ సోషల్ మీడియాలో ఆయన పేర్కొన్నారు.

ఈ పోస్టును కేసీఆర్, హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డికి, వేం నరేందర్ రెడ్డికి, మన్నె సతీష్ లకు ట్యాగ్ చేశారు.


హైదరాబాద్ నగర శివారులోని ఓ ఫాం హౌస్‌లో కోడి పందేలు, భారీ గా నగదు పట్టివేతను అయోధ్య రెడ్డి ప్రస్థావించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డితో కేటీఆర్ కలిసి ఉన్న ఫొటోను కూడా ఆయన జత చేశారు.
ఎమ్మెల్సీ పోచంపల్లికి మొయినాబాద్ మండలం తోలు కట్ట గ్రామంలోని 165వ సర్వేనంబరులో ఉన్న ఆరు ఎకరాల భూమి ఈసీతోపాటు భూమి వివరాలను ఎక్స్ లో పోస్టు చేశారు.
30 లక్షల రూపాయల నగదు, 55 లగ్జరీ కార్లను పోలీసులు సీజ్ చేసిన విషయాన్ని చీఫ్ పీఆర్వో తెలిపారు.86 పందెం కోళ్ళు, పెద్ద మొత్తంలో బెట్టింగ్ కాయిన్స్, పేకాట స్వాధీనం చేసుకున్న విషయాన్ని ప్రస్థావించారు. పందెం కోళ్ల కోసం వాడే 46 కోడి కత్తులు కూడా స్వాధీనం చేసుకున్నారని బోరెడ్డి గుర్తు చేశారు.


Tags:    

Similar News