మాదాపూర్, బోరబండ జనాలకు ప్రమాద హెచ్చరిక
అందిన ఫిర్యాదుల ఆధారంగా పీసీబీ రంగంలోకి దిగి నీటి శాంపుల్స్ కలెక్ట్ చేసి పరీక్షలు చేయించేందుకు ల్యాబుకు పంపింది.;
మాదాపూర్, బోరబండ ప్రాంతాల్లో ఉంటున్న జనాల్లో ఈమధ్య అనారోగ్యాలు పెరిగిపోతున్నాయి. దీనికి కారణం ఏమిటో ఎవరికీ అంతబట్టడంలేదు. అనారోగ్యాలతో తమదగ్గరకు వస్తున్న రోగులకు డాక్టర్లు పరీక్షలు చేయించి మందులు రాసిస్తున్నారు. అయితే సమస్య అక్కడితో ఆగకుండా మళ్ళీ మళ్ళీ తిరగబెడుతోండుటంతో జనాల్లో కొందరికి అనుమానం వచ్చింది. దాంతో విషయం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(పీసీబీ)కి చేరింది. అందిన ఫిర్యాదుల ఆధారంగా పీసీబీ రంగంలోకి దిగి నీటి శాంపుల్స్ కలెక్ట్ చేసి పరీక్షలు చేయించేందుకు ల్యాబుకు పంపింది. ల్యాబు పరీక్షల్లో షాకింగ్ రిజల్ట్స్ బయటపడ్డాయి. ఇంతకీ విషయం ఏమిటంటే మాదాపూర్, బోరబండ ప్రాంతాల్లో సున్నంచెరువు అనే చెరువుంది. ఆ చెరువులోని నీటిని జనాల్లో ఎక్కువమంది ఉపయోగించుకుంటన్నారు.
ఈ ప్రాంతాల్లోని విద్యాసంస్ధలు, హాస్టళ్ళు, హోటళ్ళు, కన్వన్షన్ సెంటర్లు, ఫంక్షన్ హాస్టళ్ళు చాలానే ఉన్నాయి. అంటే లక్షల్లో జనాలు చాలాకాలంగా సున్నంచెరువులోని నీటినే ప్రతిరోజు వాడుతున్నారు. ఈ చెరువులోని నీటిని ప్రతిరోజు వందల ట్యాంకర్లు చుట్టుపక్కల ప్రాంతాల్లో సరఫరా చేస్తోంది. ఈ నీటిలో సీసం, కాడ్మియం అనే లోహాలు మోతాదుకు మించి ఉన్నాయని ఇపుడు తేలింది. ప్రమాదకరమైన సీసం, కాడ్మియం లోహాలు కలిసిన మంచినీటిని ప్రతిరోజు వాడుతుండటంతో జనాల్లో అనారోగ్యం పెరిగిపోతోందని తేలింది. చెరువులో మోతాదుకు మించి సీసం, కాడ్మియం లోహాలు ఉన్నట్లు పీసీబీ పరీక్షల్లో తేలటం ఇపుడు సంచలనంగా మారింది. మరి జనాలు ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ప్రభుత్వం అంటే ఇప్పటికిప్పుడు తీసుకోబోయే ప్రత్యామ్నాయ చర్యలు పెద్దగా ఏమీ ఉండవు. కాబట్టి జనాలే ఎవరి ప్రత్యామ్నాయ మార్గాలను వాళ్ళే వెతుక్కోవాలి.