తెలంగాణ రాజకీయాల్లో చర్చ ఏదీ, అంతా రచ్చయే....

ఏదో ఒక పార్టీ వైపు మొగ్గు చూపుతూ ప్రజల బాధల కన్నా రాజకీయాలను నడిపించడానికే తెలంగాణ మీడియా ఇష్టపడుతున్నది.;

Update: 2025-06-13 11:33 GMT
Click the Play button to listen to article

ప్రధాన విషయాల పైన ప్రజలు చర్చించకుండా, వాటి పైన దృష్టి సారించకుండా, చర్చలు జరగకుండా, ప్రధాన అంశాలు ఎజెండా నుంచి పక్కదారి పడుతున్నాయి. ప్రభుత్వాల పరిపాలన తీరుపై కన్నా , మీడియా ప్రతిపక్షాలకు ప్రాముఖ్యత ఇస్తున్నాయి. అందువలన ప్రధాన స్రవంతి విషయాల పైన చర్చలు నామమాత్రంగా జరుగుతున్నాయి.

ముఖ్యంగా 1983 తర్వాత రాజకీయాలను శాసించి నాయకులను నడిపించ పచ్చని అనుకుంటూ వస్తున్నాయి. ఆయా రాజకీయ పార్టీలకు వెన్ను దన్నుగా నిలిచి ప్రభుత్వాలను కూలగొట్టవచ్చును. మళ్లీ తమ చేయూతతో నిలబెట్ట వచ్చును. ఈ ప్రక్రియ మొత్తంలో అత్యంత ప్రభావితం చేయవచ్చనే విశ్వాసం ఇటీవల మీడియా హౌస్ యజమానులకు పెరిగింది. ఆయా మీడియా యజమాన్యాలు ప్రభుత్వాల నుంచి ప్రయోజనాన్ని ఆశించి ఏదో ఒక పార్టీ వైపు మొగ్గు చూపుతూ ప్రజల బాధల కన్నా రాజకీయాలను నడిపించడానికే ఇష్టపడుతున్నాయి .

ఇటీవల దీనికి సంబంధించిన ఒకటి రెండు దృష్ట్యాంతాలు గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలోని బలగాలతో కగార్ పేరున ఛత్తీస్గడ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒరిస్సా రాష్ట్రాల పరిధిలోని కొన్ని జిల్లాలలో విస్తరించిన నక్సలిజాన్ని దాని నాయకులను కార్యకర్తలను ఎదురు కాల్పుల్లో చంపివేసి పూర్తిగా అంతం చేస్తామని కార్యాచరణతో నిర్దిష్టమైన విధించుకొని ఆ దిశగా పనిచేస్తున్నాయి.ఈ ఏది వేత కార్యక్రమంలో వివిధ సంఘటనలలో వందలాదిమంది ఎదురు కాల్పులలో మరణిస్తున్నారు. నక్సల్స్,, మేధావులు పౌర హక్కుల నాయకులు శాంతి చర్చలు సరిపాలని జరపాలని అనేకమార్లు విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిని ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోలేదు. తన పని తాను చేస్తూ ముందుకు పోతున్నది. ఆ సంఘటనలను రిపోర్ట్ చేయడం ఒక్కటే మీడియా చేస్తున్నది . దాని మంచి చెడ్డలు చట్టపరమైన న్యాయాన్యాయాలపై చేయాల్సినంత చర్చ జరగడంలేదు. అధికార ప్రతిపక్ష నాయకుల బోలెడు స్పేస్ ను ఇవ్వడం లోనే మీడియా మొత్తం ఉత్సాహం చూపుతన్నది.

ఉదాహరణకు కాళేశ్వరం (Kaleshwaram) విచారణ ఎపిసోడ్లో సంబంధించిన రాజకీయ నాయకులకు నోటీస్ ఇచ్చి స్టేట్మెంట్లను కమీషన్ రికార్డు చేసింది. లోపల ఏమి అడిగారో ఏం చెప్పారో తదితర అంశాలను పక్కనపెట్టి ఆయా నాయకులు బయట మాట్లాడిన మాటలను ఊహాజనితమైన మరి కొంత సమాచారంతో వార్తలు పతాక శీర్షికలలో ప్రసారం చేశాయి. ప్రచురించాయి . తద్వారా ప్రధానమైన నక్సల్స్ సమస్యలపై చట్ట పరిధిలో చర్చలు జరపకుండా జరగకుండా తగిన ప్రాధాన్యత ఇవ్వకుండానే, అసలు సమస్య నుండి ప్రజల దృష్టిని పక్కదారిలోకి మళ్ళించడంలో విజయవంతమైంది.

ఇక రెండవది పహల్గాం ఉగ్ర దాడిలో విహార యాత్రకు వెళ్లిన వివిధ రాష్ట్రాలకు చెందిన అమాయక ప్రజలు బలి అయ్యారు. అనంతరం మన దేశం సింధూర్ పేరిట శత్రువు పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై విజయవంతంగా దాడి చేసింది. అనంతరం మన వైమానిక దళం శత్రుదేశం లోని బేస్ క్యాంపులను ధ్వంసం దిగ్విజయంగా పూర్తి చేసింది. ఈ పరస్పరదారుల ఉద్రిక్తతల మధ్య అకస్మాత్తుగా రెండు దేశాలు కాల్పులు విరమణకు తెర లేపాయి .

పిమ్మట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగేలా చూడడానికి ఆయా దేశాల అగ్ర నాయకులను ఒప్పించానని వివిధ సందర్భాల్లో అనేకసార్లు చెప్పుకొచ్చాడు. దీనికి దేశంలోని ప్రతిపక్ష పార్టీ నాయకులు మేధావులు దేశ సార్వభౌమాధికారంలో మూడవ వ్యక్తి కలగజేసుకోవడం పైన విమర్శలు గుప్పించారు. ఆరోపణలు చేశారు. మన ప్రధాని దీనికి విరుగుడుగా ఆయా దేశాలకు వాస్తవ పరిస్థితులు వివరించడానికి పార్లమెంటు సభ్యుల కమిటీ బృందాలను పంపించాడు. పాకిస్తాన్ మీద విజయవంతంగా దాడి చేశామని ప్రధాని చెప్పారు. మన బ్రహ్మోస్ ఆయుధాల అజేయమైన శక్తి మీద వైన వైనాలుగా కథనాలు వెలువడ్డాయి . ప్రజలలో జరుగుతున్న యుద్ధం చర్చలపై ఎక్కడో ఒకచోట ముగింపు పలకడానికి 2026 వత్సరంలో జనాభా కుల గణనకు చేపడుతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు చేస్తున్న యుద్ధ చర్చల నుంచి జనాభా కులదరణ వైపు మళ్లించింది. కులగణన పైన వ్యాసాలు చర్చలు వ్యాఖ్యానాలు కొనసాగుతున్నాయి.మొత్తానికి దేశం ప్రజల యొక్క యుద్ధం మీది అటెన్షన్ ను మిగతా అసందర్భ అప్రస్తుత విషయాల పైన కొనసాగించడంలో మీడియా పాత్ర ఎన్నదగినది.

మూడవది తెలంగాణ ప్రజలకు ఆసక్తి కలిగిన అంశం ఇది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఇతర అక్రమాల పైన ఘోష్ కమిషన్ ఇటీవల మాజీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కు, నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు(Harish Rao)కు మరియు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)లకు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నోటీసులు గురించిన చర్చ ప్రజలలో తీవ్రస్థాయిలో జరుగుతున్న సందర్భ సన్నివేశంఏర్పడింది.

ఇటువంటి పరిస్థితులలో కల్వకుంట్ల కవిత తన తండ్రి కెసిఆర్ కు రాసిన లేఖ ను బహిరంగపరిచారు. దానికి కవిత అమెరికాకు పోయి వచ్చి ఎయిర్పోర్టులో తన తండ్రి దేవుడని, దేవుడు చుట్టూ దయ్యాలు చేరాయని ప్రతిస్పందించారు. దానికి తోడు కేసీఆర్ నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణకి ఇచ్చినట్టేనని ఆరోపించారు. ఇంకా కొంచెం ముందు వెళ్లి పెరిగిన బస్ ఛార్జీలకు వ్యతిరేకంగా బస్ భవన్ ముందు మెరుపు నిరసన తెలిపి అరెస్టు అయ్యారు. ఇంతా చేస్తే కవితకు కేసిఆర్ కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. తన తండ్రి కమిషన్ ముందు విచారణకు హాజరయ్యే రోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు తన భర్తతో వెళ్లిన కవిత వైపు కన్నెత్తి చూడ ఇచ్చగించలేదు. ఇదంతా వారి కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్న ఒకానొక తతంగంగా పరిగణించాలి. కానీ మనం మీడియా కవితతో మాట్లాడని కెసిఆర్ అని పత్రికలలో చోటు కల్పించింది. నిజంగా తెలంగాణ ప్రజలకు కవితతో కెసిఆర్ మాట్లాడినా మాట్లాడకపోయానా తెలంగాణ ప్రజలకు అప్రస్తుతమైనది. కానీ అదే విషయాన్ని ప్రధానం చేసి కాళేశ్వరం నిర్మాణ అవకతవకలు అవినీతిపై ప్రజల చర్చను జనం ఫోకస్ ను సాధ్యమైనంత తగ్గించేలా శతవిధాల ప్రయత్నం జరుగుతున్నది .

అదే సమాజంలోని అన్ని రంగాల్లో పేరుకుపోయిన అపసవ్యతలను ప్రాధాన్యత లేని అంశాలుగా పరిగణించడం శోచనీయం. రైతు ఆత్మహత్యలను ఎక్కడో లోపలి పేజీలో సంక్షిప్తంగా వేయడం చూస్తుంటే మన మీడియా ఆయా సందర్భాలలో వ్యవహరిస్తున్న తీరుపైన ప్రజల విశ్వాసం నమ్మకం కోల్పోతున్నది.

పై మూడు ప్రధానమైన అంశాలు కాకుండా మరి కొన్ని ముఖ్యమైన విషయాల నుంచి ప్రజా సమూహాలను యజమాన్యాల పాలసీలు అనుకూలంగా అనే బదులు తమ తమ ప్రయోజనాలకు అనుకూలంగా మీడియా హౌస్ లు పక్కదారి పట్టిస్తూ ఉండడం ప్రజాస్వామ్య వ్యవస్థలకు అంత క్షేమకరమేమీ కాదు. ఇంతెందుకు రెండు వేల ఒకటి నుంచి ప్రారంభించిన తెరాస దాని నాయక కుటుంబ సభ్యులు ఎన్నికల సందర్భంగా నామినేషన్లు దాఖలు చేస్తున్నప్పుడు సంబంధిత ఎన్నికల అధికారికి తమ ఆస్తుల వివరాలు సమర్పించిన అఫిడవిట్లను సమర్పించారు. ఆ నాయకుల ఆస్తులు ఎట్లా పెరుగుకుంటూ వచ్చాయో మన దర్యాప్తు సంస్థలు పరిశీలిస్తే అక్రమ మార్గాల ద్వారా అవినీతి ఎలా జరిగిందో అవగతం అవుతుంది. ప్రతి నాయకుడు ఏమైనా గుట్టకు పోయి కట్టెలు కొట్టుకొచ్చాడా? ఎక్కడైనా చెమట వడిపి సంపాదించాడా? స్పష్టంగా తెలుస్తుంది. వారి వారి ఆదాయం కన్నా ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా హనుమంతుడు లంకను దాటే ముందు ఎదిగినట్టు పెరుగుతున్నాయి ఈ విషయంలో మీడియా పెద్దగా మాట్లాడడానికి ఆసక్తి కనబరచదు. ప్రత్యేకంగా చర్చించడానికి మనస్కరించదు.

అందుకని డైవర్షన్ పాలిటిక్స్ లాగే మీడియా డైవర్షన్ పాలిటిక్స్ అని అనడానికి ఎవరైనా ఏమాత్రం సంకోచించ వలసిన అవసరం లేని వాతావరణం ఏర్పడినది.

Tags:    

Similar News