జులై 1న తెలంగాణ బిజెపి రథ సారథి
పోటీ దారుల సంఖ్య ఎక్కువ కావడంతో ఉత్కంఠ;
సంవత్సర కాలంగా పెండింగ్ లో ఉన్న తెలంగాణ నూతన బిజెపి నూతనసారథి జులై 1న వెల్లడయ్యే అవకాశం ఉంది. కేంద్రమంత్రి బండి సంజయ్, మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ ఎంఎల్సి ఎన్ రాంచందర్ రావు, నిజామాబాద్ ఎంపీ అరవింద్ కుమార్ తదితర పేర్లు వినిపిస్తున్నాయి. పార్టీ అంతర్గత ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టీ అధ్యక్షుడిని ప్రకటిస్తారు. జులై 1న రథసారథిని ప్రకటిస్తారు.
గత అసెంబ్లీ ఎన్నికల ముందు బండి సంజయ్ ను తప్పించి కిషన్ రెడ్డికి బిజెపి అధ్యక్షుడిగా ప్రకటించారు. తెలంగాణ లో బిజెపి అధికారంలో రాకపోవడానికి ప్రధాన కారణం బండి సంజయ్ ను తప్పించడమే నని ప్రచారంలో ఉంది. కిషన్ రెడ్డినాయకత్వాన్ని పార్టీ శ్రేణులు బాహాటంగానే వ్యతిరేకించాయి. వారిలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నారు. ఆయన బిజెపి హట్రిక్ ఎమ్మెల్యే కావడంతో పార్టీ క్రమశిక్షణా సంఘం చర్యలు తీసుకోలేకపోయింది.