పాశమైలారం ఘటనలో మరో భవనానికి బీటలు
సురక్షిత ప్రాంతాలకు స్థానికులు;
పటాన్ చెరు పాశమైలారం పారిశ్రామిక వాడలో పేలుడు ఘటన తెలంగాణలో సంచలనమైంది. ఇంత భారీ పేలుడు ఈ మధ్య కాలంలో సంభవించలేదు. పేలుడు ధాటికి మరో భవనం బీటలు వారింది. ప్రస్తుతం ఆ భవనాన్ని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ప్రమాదం సంభవించగానే కార్మికులు 100 మీటర్ల దూరం వరకు ఎగరిపడ్డారు.
సిగాచి కంపెనీలో మందులు తయారవుతాయి. మందులు తయారుచేసే క్రమంలో జాగ్రత్త చర్యలు తీసుకోవల్సి ఉంటుంది. యాజమాన్యం కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. ప్రమాదం సంభవించగానే ఆరుగురుస్పాట్ లోనే మరణించారు. సంగా రెడ్డి జిల్లాలో ఉన్న మందుల ఫ్యాక్టరీల్లో సిగాచి ఒకటి.
అవగాహన లేని సిబ్బంది
అవగాహనా లేని సిబ్బందిపని చేయడం వల్లే ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. నైపుణ్యం లేని సిబ్బంది పని చేయడం వల్లే ప్రమాదం జరిగింది. ఫస్ట్ షిప్ట్ ఉదయం ఆరు గంటలకే ప్రారంభమైంది. షిప్ట్ ప్రారంభమైన కొద్ది సేపటికే ప్రమాదం సంభవించింది.
బీహార్, ఒరిస్సాకు చెందిన కార్మికులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు ఒక్కొక్కరూ సిగాచీ ఫ్యాక్టరీకి చేరుకున్నారు. తమ వారు చనిపోయారని తెలుసుకున్న కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. ఫిల్టర్ బెడ్ వద్ద మరికొందరు ఇరుక్కుని ఉన్నట్లు అధికారులు చెప్పారు.