ప్రమాదానికి కారణం తేల్చేశారు

వేడిగాలులు ఎక్కువైనందునే...;

Update: 2025-06-30 11:58 GMT

పాశమైలారం ఘటనకు గల కారణాలను అధికారులు తేల్చేశారు. రియాక్టర్ పేలి ప్రమాదం సంభవించినట్లు అధికారులు తొలుత చెప్పారు. కానీ విచారణలో మరిన్ని కారణాలు వెలుగులోకి వచ్చాయి. మైకోసెల్యూలస్ పౌడర్ తయారు చేస్తున్నప్పుడు వేడిగాలులు ఎక్కువయ్యాయి. ఈ గాలుల ఒత్తిడికి గోడలు బద్దలయ్యాయి. భవనం కుప్ప కూలడానికి కారణం కూడా అదే.

పాశమైలారం ఘటనలో మొత్తం 14 మంది చనిపోగా మరో 5 గురి పరిస్థితి విషమంగా ఉంది. వైద్య ఆరోగ్య శాఖా మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రమాదస్థలిని సందర్శించారు. చనిపోయిన వారిని ఆదుకుంటామన్నారు. కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ కూడా ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకుంటున్నారు.

సేప్టీ చర్యలు తీసుకోలేదు

శిథిలాల క్రింద చిక్కుక్కున్న క్షతగాత్రులను వెలికే తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. యాజమాన్యం గోప్యత వల్ల విషయాలు బయటకు పొక్కడం లేదు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గాయాల పాలైన వారి ఆర్తనాదాలు మిన్నంటాయి. సేప్టీ చెక్ చేయపోవడం వల్ల ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. చనిపోయిన వారి సంఖ్య పేర్లను అధికారులు వెల్లలడించలేదు. సంగారెడ్డి జిల్లాలో ఇది అతి ప్రమాదమని తెలుస్తోంది.

స్థానికులు కొందరిని బయటకు వెలికి తీశారు. మరికొందరిని వెలికే తీసే ప్రయత్నం జరుగుతోంది.

Tags:    

Similar News