ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం

సాక్షిగా వాగ్మూలం ఇవ్వనున్నపీసీసీ చీఫ్;

Update: 2025-06-16 08:19 GMT

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఈకేసును దర్యాప్తు చేస్తున్న సిట్ ముందుకు సాక్షిగా పీసీసీ చీప్ మహేష్ కుమార్ గౌడ్ హాజరు కానున్నారు. ఈ పరిణామం రాజకీయ వర్గాలలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అధికారుల కోరిక మేరకే మంగళవారం సహేష్ కుమార్ గౌడ్ సాక్షిగా హాజరై వాగ్మూలం ఇవ్వనున్నారు. ఇప్పటికే SIB మాజీ చీఫ్ ప్రభాకరరావును కీలక నిందితుడిగా సిట్ ఈ కేసులో విచారించింది.అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న రాజకీయ నాయకుల ఫోన్‌లను ట్యాప్ చేయడానికి ఎస్ఐబీలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రభాకరరావు సిట్ విచారణలో ఒప్పుకున్నట్లు తెలిసింది. కాంగ్రెస్, బీజేపీ నాయకులపై నిఘా పెట్టినట్లు కూడా ప్రభాకరరావు విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది.

2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో మహేశ్ కుమార్ గౌడ్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. తన ఫోన్‌ను అప్పటి ప్రభుత్వం ట్యాప్ చేసిందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారం ఊపందుకున్న సమయంలో కీలక వ్యక్తుల ఫోన్లపై బీఆర్ ఎస్ ప్రభుత్వం నిఘా వుంచిందని ప్రధాన ఆరోపణ. ఈ నేపధ్యంలోనే మహేశ్ కుమార్ గౌడ్ వాంగ్మూలాన్ని అత్యంత కీలకమైనదిగా సిట్ పరిగణించనుంది.మంగళవారం ఉదయం 11 గంటలకు మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి వెళ్లి అధికారుల ముందు వాంగ్మూలం ఇస్తారు.మహేశ్ కుమార్ గౌడ్ ఇచ్చే వివరాలు ఈ కేసులో దర్యాప్తును మరింత ముందుకు తీసుకు వెళ్లడానికి ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.మరికొందరిని కూడా సాక్షులుగా సిట్ విచారణకు పిలిచే అవకాశం వుందని తెలుస్తోంది.

Tags:    

Similar News