ట్యాపింగ్ కు ఆదేశాలు ఎవరిచ్చారో చెప్పిన ప్రభాకరరావు

కీలక విషయాలు వెల్లడించిన ప్రధాన నిందితుడు;

Update: 2025-06-20 12:03 GMT

బీఆర్ఎస్ హయాంలో జరిగిన టెలిఫోన్ ట్యాపింగ్ ఎవరి ఆదేశాలతో జరిగిందో ఏ1 నిందితుడు టీ ప్రభాకరరావు బయటపెట్టినట్లు సమాచారం. ఐదోరోజు ప్రభాకరరావును సిట్ అధికారులు విచారిస్తున్నారు. శుక్రవారం విచారణలో మాజీ డీజీపీ ఆదేశాల ప్రకారమే తాను టెలిఫోన్ ట్యాపింగ్ చేయించినట్లు చెప్పారని తెలిసింది. అయితే ప్రభాకరరావు చెప్పిన ఆ మాజీ డీజీపీ ఎవరన్నది తేలాల్సుంది. ప్రభుత్వంలో పెద్దలు ఎవరూ తనకు ట్యాపింగ్ ఆదేశాలు ఇవ్వలేదని కూడా అన్నట్లు సమాచారం.


ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ ఐపిఎస్ అధికారి ప్రభాకర్ రావు ఐదో సారి సిట్ విచారణకు హాజరయ్యారు. బిఆర్ ఎస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనమైంది. నిన్న ప్రణీత్ రావు స్టేట్ మెంట్ దృష్టి లో పెట్టుకుని శుక్రవారం ప్రభాకర్ రావును సిట్ విచారణ చేసింది. ప్రభాకర్ రావును నిన్న 9 గంటల పాటు విచారించిన సిట్ ఇవ్వాళ ఐదో సారి ప్రభాకర్ రావును విచారణ చేశారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని కారణం చూపి ప్రభాకర్ రావు లీగల్ ఇంటర్ సెప్షన్ అనుమతి తీసుకున్నారు. మొత్తం 36 గంటల పాటు ప్రభాకర్ రావును సిట్ విచారించింది. మాజీ డీజీపీ ఆదేశం మేరకు తాను ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ప్రభాకర్ సిట్ విచారణలో అంగీకరించినట్లు సమాచారం. సిట్ విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదని వార్తలు వెలువడుతున్నాయి.

Tags:    

Similar News