రఘునందన్ ను విచారిస్తున్నసిట్

కాలికి గాయంతో ఆస్పత్రిలో చేరి..;

Update: 2025-06-27 15:00 GMT

సిట్ అధికారులు బిజెపి ఎంపీ రఘు నందన్ ను విచారించారు. కాలికి గాయం కారణంగా యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రఘునందన్ దగ్గరికి సిట్ అధికారులు చేరుకున్నారు. ఆర్థో సమస్యతో ఆస్పత్రిలో చేరిన రఘు నందన్ ను సిట్ ఎసిపి విచారణ చేసి స్టేట్ మెంటు రికార్డు చేసుకున్నారు.

తాను ఫోన్ ట్యాప్ బాధితుడినని బిజెపి ఎంపీ రఘు నందన్ రావ్ అంతకుముందు అన్నారు. దుబ్బాక ఎన్నికల్లో తన ఫోన్ ట్యాప్ అయిందన్నారు. మొదట ఫిర్యా దు చేసినప్పటికీ తనను ఇంతవరకు ఎవరూ పిలవడం లేదన్నారు. సిట్ అధికారులు కేవలం కాంగ్రెస్ నేతలనే విచారణకు పిలుస్తున్నారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు మీద మొదట నేను సిట్ కు ఫిర్యాదు ఇచ్చానన్నారు. సిట్ అధికారులకు చిత్తశుద్ది లేదన్నారు. డైలీ సీరియల్ గా విచారణ కొనసాగుతుందన్నారు. 

బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోనే ఫోన్ ట్యాప్ అవుతున్నాయని అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపి  నేతలు ఆరోపించారు. దుబ్బాక ఎన్నికల్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. నాలుగున్నరవేల ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు  తేల్చారు.కాంగ్రెస్ అధికారంలో రాగానే ఈ కేసు స్పీడ్ పెంచారు. ఒక్కొక్కరిని విచారణకు పిలిచి స్టేట్ మెంట్ రికార్డు చేస్తున్నారు. అయితే బిజెపి నేతలను పిలవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. చేవెళ్ల బిజెపి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్టేట్ మెంట్ రికార్డు చేసిన రోజే సిట్ అధికారులు   మరో బిజెపి ఎంపీ రఘునందన్ ను విచారించారు. 

Tags:    

Similar News