రైల్వే ఉద్యోగుల ఫిట్ ఇండియా ఉద్యమం ‘సండేస్ ఆన్ సైకిల్’
ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా సికింద్రాబాద్ రైల్వేఉద్యోగులు సైక్లోథాన్కు శ్రీకారం చుట్టారు.మెరుగైన ఆరోగ్యం కోసం ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని ఆరంభించారు.;
By : The Federal
Update: 2025-06-09 07:22 GMT
సికింద్రాబాద్ నగరంలోని దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగులు ఫిట్నెస్ కోసం సైకిల్ తొక్కడం హాబీగా పెట్టుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరంభించిన ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా రైల్వేఉద్యోగులురోజువారీ జీవితంలో ఫిట్నెస్ కోసం సైకిల్ సవారీని అంతర్భాగంగా స్వీకరించారు.
-వేలాదిమంది సికింద్రాబాద్ రైల్వే ఉద్యోగులు సైకిళ్లతో ఆదివారం పీవీఎన్ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్) వద్ద సైక్లోథాన్ పేరిట కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రన్నర్స్ సొసైటీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో 3కె, 5కె, 10కె సైక్లింగ్, హాఫ్ మారథాన్ లలో పాల్గొన్నారు.
- జాతీయ ఫిట్ ఇండియా ఉద్యమం కింద నిర్వహించిన ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్లోని రైల్వే ఉద్యోగులు ఆదివారం సైకిళ్లపై వీధుల్లోకి వచ్చారు. సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జెండా ఊపి సైక్లోథాన్ ను ప్రారంభించారు.
ఖేలో ఇండియా సైక్లోథాన్
కేంద్ర యువజన వ్యవహారాలు,క్రీడల మంత్రిత్వ శాఖ ‘ఖేలో ఇండియా’ కార్యక్రమంలో భాగంగా సైక్లోథాన్ను సౌత్ సెంట్రల్ రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ నిర్వహించింది.ఫిట్ నెస్ కోసం సైక్లింగ్ సవారీ చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ క్రీడాకారులు సూచించారు.ఈ సైక్లింగ్ రైడ్లో పాల్గొన్న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ పాల్గొని కార్యక్రమాన్ని స్పోర్ట్స్ అసోసియేషన్ను ప్రశంసించారు.శారీరక దృఢత్వం , మెరుగైన ఆరోగ్యాన్ని సాధించడానికి సైక్లింగ్ సహాయపడిందని రైల్వే ఉద్యోగుుల చెప్పారు. సైక్లింగ్ ఇప్పటికీ చురుకుగా ఉండటానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో ఒకటని వారు పేర్కొన్నారు.ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆరోగ్యం,పర్యావరణ కారణాల వల్ల సైకిళ్ల వైపు మొగ్గు చూపుతున్నారని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ చెప్పారు.
ఉత్సాహంగా రైల్వే ఉద్యోగుల సైకిల్ సవారీ
సికింద్రాబాద్ నగరంలోని రైల్వే ఉద్యోగులు ఉత్సాహంగా సైకిల్ సవారీలో పాల్గొన్నారు. రైల్వే ఉద్యోగులు ఉత్సాహంగా ఈ ఉద్యమంలో పాల్గొన్నారని సౌత్ సెంట్రల్ రైల్వే అదనపు జనరల్ మేనేజర్ నీరజ్ అగర్వాల్ చెప్పారు. తెలంగాణ రన్నర్స్ సొసైటీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో 3కె, 5కె, 10కె సైక్లింగ్, హాఫ్ మారథాన్ చేపట్టారు.
త్వరలో అనంతగిరి ట్రైల్ రన్
అనంతగిరి ట్రైల్ రన్, గోదావరి నది పరుగు కార్యక్రమాలు ఈ సంవత్సరం చేపడతామని నిర్వాహకులు డాక్టర్ సోమ జగన్ మోహన్ రెడ్డితెలిపారు.సైక్లింగ్ పోటీల్లో పాల్గొన్న వారందరికీ మంచినీరు, పార్కింగ్, వైద్య సహాయం, ఆహారాన్ని అందించారు. తెలంగాణలోని మారుమూల ప్రాంతాలకు ఫిట్నెస్ అవగాహనను తీసుకెళ్లినందుకు నిర్వాహకులను మాజీ ఎంపీ,ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో 81 ఏళ్ల ఎంఎల్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి పాల్గొని యువతను ప్రోత్సహించారు.