రెడ్ల నుంచి వత్తిడి వస్తోంది: మహేష్ కుమార్ గౌడ్

మంత్రి వర్గ విస్తరణలో న్యాయం జరిగింది;

Update: 2025-06-25 10:23 GMT

మంత్రివర్గ విస్తరణలో తమకు ప్రాధాన్యత నివ్వాలని రెడ్డి సామాజిక వర్గం నుంచి  కాం గ్రెస్ లో వత్తిడి పెరుగుతోందని  పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణలో రెడ్డి సామాజిక వర్గానికి ప్రాతినిద్యం తగ్గిందనే డిమాండ్  రోజు రోజుకు ఎక్కువౌతుందని  మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. రెడ్లను మంత్రివర్గంలో తీసుకోవాలని తీవ్రమైన వత్తిడి వస్తుందన్నారు.    

బిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం హుజురాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధును ఇంట్రడ్యూస్ చేసిందన్నారు. బిఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మొద్దన్నారు.

ఎన్నికల కోసమే బిఆర్ఎస్ సాధ్యం కాని పథకాలను తెచ్చిందన్నారు. బిఆర్ఎస్ పదేళ్లలోచేయని అభివృద్దిని కాంగ్రెస్ 18 నెలల్లో చేసి చూపించిందన్నారు. రాష్ట్ర ప్రజల అవసరాలను బిఆర్ఎస్ తాకట్టు పెట్టటిందన్నారు. రాష్ట్రంలో అభివృద్ది అద్బుతంగా సాగుతుందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గోదావరి బనకచర్లపై లోతుగా అధ్యయనం చేసి నిర్ణయం ప్రకటిస్తామని ఆయన అన్నారు.

మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ కమిటీలలో అన్ని వర్గాలకు కాంగ్రెస్ పెద్దపీట వేసిందన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ సమాజమంతా రుణపడి ఉంటుందన్నారు.సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మరోసారి రుజువైందని ఆయన అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తామని రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణతో పాటు టీపీసీసీ కమిటీలో అందరికీ సమ ప్రాధాన్యత కల్పించారని కొనియాడారు.

రెండో విడతలో ఇచ్చిన మూడు మంత్రి పదవులు ఒకటి బీసీలలో అత్యదికులైన ముదిరాజ్ సామాజిక వర్గంతో పాటు రెండు దళితులకు కేటాయించడాన్ని ఆయన స్వాగతించారు. బహుజనులతో పాటు యావత్ తెలంగాణ సమాజమంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటామని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం అభివృద్ధితోపాటు సమన్యాయాన్ని విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు.


Tags:    

Similar News