‘రూ.లక్ష కోట్ల పెట్టుబడులే లక్ష్యం’

మెల్‌బోర్న్‌లో నిర్వహించిన అంతర్జాతీయ సద్దస్సులో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.

Update: 2025-10-23 13:35 GMT

తెలంగాణకు రూ.లక్ష కోట్ల కొత్త పెట్టుబడులను ఆకర్షించడమే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో ఐదు లక్షల ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ఆస్ బయోటెక్ అండ్ విక్టోరియా ప్రభుత్వం సంయుక్తంగా మెల్‌బోర్న్‌లో నిర్వహించిన ఆస్ బయోటెక్ ఇంటర్నేషన్ కాన్ఫెరెన్స్-2025 సదస్సులో శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగానే తెలంగాణను గ్లోబల్ సైన్స్ హబ్‌ మార్చడానికి తమ ప్రభుత్వం సమగ్రమైన ‘రోడ్‌‌మ్యాప్ 2030’ను రూపొందించిందని ఆయన అన్నారు.

‘‘ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు మాత్రమే కాకుండా ప్రపంచ భాగస్వామ్యాలను వేగవంతం చేయడానికి తెలంగాణ సమగ్ర లైఫ్ సైన్సెస్ విధానాన్ని సిద్ధం చేస్తోంది’’ అని తెలిపారు. గ్లోబల్ కన్సల్టెన్సీ సీబీఆర్ఈ నివేదికను ప్రస్తావిస్తూ.. ప్రపంచంలోని ప్రముఖ లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో బోస్టన్, శాన్‌ఫ్రాన్సిస్కో, కేంబ్రిడ్జ్, బీజింగ్, టోక్యోలతో పాటు గ్లోబల్ సైన్సెస్ అట్లాస్-2025లో హైదరాబాద్ కూడా స్థానం సంపాదించిందని వెల్లడించారు. బయోటెక్నాలజీ, ఏఐ, హెల్త్‌కేర్‌లో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల అవసరాలను తీర్చడం కోసం ‘రెడీ టు డిప్లాయ్ బయో డిజిటల్ వర్క్‌ఫోర్స్’ ను నిర్మించడానికి తెలంగాణ సిద్ధమైందని, దీని కోసం భారీగా పెట్టుబడులు పెడుతోందని అన్నారు. తమ ప్రభుత్వ నినాదం మేక్ ఇన్ ఇండియా మాత్రమే కాదని, తెలంగాణలో ఆవిష్కరణ కూడా అని స్పష్టం చేశారు.

Tags:    

Similar News