రేపటి నుంచి హైదరాబాద్ బోనాలు షురూ
గోల్కొండ అమ్మవారికి బంగారు బోనం;
By : B Srinivasa Chary
Update: 2025-06-25 08:32 GMT
తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన బోనాల పండుగ గురువారం (26 జూన్) నుంచి ప్రారంభం కానుంది. గోల్కొండ అమ్మవారికి మొదటి బోనం సమర్పించడానికి సర్దవ సిద్దమైంది. వచ్చే నెల 21 వరకు జాతర ఉత్సవాలు జరుగనున్నాయి. సప్త మాతృకల సప్త బంగారు బోనంలో భాగంగా గోల్కొండ అమ్మవారికి మొదటి బోనం సమర్పించనున్నారు.
భాగ్య నగర్ శ్రీ మహంకాళీ జాత బోనాల ఉత్సవాల కమిటీ దేవాలయాల ఉరేగింపు కమిటీ తరపున శ్రీ జరగదాంబికా అమ్మవారికి పట్టు వస్త్రాలతో మొదటి బోనాన్ని సమర్పించనున్నారు. జులై 24 వ తేదీన తుది బోనంతో ఉత్సవాలు ముగుస్తాయి. తెలంగాన పండుగ బోనాలు ప్రతీ యేడు ఆషాడ మాసంలోని మొదటి గురువారం ఆదివారంతో హైద్రాబాద్ లో ప్రారంభమౌతాయి. మొదటి బోనం గోల్కొండ, జులై 13న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ, చివరిగా లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళీ బోనాలు జులే 20న జరుగనున్నాయి. గతేడాది గోల్కొండ బోనాలలో 25 లక్షల మంది భక్తులు హాజరైతే ఈ యేడు మరింత పెరిగే అవకాశముంది.