కోలాహలంగా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల ప్రదానం
పదేళ్ల విరామం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ ఫిలిం అవార్డుల ప్రదానోత్సవం వేడుకగా జరిగింది.;
తెలంగాణ సినీలాకాశంలో ఉత్తమ ప్రతిభ చూపించిన కళాకారులకు గద్దర్ అవార్డులు ఇచ్చి గౌరవించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ హాలులో శనివారం రాత్రి తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం కనుల పండువగా జరిగింది. కనకాల సుమ,శ్రీముఖి యాంకర్లుగా వ్యవహరించారు. మొదట సంప్రదాయ నృత్యంతో, పేరిణి నృత్యంతో గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం ఆరంభమైంది. ఒకవైపు అవార్డుల ప్రదానోత్సవం మధ్యలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు.తెలంగాణ గద్దర్ సినీ అవార్డుల ఉత్సవాన్ని జ్యోతి ప్రజ్వలన తో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రారంభించారు. మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు, ఎండీ హరీష్.తెలంగాణ గద్దర్ సినీ అవార్డులపై ప్రత్యేక సావనీర్ ను ఆవిష్కరించారు. అవార్డులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి అందజేశారు.
సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు ఎల్లప్పుడు చర్యలు తీసుకుంటుందని సీఎం ఎ రేవంత్ రెడ్డి చెప్పారు. నంది అవార్డులను ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దని సీఎం చేప్పారు. 14 సంవత్సరాల క్రితం ఆగిపోయిన నంది అవార్డులను తాము ఇచ్చామని సీఎం చెప్పారు. సినీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం మద్ధతు ఇస్తామని చెప్పారు. భారతీయ సినీ పరిశ్రమ అంటే హైదరాబాద్ వేదిక అని సీఎం చెప్పారు. సినిమా రంగంలో నాల్గవ తరం వచ్చిందని సీఎం చెప్పారు.
తాను కాలేజీ రోజుల నుంచి తనకు సినీపరిశ్రమలోని వారు తెలుసునని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సినీపరిశ్రమను నూటికి నూరుపాట్లు సహకారం అందిస్తుందని సీఎం చెప్పారు. తెలంగాణ రైజింగ్ 2047 పేరిట సినీ, ఫార్మా, ఐటీ, పరిశ్రమల రంగం అభివృద్ధి చెందాలని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో సినీ పరిశ్రమను కేంద్రంగా చేయాలని సీఎం కోరారు. సినీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చెప్పారు. తెలంగాణ రైజింగ్ 2047లో సినీ పరిశ్రమకు విజన్ డాక్యుమెంటులో చాఫ్టరు ఇస్తామని ప్రకటించారు.తాను విదేశాలతో పోటీ పడుతూ అభివృద్ధి చేస్తున్నానని చెప్పారు. 2047 కు తెలంగాణ త్రీ బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కు కూడా అవార్డు ఇవ్వాలని సీఎం కోరారు.
ప్రధాన అవార్డులను ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
రజాకార్ సినిమాకు స్పెషల్ జ్యూరీ అవార్డును, దుల్కర్ సల్మాన్ కు సీఎం రేవంత్ రెడ్డి అవార్డులను ప్రదానం చేశారు. స్పెషల్ జ్యూరీ అవార్డులను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంతో కలిసి అందించారు.ఉత్తమనటుడి అవార్డు ను అల్లు అర్జున్ కు, ఎన్టీఆర్ అవార్డును నందమూరి బాలకృష్ణకు,పైడి జయరాజ్ ఫిలిం అవార్డు, ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ : మణిరత్నం, బీఎన్ రెడ్డి ఫిలిం అవార్డు తెలుగు ఫిలిం డైరెక్టర్ : సుకుమార్ ,నాగిరెడ్డి, చక్రపాణి ఫిలిం అవార్డు తెలుగు నిర్మాత అట్లూరి పూర్ణ చంద్రరావు,కాంతారావు ఫిలిం అవార్డు తెలుగు ఆర్టీస్టు : విజయ దేవరకొండ , రఘుపతి వెంకయ్య ఫిలిం అవార్డు : యండమూరి వీరేంద్రనాథ్ లకు సీఎం ప్రదానం చేశారు.
ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి కొంత ఆలస్యంగా వచ్చి ముందు వరుసలో కూర్చుకున్నారు. సీఎం రేవంత్ తోపాటు సినీ హీరోలు నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్, సినీ నటీమణులు జయప్రద, జయసుధ, సుహాసిని, మణిరత్నం, దర్శకులు రాజమౌళిలు పాల్గొన్నారు.
ముగ్గురు సినీతారలతో అవార్డుల ప్రదానం
ముగ్గురు సినీతారలతో అవార్డుల ప్రదానం చేయించారు. జయసుధ, జయప్రద, సుహాసిని పలు అవార్డులను విజేతలకు అందజేశారు. జ్యూరీ సభ్యులకు అవార్డులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు అందజేశారు.
2024వ సంవత్సరంలో ఉత్తమ చిత్రాలు