జస్టిస్ భట్టాచార్యను బహిష్కరించాలని న్యాయవాదుల నిర్ణయం
తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల అసోషియేషన్ నిర్ణయం;
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి మౌసుమి భట్టాచార్య కోర్టును బహిష్కరించాలని హైకోర్టు న్యాయవాదులు నిర్ణయించారు. భట్టాచార్య ఐదో కోర్టు న్యాయమూర్తి. న్యాయవాదల పట్ల ఆమె ప్రవర్తన బాగుండటం లేదని, న్యాయవాదుల మీద భారీ పెనాల్టీ విధిస్తున్నారని వారు నిరసన వ్యక్తం చేశారు. ఆమె ప్రవర్తన మార్చుకోనందున కోర్టు ను బహష్కరించాలని వారు నిర్ణయించారు. గురువారం నాడు హైకోర్టులో సమావేశమయి తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల అసోసియేషన్ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
జస్టిస్ భట్టచార్యకు ఎలాంటి వర్క్ కేటాయించవద్దని ప్రధాన న్యాయమూర్తి సజోయ్ పాల్ కు అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. అమెను వెంటనే హైదరాబాద్ హైకోర్టు నుంచి బదిలీ చేయాలని న్యాయవాదలు అసోసియేషన్ రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజ్జప్తి చేసింది.
సోమవారం నుంచి న్యాయవాదులు జస్టిస్ భట్టాచార్యకోర్టును బహిస్కరిస్తారని అసోసియేషన్ అధ్యక్షుడు ఎ జగన్ చెప్పారు.
త్వరలోనే తాము భారత ప్రధాన్యాయూర్తిని కలసి తమ సమస్యను వివరిస్తామని కూడా ఆయన చెప్పారు.
తమ ఆవేదను విన్నవించేందుకు న్యాయమూర్తిని స్వయంగా కలవాలనుకున్నామని, ఆయన ఆమె అవకాశమీయలేదని ఆయన చెప్పారు.
న్యాయవాదుల మీద న్యాయమూర్తి చాలా భారీగా పెనాల్టీ వేస్తున్నారనేది జస్టిస్ భట్టాచార్యమీద ఉన్న ఆరోపణ. ఒక మోటార్ వెహికల్ కేసులో అప్పీల్ ను ఉపసంహరించుకోవాలనుకున్నపుడు కోటాసుబ్బారావు అనే న్యాయవాది మీద ఆమె రు. 3 లక్షల జరిమాన విధించారు. ఇలా చాల సందర్భాలలో జరిమాన భారీగా విధించడం జరగిందని న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. అదే క్లయింట్ ఆమోదం లేేకుండా కొన్ని కేసులలో న్యాయసలహాదారులను నియమించాలని జస్టిస్ భట్టాచార్య రిజిస్ట్రీకి ఆదేశాలిస్తున్నారని మరొక ఫిర్యాదు. ఇలాంటి సందర్బాలలో తమ వాదనను వినిపించేందుకు ఆమె న్యాయవాదులకు అవకాశమీయడం లేదని కూడ అసోసియేషన్ ఆరోపిస్తున్నది.
అసోసియేషన్ వాదనతో చాలా మంది సీనియర్ న్యాయవాదులు కూడా ఏకీభవిస్తున్నారు. న్యాయమూర్తిని బహిష్కరించాలన్న నిర్ణయానికి వారు కూడా మద్దతుతెలిపారు.