తెలంగాణ ధన్వాడలో జనాగ్రహం
జోగులాంబ-గద్వాల జిల్లాలో ఇథనాల్ ప్లాంట్ పై తిరగబడ్డ జనం;
ఆపేశామని చెప్పి మళ్లీ ఇథనాల్ ప్లాంట్ నిర్మాణం పనులు ప్రారంభించడంతో జోగుళాంబ గద్వాల జిల్లాలోని రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ప్రజలు తిరగబడ్డారు. పనులు ప్రారంభించేందుకు వచ్చిన కంపెనీ సిబ్బ ంది తరిమికొట్టారు. సిబ్బంది వేసుకున్న గుడారానికి, కంటైనర్ కు నిప్పుపెట్టారు.
తెలంగాణలో రైతులు ఈ మధ్య ఇథనాల్ ప్లాంట్ లకు వ్యతిరేకంగా తిరగబడుతున్నారు. గతంలో చిత్తూనూరు, దిలావర్ పూర్ లలో రైతులు తిరబడి ఫ్యాక్టరీ పనులను రద్దు చేయించారు. ఇపుడు పెద్ద ధన్వాడ రైతులు కూడా అదే బాటలో నడిచారు.
రద్దు చేశామని చెప్పి మళ్లీ ఇథనాల్ కర్మాగార నిర్మాణాన్ని చేపడతారా? అంటూ ఈ మండలంలోని మూడు గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పనుల్ని నిలిపి వేయాలంటూ అక్కడున్న సిబ్బందిని హెచ్చరించారు. వారి వేసుకున్న టెంట్లకు నిప్పంటించారు.
ఇక్కడ గాయత్రి రెన్యువబుల్ ఫ్యూయల్, ఆలివ్ ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్ 10 నెలల క్రితం ఇథనాల్ కర్మాగార నిర్మాణ పనులను చేపట్టింది. అయితే సమీప గ్రామాల ప్రజలు ఈ ప్లాంటు తమ గ్రామపరిసరాలలో వద్దని ఆందోళనకు దిగారు. కర్మాగారాన్ని రద్దు చేయాలని వినతి పత్రాలు అందజేశారు. ‘తుంగ భద్ర నది సమీపంలో ఈ కర్మాగారాన్ని నిర్మించడం వల్ల తాగునీరు కలుషితమవుతుంది. పంటలు, ప్రజల ఆరోగ్యం నాశనం అవుతాయి,’ అని వారు ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించారు.
ఇతర ప్రజల సంఘాల మద్దతుతో దీక్షలు చేపటారు. ఆందోళనకు దిగివచ్చి అధికారులు, నాయకులు ఆ ఫ్యాక్టరీని రద్దు చేస్తామని చెప్పి, దీక్షను విరమింపజే శారు.
ఇపుడు మళ్లీ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సామగ్రితో సిబ్బంది ఊరిమీద పడ్డారు. దీనికి ఆగ్రహించిన ప్రజలు మంగళవారం రహదారిపై ఆందోళనకు దిగారు. బుధవారం ఉదయం పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడ, నసనూర్ గ్రామాల ప్రజలు దాదాపు 1000 మంది అక్కడికి చేరుకున్నారు. కర్మాగార పనులు చేపట్టిన సిబ్బం దితో వాగ్వాదానికి దిగారు. అనంతరం సిబ్బందిని అక్కడి నుంచి తరిమికొట్టారు. వారి గుడారాలను, కంటైనర్ను ధ్వంసం చేసి, నిప్పు పెట్టారు. అక్కడే ఉన్న యంత్రం, వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. జీపును బోల్తా పడేశారని ‘ఆంధ్ర జ్యోతి’ రాసింది.
వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ క్రమంలో పెద్ద ధన్వాడకు చెందిన క్యాసారం కృష్ణ, మ్మకు గాయాలయ్యాయి. వారిని గద్వాల ఆస్పత్రికి తరలించారు. సాయంత్రం కంపెనీకి చెందిన సామగ్రి, వాహనాలను అక్కడి నుంచి పంపించివేశారని రైతు ‘స్వరాజ్య వేదిక’ కు చెందిన కన్నెగంటి రవి తెలిపారు.