నాటుపడవ బోల్తా.. ఒక మత్స్యకారుడు గల్లంతు
అన్నారం సరస్వతి బ్యారేజ్ వద్ద నాటుపడవలో వస్తుండగా ఘటన;
By : The Federal
Update: 2025-09-08 13:16 GMT
మంచిర్యా ల జిల్లా చెన్నూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం సరస్వతి బ్యారేజ్ లో నాటు పడవ బోల్తాపడి ఒక మత్స్య కారుడు గల్లంతయ్యాడు. మహరాష్ట్ర సిరొంచ తాలూక మండలాపూర్ ప్రాంతానికి చెందిన ఇద్దరు మత్స్యకారులు నాటుపడవలో వస్తుండగా అన్నారం సరస్వతి బ్యారేజ్ 11వ గేటు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. పడవ బోల్తాపడటంతో గడ్డం వెంకటేశ్, తూనిరి కిష్ట స్వామి ప్రవాహంలో కొట్టుకుపోయారు. అయితే కిష్ట స్వామి ఈత కొడుతూ సేఫ్ గా బయటకొచ్చినప్పటికీ మరో మత్స్యకారుడు వెంకటేశ్ ఆచూకి దొరకడం లేదు.