వృద్ధులను వదిలేస్తున్నారు....

వారిని పట్టించుకునే వారు కరువయ్యారని హెల్పేజ్ ఇండియా సర్వేలో వెల్లడైంది;

Update: 2025-06-14 03:28 GMT

దేశంలో వృద్ధులకు ప్రస్థుత యువతకు మధ్య అంతరాలు పెరిగాయని, దీంతో వృద్ధులకు సరైన గౌరవం లభించడం లేదని హెల్పేజ్ ఇండియా తాజాగా నిర్వహించిన సర్వేలో తేలింది.

కుటుంబంతో కలిసి జీవించాలనే కోరిక వృద్ధుల్లో ఎక్కువగా ఉందని వెల్లడైంది.‘వృద్ధాప్యంపై ఇంటర్‌జనరేషన్ డైనమిక్స్ అండ్ పర్సెప్షన్‌లను అర్థం చేసుకోవడం’ అనే నివేదిక ప్రకారం 18-24 సంవత్సరాల వయస్సు గల యువకులు తమ తాతా,మామలతో బలమైన భావోద్వేగ బంధాలను పంచుకుంటున్నారని సర్వేలో వెలుగు చూసింది.

పది నగరాల్లో హెల్పేజ్ ఇండియా సర్వే
హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్, కాన్పూర్, నాగ్‌పూర్, మధురై వంటి 10 మెట్రో, నాన్-మెట్రో నగరాల్లో 70 శాతం యువత, 30 శాతం వృద్ధులు - 5,798 మందిని హెల్పేజ్ ఇండియా సర్వే చేసి ఈ నివేదికను రూపొందించింది.

ప్రపంచ వృద్ధుల అవగాహన దినోత్సవం
దేశంలో 56 శాతం మంది యువత వృద్ధులను ఒంటరి వ్యక్తులుగా, 48 శాతం మంది ఆధారపడినవారిగా అభివర్ణించారు. 51 శాతం మంది వృద్ధులను జ్ఞానవంతులుగా, 43 శాతం మంది గౌరవనీయులుగా కూడా భావించారు.దేశంలోని 86 శాతం మంది పెద్దలు కుటుంబంలో తాము విలువైనవారమని భావిస్తున్నారు. ప్రపంచ వృద్ధుల అవగాహన దినోత్సవం (జూన్ 15) సందర్భంగా ఈ నివేదికను హెల్పేజ్ ఇండియా విడుదల చేసింది.

వృద్ధులు, యువత మధ్య డిజిటల్ అంతరం
18-24 సంవత్సరాల వయస్సు గల యువకులు తమ తాతామామలతో బలమైన భావోద్వేగ బంధాలను పంచుకుంటున్నారని తేలింది. వృద్ధులు, యువత మధ్య డిజిటల్ అంతరం ఎక్కువగా ఉంది. 71 శాతం మంది వృద్ధులు నేటికీ బేసిక్ పాత ఫోన్లనే వాడుతున్నారని సర్వేలో వెల్లడైంది. వృద్ధుల్లో 41 శాతం మంది మాత్రమే స్మార్ట్‌ఫోన్లు ఉన్నా, కేవలం 13 శాతం మంది ఇంటర్నెట్ లేదా సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు.

68 శాతం వృద్ధులకు అనారోగ్యం
ఆన్‌లైన్ బ్యాంకింగ్ లేదా హెల్త్ యాప్‌ల వంటి సేవలను 5 శాతం మంది వృద్ధులు మాత్రమే యాక్సెస్ చేస్తున్నారు.40 శాతం మంది వృద్ధులకు యువత ఆరోగ్య బీమాకు సహాయం చేశారని తేలింది.వృద్ధుల్లో 68 శాతం మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. భారతదేశంలో పెద్దల పట్ల గౌరవం బలంగా ఉన్నప్పటికీ భావోద్వేగ పరంగా దూరంగా ఉన్నారని దీంతో అంతరాలు ఏర్పడ్డాయని హెల్ప్ ఏజ్ ఇండియా సిఇఒ రోహిత్ ప్రసాద్ చెప్పారు.


Tags:    

Similar News