ఐదో అంతస్తు పైనుండి దూకి యువతి ఆత్మహత్య (వీడియో)

అతని మాటలు వినకుండా ఆమె పై నుండి కిందకు దూకేసింది. అంతపై నుండి కిందకు దూకటంతో బేగం అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం.

Update: 2024-09-14 11:57 GMT
Woman suicide

చిక్కడపల్లి హరినగర్లోని ఓ అపార్టమెంటుపైనుండి యువతి దూకేసి ఆత్మహత్య చేసుకున్నది. శనివారం మధ్యాహ్నం అపార్టుమెంటులోకి ప్రవేశించిన షహానీ బేగం(24) ఫోన్ మాట్లాడుతు ఐదవ అంతస్తుకు చేరుకుంది. ఫోన్లో ఎవరితో మాట్లాడింది ? ఏమి మాట్లాడింది అన్న విషయాలు తెలీలేదు. అయితే ఫోన్ మాట్లాడటం ఆపేసిన బేగం కొద్దిసేపు ఐదవఫ్లోర్ లోని ఒక ఫ్లాట్ కిటికీపైన కూర్చున్నది. ఆ విషయాన్ని గమనించిన ఒక వ్యక్తి బహుశా సెక్యూరిటి గార్డు అయ్యుంటాడు ఆమెను వారించాడు. అయితే అతని మాటలు వినకుండా ఆమె పై నుండి కిందకు దూకేసింది. అంతపై నుండి కిందకు దూకటంతో బేగం అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం. విషయం తెలియగానే చిక్కడపల్లి పోలీసులు అపార్టుమెంటు దగ్గరకు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News