భవిష్యత్తులో వ్యుహాత్మక భాగస్వామిగా AI

‘‘ది బోర్డు రూమ్ సిరీస్’’ పేరుతో ఏర్పాటుచేసిన చర్చా వేదికలో పాల్గొన్న ది ఫెడరల్ ఎడిటర్-ఇన్-చీఫ్ ఎస్ శ్రీనివాసన్, CPO దినేష్ వరదరాజన్‌;

Update: 2025-06-07 08:22 GMT
Click the Play button to listen to article

కృత్రిమ మేథస్సు (AI) కేవలం టెక్నాలజీ సాధనంగా కాకుండా.. వ్యూహాత్మక భాగస్వామిగా మారుతున్న నేపథ్యంలో ‘ది ఫెడరల్’, మద్రాస్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (MMA) కలిసి ‘‘ది బోర్డు రూమ్ సిరీస్’’ పేరుతో ఏర్పాటుచేసిన చర్చా వేదిక విశేషంగా ఆకట్టుకుంది.

‘From Insight to Impact: AI in the Boardroom’ అనే అంశంపై పరిశ్రమలోని ప్రముఖ సీఈవోలు, ప్రొడక్ట్ ఆర్కిటెక్టులు, ఇన్నోవేషన్ లీడర్లు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి తునై ఏఐ టైటిల్ స్పాన్సర్‌గా, ది న్యూరల్ నాలెడ్జ్ పార్ట్‌నర్‌గా వ్యవహరించాయి.

‘లోతైన, సమతుల్య జర్నలిజానికి ప్రాధాన్యం’

‘ది ఫెడరల్’ న్యూస్ ఎడిటర్ ఇందిరా బాలాజీ ప్రారంభోపన్యాసం చేశారు. ‘‘మేము కేవలం చూడటం, రిపోర్టు చేయడానికి మాత్రమే పరిమితం కాలేదు. లోతైన, సమతుల్య జర్నలిజం ద్వారా ప్రభావవంతమైన చర్చలకు వేదిక కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం,’’ అని పేర్కొన్నారు.

ది ఫెడరల్ ఎడిటర్-ఇన్-చీఫ్ ఎస్ శ్రీనివాసన్, కిస్ఫ్లో CPO దినేష్ వరదరాజన్‌తో జరిపిన ఆసక్తికర సంభాషణలో.. పారిశ్రామిక విప్లవంలాగే మొత్తం పని విధానాన్ని మార్చగల సామర్థ్యం AI కి ఉందని శ్రీనివాసన్ అన్నారు. ‘‘ఒకవైపు AI భవిష్యత్తులో మనుషులను భర్తీ చేస్తుందన్న అభిప్రాయం ఉంది. మరోవైపు ఇది సాంకేతిక పరిణామమేనని కొందరు తేలిగ్గా వదిలేస్తున్నారు. నిజంగా ఈ రెండింటి మధ్యే ఉంటుంది,’’ అని శ్రీనివాసన్ వ్యాఖ్యానించారు. దీనికి స్పందనగా దినేష్ వరదరాజన్ ఇలా అన్నారు: ‘‘కేవలం ఆదేశాల మేరకు పని చేసే ఉద్యోగులకు ఇది సవాలుగా మారొచ్చు. నాయకత్వ స్థాయిలో నిర్ణయాలు తీసుకునే వారికి మాత్రం ఇది శక్తివంతమైన ఉపకరణంగా ఉపయోగపడుతుంది,’’ అని పేర్కొన్నారు.

చర్చలో TheNeural వ్యవస్థాపకుడు రంజిత్ మెలార్కోడ్ , తునై AI CEO జెగన్ సెల్వరాజ్, మేనేజ్ ఇంజిన్ (జోహో) ఎంటర్‌ప్రైజ్ ఐటీ సొల్యూషన్స్ హెడ్ అపర్ణ TA, రెస్పాన్సివ్ ఇంజనీరింగ్ SVP మనీష్ బాఫ్నా మరియు అజిలిసియం ల్యాబ్స్ వ్యవస్థాపకుడు & CEO రాజ్ బాబు పాల్గొన్నారు.

తునై ఏఐ వ్యవస్థాపకుడు ఆదిత్య సంతోనం తన సంస్థ పనితీరును వివరించారు. ‘‘హ్యుమన్-ఏఐ సహకారంతో జ్ఞానాన్ని ఏకీకృతం చేయడం సాధ్యమవుతుంది. చివరగా

‘ది ఫెడరల్’ బిజినెస్ మేనేజర్ జె. జాన్సన్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్‌తో చర్చను ముగించారు. ‘‘నాయకత్వ, వ్యూహాత్మక నిర్ణయాల్లో ఏఐ పాత్రపై జరుగుతోన్న మేథోమథనం భవిష్యత్తుకు దిశానిర్దేశకమవుతుంది. ఇలాంటి చర్చలు మరిన్ని జరగాలి,’’ అని ఆయన ఆకాంక్షించారు.

Tags:    

Similar News