ఆర్సీబీ: నాలుగోసారి అయినా కప్ ను ముద్దాడేనా?

పంజాబ్ కింగ్స్ లో ఫైనల్ లో తలపడబోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్;

Update: 2025-06-03 06:44 GMT
ఆర్సీబీ జట్టు

ఐపీఎల్ తుది అంకానికి చేరింది. నేడు అహ్మాదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, పంజాబ్ ఎలవన్ తో తలపడబోతోంది. ఎవరూ గెలిచిన కొత్త ఐపీఎల్ ఛాంపియన్ ను చూడబోతున్నాము.

రజత్ పాటిదార్ నేతృత్వంలోని ఆర్సీబీ ఫైనల్ చేరుకోవడం ఇది నాలుగోసారి. చివరిసారిగా 2016 లో ఫైనల్ చేరుకున్నారు. జట్టు తరఫున ఆడిన మూడు ఐపీఎల్ ఫైనల్స్ లో పాల్గొన్న ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లి మాత్రమే.
ఇంతకుముందు 2009, 2011, 2016 లో జట్లు ఫైనల్ కు చేరుకున్న తుది మెట్టుపై బొల్తా పడింది. గత 18 సంవత్సరాలుగా ఒకే ఫ్రాంచైజీ తరఫున ఆడిన ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లి మాత్రమే.
ప్రస్తుతం జట్టులో గాయపడిన దేవదత్ పడిక్కల్ స్థానంలో మయాంక్ అగర్వాల్ ఐపీఎల్ 2011 ఫైనల్ లో ఆడాడు.
ఈ సీజన్ లో గ్రూప్ దశలో రెండో స్థానంలో నిలిచారు. క్వాలిఫైయర్ వన్ లో పంజాబ్ పై ఘన విజయం సాధించి సగర్వంగా ఫైనల్ చేరుకున్నారు. ఈ మ్యాచ్ లో పంజాబ్ ను ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించారు.
ఫైనల్ చేరుకున్న తరువాత..
ఐపీఎల్ 2025 లో ఆర్సీబీ జట్టు ఎదుర్కొన్న సవాళ్లను ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్ వివరించారు.
‘‘సీజన్ అంతటా మేము ఆడిన తీరు పట్ల మేము గర్విస్తున్నాము. ధైర్యం, ప్రశాంతత, దూకుడు ఉద్దేశ్యంతో బృందం సవాళ్లను స్వీకరించిన విధానం, సీజన్ లో మేము నిర్మించిన సమిష్టి స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. మేము ఇక్కడికి చేరుకునే మార్గంలో కొన్ని ముఖ్యమైన మైలురాళ్లను గుర్తించాము. కానీ ఇది స్పష్టంగా చాలా ముఖ్యమైనది’’ అని బోబాట్ అన్నారు.
‘‘మాకు చాలామంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించడం చాలాబాగుంది. సుదీర్ఘమైన, కఠినమైన లీగ్ దశ తరువాత, ప్లే ఆఫ్ లు క్రికెట్ ను నిజంగా విశ్వసించి ఆస్వాదించడానికి ఒక మంచి సమయం.
ఫైనల్ మా అభిమానులకు గొప్ప సందర్భం. ఆటగాళ్లు చాలా దృష్టి సారించి పనిని పూర్తి చేయడానికి దృఢ నిశ్చయంతో ఉన్నారు’’ అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రదర్శన బాగుంది..
ఐపీఎల్ 2025 సీజన్ అంతటా అద్భుతమైన ప్రదర్శన కనపరిచింది. క్వాలిఫైయర్ 1కి చేరుకునే క్రమంలో ఆర్బీసీ చరిత్ర తిరగరాసింది. లీగ్ దశలో హోమ్ గ్రౌండ్ లో కాకుండా బయట ఆడిన ప్రతిమ్యాచ్ గెలిచింది.
పాటిదార్ కెప్టెన్సీ బాగుంది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి 600 కంటే ఎక్కువ పరుగులు సాధించి కీ రోల్ పోషించాడు. ఇందులో ఎనిమిది హఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్ లో మా జట్టు తరఫున బ్యాట్స్ మెన్ కు అయినా ఇవే అత్యధిక పరుగులు.
ఈ సీజన్ లో కోహ్లి అర్థ సెంచరీ సాధించినప్పుడల్లా జట్టు మ్యాచ్ ను గెలిచింది. ఇప్పటివరకూ ఐదు సీజన్ లో 600 కంటే ఎక్కువ సాధించింది కోహ్లి మాత్రమే. ఆటలో ‘కింగ్’ కొత్త ప్రమాణాలు నెలకొల్పడం కొత్తేమీ కాదు.
అయితే ఆర్సీబీకి ప్రత్యేకంగా కనిపించేది ఏంటంటే.. అతనికి ఇతర ఆటగాళ్లు కీలక మద్దతు అందించారు. ఈ సీజన్ తొమ్మిది మంది బ్యాట్స్ మెన్లు అర్థసెంచరీలు సాధించారు. టిమ్ డేవిడ్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, దేవ్ దత్ పడిక్కల్, కెప్టెన్ పాటిదార్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు.
బౌలర్లలో ఇప్పటి వరకూ టోర్నమెంట్ లో ఐదుగురు కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టారు. జోష్ హాజిల్ వుడ్ 21 వికెట్లు సాధించి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.
కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ చెరో 15 వికెట్లు పడగొట్టారు. లెగ్ బ్రేక్ బౌలర్ సుయాశ్ శర్మ ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికాకు చెందిన లుంగి ఎంగిడి, మరో ఆటగాడు రోమారియో షెఫర్డ్, లియామ్ లివింగ్ స్టన్ కూడా ముఖ్యమైన వికెట్లు తీసి తమవంతు సహకారం అందించారు.
ఈ అద్బుతమైన ప్రదర్శనతో ఆర్సీబీ 2025 ఫైనల్ కు చేరుకుంది. ఇందులో తొమ్మిది వేర్వేరు ఆటగాళ్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ ను అందుకున్నారు. ఇలా ఆర్సీబీ ఈ సీజన్ లో ఫైనల్ కు చేరింది.
ఆర్సీబీ సాధించిన విజయాలు..
ఈ సీజన్ కు మంచి విజయంతో ప్రారంభించిన ఆర్సీబీ ఎక్కడ వెనక్కి తగ్గలేదు. తమ చిరకాల ప్రత్యర్థులను ఇంతకుముందెన్నడూ లేని విధంగా ఓడించారు. ఐపీఎల్ 2025 లో సీఎస్కేను రెండుసార్లు ఓడించారు.
నిజానికి చెన్నై దాని సొంత మైదానంలో 17 సంవత్సరాల తరువాత మొదటిసారిగా ఓడించారు. ఈ సీజన్ లో అత్యుత్తమ మ్యాచ్ వాంఖడేలో జరిగింది. కోహ్లి, పాటిదార్, జితేష్ శర్మ అద్బుతంగా ఆడి పది సంవత్సరాల తరువాత స్టేడియంలో విజయం సాధించారు.
కోల్ కతాను దాని సొంత మైదానం అయిన ఈడెన్ గార్డెన్స్ లో ఓడించడానికి ఆరు సంవత్సరాలు వేచి చూడాల్సి వచ్చింది. ఢిల్లీ జట్టును ఓడించడానికి ఏడు సంవత్సరాలు పట్టింది.
తన చివరి లీగ్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ నిర్దేశించిన 228 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. దీనితో ఈ సీజన్ లో లీగ్ మ్యాచ్ ను రెండో స్థానంతో ముగిసింది.
ఆర్సీబీ మైలురాళ్లు..
ఐపీఎల్ ప్లేఆఫ్స్ క్వాలిఫైయర్ 1 లో పంజాబ్ కింగ్స్ ను ఆర్ సీబీ మరో పది ఓవర్లు ఉండగానే ఓడించి ఫైనల్ కు చేరుకుంది. ఈ మ్యాచ్ లో ఏ జట్టుకైనా ఇదే అతిపెద్ద విజయం.
ఎల్ఎల్జీ పై జితేష్ శర్మ 33 బంతుల్లో 85 పరగులతో నాటౌట్ గా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో ఆరవ లేదా అంతకంటే తక్కువ స్థానంలో ఒక బ్యాట్స్ మెన్ చేసిన అత్యధిక స్కోర్ ఇదే.
2016 క్వాలిఫైయర్ 1 లో గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో జితేష్- మయాంక్ మధ్య 107 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఐపీఎల్ లో ఐదు వికెట్ కు ఇదే అతిపెద్ద భాగస్వామ్యం. ఇంతకుముందు ఈ రికార్డు ఏబీడీ- ఇక్బాల్ అబ్దుల్లా మధ్య ఉన్న 91 పరుగుల రికార్డును చెరిపివేసింది.
ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా వేయి పరుగులు చేసిన మూడో ఆటగాడిగా ఫిల్ సాల్ట్ నిలిచాడు. ఈ మైలురాయి కోసం అతను కేవలం 576 బంతులు మాత్రమే తీసుకున్నాడు. మరో ఇద్దరు ఆటగాళ్లు అయిన రస్సెల్(545), ట్రావిస్ హెడ్(575) సాల్ట్ కంటే ముందున్నారు.
ఫైనల్ వరకూ ఆర్సీబీ గణాంకాలు..
అత్యధిక పరుగులు: విరాట్ కోహ్లీ( 14 ఇన్నింగ్స్ లలో 614 పరుగులు, అత్యధిక స్కోర్ 75 నాటౌట్, ఎనిమిది అర్థసెంచరీలు: స్ట్రైక్ రేట్: 146. 53)
అత్యధిక వికెట్లు: జోష్ హాజిల్ ఉడ్( 11 ఇన్నింగ్స్ లలో 21 వికెట్లు, ఉత్తమ ప్రదర్శన: 4/33, సగటు 15.80, ఎకానమీ 8.30, స్ట్రైక్ రేట్: 11.42)
అత్యధిక సిక్సర్లు: ఫిల్ సాల్ట్( 12 ఇన్నింగ్స్ 21), కోహ్లీ( 14 ఇన్సింగ్స్ లు 19), జితేష్ శర్మ( 10 ఇన్నింగ్స్ 15)
ఫైనల్ వరకూ ఆర్సీబీ ప్రయాణం..
మ్యాచ్ 1: కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ 7 వికెట్లతో గెలుపు
మ్యాచ్ 2: సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ 50 పరుగుల తేడాతో గెలుపు
మ్యాచ్ 3: జీటీ వర్సెస్ ఆర్సీబీ 8 వికెట్లతో జీటీ గెలుపు
మ్యాచ్ 4: ఎంఐ వర్సెస్ ఆర్సీబీ 12 పరుగుల తేడాతో గెలుపు
మ్యాచ్ 5: డీసీ వర్సెస్ ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీ గెలుపు
మ్యాచ్ 6: ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపు
మ్యాచ్ 7: పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ ఐదు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం
మ్యాచ్ 8: పంజాజ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ ఏడు వికెట్ల తేడాతో గెలుపు
మ్యాచ్ 9: ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ 11 పరుగుల తేడాతో గెలుపు
మ్యాచ్ 10: డీసీ వర్సెస్ ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో గెలుపు
మ్యాచ్ 11: సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ రెండు పరుగుల తేడాతో గెలుపు
మ్యాచ్ 12: కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ వర్షంతో రద్దు
మ్యాచ్ 13: ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ 42 పరుగుల తేడాతో ఎస్ఆర్ హెచ్ గెలుపు
మ్యాచ్ 14: ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో గెలుపు
క్వాలిఫైయర్ వన్: పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో గెలుపు
మూడు ఫైనల్ మ్యాచ్ లు..
2009 డెక్కన్ చార్జర్స్ చేతిలో ఆరు పరుగుల తేడాతో ఓటమి( జోహెన్నెస్ బర్గ్)
2011 చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 58 పరుగుల తేడాతో ఓటమి(చెన్నై)
2016 లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో 8 పరుగుల తేడాతో ఓటమి( బెంగళూర్)
ఆర్సీబీ జట్టు:
విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్(కెప్టెన్), స్వస్తిక్ చికారా, జితేష్ శర్మ, ఫిల్ సాల్ట్, మనోజ్ భాండాగే, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, లియామ్ లివింగ్ స్టోన్, రోమారియో షెపర్డ్, జాకబ్ బెథెల్, స్వప్నిల్ సింగ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హెజిల్ ఉడ్, నువాన్ తుషార, యష్ దార్తేలమ్, రసీ దార్తేలమ్, రసీ షర్తెలమ్, అభినందన్ సింగ్, మయాంక్ అగర్వాల్, బ్లెస్సింగ్ ముజారబానీ, టిమ్ సీఫెర్ట్


Tags:    

Similar News