తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల ఆధిక్యం

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో మంగళవారం పదిన్నర గంటలకు కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 8 సీట్లలో కాంగ్రెస్ ముందుంజలో కొనసాగుతోంది.

Update: 2024-06-04 05:20 GMT
కాంగ్రెస్ పార్టీ జెండా

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పై ‘చేయి’ సాధించింది. మంగళవారం ఉదయం పదిన్నర గంటల సమయానికి అత్యధికంగా 8 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఖమ్మం, భువనగిరి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్ , వరంగల్,పెద్దపల్లి, నల్గొండ, జహీరాబాద్ స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది.

బీజేపీ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సికింద్రాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, నిజామాబాద్, మహబూబ్ నగర్ సీట్లలో బీజేపీ అభ్యర్థులు ముందున్నారు. హైదరాబాద్ సీటులో మజ్లిస్, మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో బీఆర్ఎస్ ముందుంది. కరీంనగర్ లో బీజేపీ అ భ్యర్థి బండి సంజయ్ 30,313 కు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. సికింద్రాబాద్ లో ఏడువేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.


Tags:    

Similar News