ప్రభుత్వం కూలిపోతుందనే భయంతోనే.. ఇలా చేశారు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బొటాబొటి మెజార్టీ రావడంతో ఎంఐఎంను మచ్చిక చేసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ. కిషన్ రెడ్డి ఆరోపించారు.

Producer :  Chepyala Praveen
Update: 2023-12-09 06:35 GMT
g.kishan reddy

ప్రభుత్వం కూలిపోతుందని కాంగ్రెస్ భయపడే.. సీనియర్లను కాదని ప్రోటేం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్భరుద్దీన్ ను చేశారని అన్నారు. ఏ ప్రాతిపదికన అక్బరుద్దీన్ ను ప్రోటేం స్పీకర్ గా చేశారని ప్రశ్నించారు. సభలో ఆయన కంటే వయస్సులో పెద్దవాళ్లయిన సభ్యులున్నారని, అసెంబ్లీ సమావేశం అయిన మొదటి రోజే సభ సాంప్రదాయాలను కాంగ్రెస్ సభ్యులు తుంగలోకి తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓట్లు, సీట్లు పెరిగాయని అన్నారు. ఒక సీటు నుంచి ఎనిమిది సీట్లకు, ఆరు శాతం నుంచి 14 శాతానికి పెంచుకున్నామని చెప్పారు. ఈ రోజు జరిగే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నామని, తాము ఈ రోజు ప్రమాణస్వీకారం చేయం అన్నారు. దీనిపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తాం. స్పీకర్ ఎన్నిక ఆపమని కోరతాం. స్పీకర్ ఎన్నికైన తరువాతే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు. 

Tags:    

Similar News