బస్తర్ కోసం యుద్ధం: తుపాకి వర్సెస్ తుపాకి

Battle for Bastar Part 5: సుదీర్ఘ సాయుధ పోరుకు బాటలు వేసుకున్న మావోయిస్టుల అంచనాలు ఎక్కడ తలయికిందులయ్యాయి;

Update: 2025-06-27 01:00 GMT
అబూజ్మడియా కు చెందిన గిరిజనులు తమ చిన్న పిల్లలతో నారాయణపూర్ లోని పునరావాస ప్రాంతాలకు పారిపోయి రావాల్సి వచ్చింది. వీరంతా ఇక్కడ తాత్కాలిక గుడారాలలో నివసిస్తున్నారు. ఫొటోలు: దీపక్ దావారే

2003 అక్టోబర్ మధ్యలో మంగళ్ ముదియా అగ్రశ్రేణి నాయకత్వం నుంచి ఓ సందేశం అందుకున్నారు. తన బృందంలోని అత్యున్నతమైన 30 మంది సహచరులను సమీకరించుకుని ఒడిశాలోని కోరాపుట్ కు బయలుదేరాలనేది దాని సారాంశం.

మంగళ్ ముదియా బృందానికి మొదట్లో ఈ ప్రణాళిక ఎంత పెద్దదో తెలియదు. పై నుంచి ఆదేశాలు వచ్చాయి. వారు తూచా తప్పకుండా పాటించారు. ముదియా 19 సంవత్సరాల చిన్న వయస్సులోనే దక్షిణ బస్తర్ దట్టమైన అడవులలో పూర్వపు పీపుల్స్ వార్ గ్రూప్(పీడబ్ల్యూజీ) ఏరియా కమాండర్ గా ఉన్నాడు. ఆయన ఆశల్లా ఒకటే సాయుధ విప్లవాన్ని తీసుకురావాలి అంతే.

ముదియా బాధ్యతలు తీసుకున్న తన స్థావరం గంగలూర్. అది నేటీ బీజాపూర్ జిల్లాలో ఉంది. అక్కడ నుంచి పశ్చిమ ఒడిశాలోని కోరాపుట్ దాదాపు 265 కిలోమీటర్ల దూరంలో ఉంది.
కానీ దండకారణ్యం(రాముడు 13 సంవత్సరాలు ఇక్కడే వనవాసాన్ని గడిపినట్లు చెప్పబడే అడవులు) క్లిష్టమైన భూభాగంతో ఉంటుంది. దాని గుండా ట్రెక్కింగ్ చేయడం కూడా చాలా చాలా కష్టమైనది. కానీ సాయుధ విప్లవం తీసుకురావాలనే వారి ఆశయం ఈ కష్టాన్ని అధిగమించేలా చేసింది. 

శ్రీ రాముడు 13 సంవత్సరాల పాటు వనవాసం జరిపాడనే పేరున్న దండకారణ్యం మావోయిస్టులకు కేంద్రం

పరిపూర్ణతకు ప్రణాళిక..
ఈ మార్గం ఎంతో కష్టమైనదో మాటల్లో చెప్పలేము. వారు తమ మార్గంలో అనేకసార్లు వివేకం ప్రదర్శించాల్సి వచ్చింది. మార్గమాధ్యలో చాలా పనులు చేశారు. వారు మొదట బస్తర్ లోని సుక్మా జిల్లాలోని కొంటాకు వరకూ కాలినడకన వచ్చారు.
రెండో దశలో పీడబ్ల్యూజీ బలమైన ఉనికిని కలిగి ఉన్న బాసగుడ, జాగర్గొండ అడవులకు చేరుకున్నారు. మూడో దశలో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణం, శ్రీకాకుళం వైపు వెళ్లారు.
‘‘మేము అగ్ర నాయకుల ఆదేశాల కోసం రెండు నెలల అక్కడే వేచి ఉన్నాము. ప్రతిరోజు ప్రణాళికను రిహర్సల్ చేస్తూ వచ్చాము. మేము దోచుకునే మందుగుండు సామగ్రి, ఆయుధాలతో దాడి తరువాత తప్పించుకోవడానికి ప్రణాళిక వేసుకుంటూ ఉన్నాము’’ అని 41 ఏళ్ల ముదియా చెప్పారు.  ఈ రోజు తన మాతృభాష మాడియా యాసతో హిందీలో మాట్లాడుతూ గతాన్ని గుర్తు చేసుకున్నాడు. నీల రంగు చెక్ షర్ట్, ముదురు నీలం రంగు ప్యాంటు ధరించి ఉన్న ముదియా, తన వయస్సు కన్నా పెద్దవాడిలా కనిపిస్తున్నాడు.
ముదయా గ్రూప్ తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి నెలల సమయం పట్టింది. వారు దారిలో వారు శిక్షణ పొందారు. విశ్రాంతి తీసుకున్నారు. స్థానిక గిరిజనులతో వారి కదలిక గురించి మాట్లాడుకున్నారు. ‘‘దీనికి చాలా ఓపిక అవసరం’’ అని ఆయన చెప్పారు. 


మార్గ నిర్దేశం..

శ్రీకలువాంలో ఇతర బృందాలు కూడా చేరుకున్నాయని వారు రోజుల తరబడి తిరిగి సెకండ్ హ్యాండ్ వాహానాలను కొనుగోలు చేశారని ఆయన చెప్పారు. ఒక ట్రక్కు, ఒక కమాండర్ జీపు, రెండు 307 టెంపో మెటాడోర్లు కొన్ని టూవీలర్లు తీసుకున్నారు.
శ్రీకాకుళం నుంచి ముదియా బృందం బయలుదేరింది. జీపులో తన గ్రూపుతో కోరాపుట్ బయల్దేరారు. అంతా పౌర దుస్తులు ధరించారు. కానీ అందరి దగ్గర ఆయుధాలు ఉన్నాయి.
అప్పటికే వారికి తమ ప్రణాళిక, తప్పించుకునే మార్గం గురించి తెలుసు. వారి లక్ష్యం కోరాపుట్ పోలీస్ ఆయుధ శాల, వారి చర్య జిల్లా పోలీస్ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి సాహసోపేతంగా దోచుకోవాలి.
2004 సెప్టెంబర్ లో నక్సలైట్ల కొత్త సంస్థ అయిన సీపీఐ(మావోయిస్టు) పీడబ్ల్యూజీ, మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ (ఎంసీసీ) విలీనానికి కొన్ని నెలల ముందు ఈ సాయుధ సంఘటన జరిగింది.
ఇది సాయుధ ఉద్యమ చరిత్రలో రక్తపాత అధ్యాయాన్ని ప్రారంభించింది. ఈ దోపిడి గెరిల్లాలు భారతదేశంపై దీర్ఘకాలిక యుద్ధానికి ఆయుధాలు, మందుగుండు సామగ్రి సేకరించడానికి సహాయపడింది.
లొంగుబాటు..
నిషేధిత సంస్థ నుంచి ముదియా చాలాకాలం బయట ఉన్నాడు. 19 సంవత్సరాలు ఆయన సాయుధ గెరిల్లాగా పనిచేశాడు. చివరగా ఆయుధాలను వదులుకుని 2020 లో బీజాపూర్ పోలీసుల ముందు లొంగిపోయాడు.
ముదియా నేడు చత్తీస్ గఢ్ లోని డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ)లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ఇది రాష్ట్రంలో నక్సల్స్ వ్యతిరేక దళంగా పనిచేస్తుంది. ముదియాకు ఇక్కడ కొన్ని పనులు అప్పగించారు.
అరెస్ట్ అయిన లేదా చంపబడిని మావోయిస్టుల నుంచి కరపత్రాలు, సర్క్యూలర్ల అనువాదాలలో సహకారం, కొన్నిసార్లు విచారణ సమయంలో జోక్యం చేసుకోవడం.
బస్తర్ లో సాయుధ ఉద్యమంలో మలుపు తిప్పడంలో కీలకపాత్ర పోషించిన లొంగిపోయిన కార్యకర్తలలో ముదియా కూడా ఒకరు. ఏడుగురు అన్నదమ్ములలో ఒకరైన ముదియా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు.
ఈ కమిటీ ఇటీవల మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ , ఒడిశాలోని మధ్య భారత రెడ్ జోన్ ప్రాంతాలపై ఆధిపత్యం చెలాయించిన మావోయిస్టుల డివిజనల్ కమిటీ. కానీ ముదియా కార్యాచరణ ప్రాంతం మాత్రం బస్తర్ డివిజన్ ఎక్కువగా, కొంచెం బీజాపూర్ లో ఉండేది. 

నారాయణపూర్ లోని శాంతి కుంజ్ కాలనీలో లొంగిపోయిన మావోయిస్టులు, వారికి పునరావాసం కల్పించడానికి ఏర్పాటు చేశారు.

బసవరాజు ఆలోచన..
‘‘పార్టీ విలీనం ప్రారంభదశలో, మేము పోలీస్ స్టేషన్లపై అనేక దాడులు చేసాము. కానీ కోరాపుట్ ఆయుధశాల కచ్చితంగా అతిపెద్దది. చాలా జాగ్రత్తగా ప్రణాళిక రచించాము’’ అని ముదియా చెప్పారు.
ఫిబ్రవరి 6, 2004 న వివిధ మండలాల నుంచి గుమిగూడిన దాదాపు వేయి మంది గెరిల్లాలు నిద్రాణ స్థితిలో ఉన్న ఒడిశా పట్టణంలో సమావేశమయ్యారు. సాహసోతమైన చర్యకు ముందు నెలల తరబడి వేరే చేసే ఇంద్రావతి నదికి పశ్చిమాన ఉన్న గడ్చిరోలి ప్రాంతాల నుంచి వచ్చారు.
2025 మే 21న నారాయణ్ పూర్ జిల్లాలోని అబుజ్ మడ్ ప్రాంతంలో జరిగిన మరణించిన మావోయిస్టు ప్రధాన కార్యదర్శి బసవరాజు అలియాస్ నంబల కేశవరావు ఈ మొత్తం ప్రణాళిక, అమలు రూపొందించారని ముదియా చెప్పారు. అప్పుడు బసవరాజు పీడబ్ల్యూజీ సైనిక విభాగానానికి నాయకత్వం వహించాడు.
అత్యంత కఠిన చర్య..
పది సంవత్సరాల క్రితం మహారాష్ట్ర పోలీసుల ముందు లొంగిపోయిన మాజీ డివిజనల్ కమిటీ సభ్యుడు జలంసే లాల్సే సద్మేక్ కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాడు. ‘‘నేను సెంట్రల్ గడ్చిరోలి నుంచి నా బృందంతో వెళ్లాను’’ అని 53 ఏళ్ల సద్మేక్ చెప్పారు.
తుపాకీ కాల్పుల పార్టీ సైనిక సభ్యుడిగా అడవుల్లో 20 సంవత్సరాలు గడిపిన సద్మేక్ ఇప్పుడు వివాహం చేసుకున్నాడు. గడ్చిరోలి పోలీస్ నక్సల్ సెల్ లో పనిచేస్తున్నాడు.
‘‘ఇది ఇప్పటి వరకూ అత్యంత కష్టతరమైన చర్య’’ అని ఆయన అన్నారు. దీనికి చాలా దూరం నడవడమే కాకుండా తిరుగు ప్రయాణంలో మందుగుండు సామగ్రితో ఉన్న బస్తాలను మోసుకొచ్చామని చెప్పారు.
సద్మేక్, ముదియా కంటే చాలా సీనియర్. వారు కలుసుకున్నారు.. పనిచేశారు. వారి సాయుధ ప్రతిఘటన వ్యర్థం అవడాన్ని కూడా ప్రత్యక్షంగా కూడా చూశారు. కొన్నిసార్లు తీవ్రతరం అవుతున్న భద్రతా కార్యకలాపాలను వ్యతిరేకంగా ధైర్యంగా సైనిక చర్యలు తీసుకోవడం ప్రారంభించారని, ఇక గెలిచే అవకాశం లేదని వారు గ్రహించారు. ఇక ఇద్దరు ఆలస్యం చేయకుండా పోలీసుల ముందు లొంగిపోయారు. 

19 సంవత్సరాలు సాయుధ గెరిల్లాగా పనిచేసిన తరువాత 2020 లో ఆయుధాలను విడిచిపెట్టి పోలీసుల ముందు లొంగిపోయిన మంగళ్ ముదియా, ప్రస్తుతం ఛత్తీస్ గఢ్ లోని డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్ లో నక్సల్స్ వ్యతిరేక దళంలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు

పోలీస్ తప్పిదం..
కోరాపుట్ చర్యలో మావోయిస్టు కేడర్ల చాలా తక్కువ లేదా అసలే ప్రతిఘటన ఎదుర్కోలేదని ముదియా గుర్తు చేసుకున్నాడు. ఒక పోలీస్ పెట్రోలింగ్ బృందం మాత్రమే ఏదో అనుమానంతో కోరాపుట్ వెళ్తున్న తను, కొంతమంది తిరుగుబాటుదారుల వాహానాన్ని ఆపి కొన్ని విచారణలు చేశారు. అయితే రూ. 2 వేలు లంచం ఇచ్చిన తరువాత వారు వదిలివేశారు. కొన్ని గంటల తరువాత ఒడిశా భయాందోళనలతో నిండిపోయింది.
అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న కోరాపుట్ ప్రాంతం రాత్రి 9 తరువాత భయంకరంగా మారిపోయింది. దాదాపు ఆరుగంటల పాటు జరిగిన ఆ ఆపరేషన్ ఒడిశాను, భారత్ లోని భద్రతా యంత్రాంగంలో ఎక్కువ మందిని నిర్ఘాంతపరిచింది.
పట్టణాన్ని చేరుకున్న తరువాత మావోయిస్టులు వేర్వేరు గ్రూపులుగా విడిపోయారు. చుట్టుపక్కల దుకాణాలను త్వరగా మూసివేసి పారిపోవాలని కోరుతూ పోలీస్ వ్యవస్థపై దాడి చేశారు.
తరువాత మావోలు విచక్షణరహితంగా కాల్పులు జరిపి, పారామిలిటరీ జవాన్లపై గ్రనెడ్లు విసురుతూ వారి ఆయుధ శాల, ఐదు పోలీస్ స్టేషన్లను దోచుకున్నారు. కోరాపుట్ జైలును బద్దలు కొట్టారు.
పోలీస్ సూపరింటెండెంట్(ఎస్పీ) కార్యాలయం, ఒడిశా రాష్ట్ర సాయుధ పోలీస్(ఓఎస్ఏపీ) బెటాలియన్ పై దాడి చేశారు. సమీపంలోని బ్యాంకు ఏటీఎం ట్రెజరీలో ఉన్న నైట్ గార్డ్ రైఫిల్ ను కూడా లాక్కుకున్నారు.
పరుగులు..
‘‘మేము జిల్లా ఆయుధశాలకు చేరుకున్నప్పుడూ దానికి ఒకే ఒక సెంట్రీ ఉన్నాడు. మేము అతన్ని న్యూట్రలైజ్ చేయాలి. అదే మా లక్ష్యం’’ అని ముదియా గుర్తు చేసుకున్నాడు.
ఆ సెంట్రీ నకుల్ నాయక్ తన ఆయుధంతో కాల్పులు జరిపాడు కానీ ఇంతపెద్ద సైన్యాన్ని ఎదుర్కోలేకపోయాడు. ఈ దాడిలో పౌరులు సహ మరో పదకొండు మంది మృతి చెందాడు.
కోరాపుట్ ఎస్పీ అరుణ్ బోత్రా మావోయిస్టుల దాడి చేయడానికి కొన్ని నిమిషాల ముందు తన కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయాడు. అతను తిరిగి పరుగెత్తుకుంటూ వచ్చి చూసినప్పుడూ ఆయుధాలను దోచుకున్నట్లు చూశాడు.
మావోయిస్టులు అతడిని చూసి పౌరుడిగా భావించి అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. కానీ ఎస్పీ ఒక ఇంటిపైకి ఎక్కి తన వ్యక్తిగత గార్డులతో కలిసి, తన పిస్టల్ తో కాల్పులు జరపడం ప్రారంభించాడు. కానీ ఇది పెద్దగా ఫలించలేదు. మావోయిస్టులు తమ తిరుగు ప్రయాణంలో కాకరిగుమ, లక్ష్మీపూర్, నారాయణపట్న పోలీస్ స్టేషన్లను కూడా దోచుకున్నారు. 

బీజాపూర్- జాగర్గొండ రహదారి నిర్మాణ సమయంలో మావోయిస్టుల దాడుల్లో మరణించిన జవాన్ల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన స్మారక చిహ్నం

అత్యంత కష్టతరమైన భాగం..
దాడి తరువాత పీపుల్స్ వార్ గ్రూప్ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ‘‘ఆయుధాలు, గ్రెనెడ్లు, మందుగుండు సామాగ్రి రూ. 50 కోట్ల విలువైనవి’’ ఉన్నాయని పేర్కొంది.
వారు దాదాపు 500 రకాల ఆయుధాలు(303 రైఫిల్స్, ఎల్ఎంజీ, ఎస్ఎల్ఆర్, మోర్టార్లు, స్టెన్ గన్లు, రివాల్వర్లు, పిస్టల్) దోచుకున్నారని 30 వేల రౌండ్ల బుల్లెట్లు, అనేక మోర్టార్ షెల్లు, గ్రెనేడ్లను దోచుకున్నారని ముదియా చెప్పారు.
‘‘చర్య తరువాత బస్తర్ పొరుగున ఉన్న అడవులలోని ముందుగా నిర్ణయించిన ప్రదేశాలలో మందుగుండు సామగ్రి, ఆయుధాలను పడవేసిన తరువాత మేము అన్ని వాహనాలను తగలబెట్టాము’’ అని ఆయన చెప్పారు.
‘‘ఈ చర్యలో కష్టతరమైన భాగం ఏమిటంటే దోపిడీని మా స్థావరాలకు తిరిగి తీసుకెళ్లడం ’’ అని ముదియా చెప్పారు. ‘‘రోజుల తరబడి వందల కిలోమీటర్ల తిరిగి నడిచి, ఆయుధాలను తెలివిగా తిరిగి తీసుకురావడం అంత సులభం కాదు’’ ని ఆయన చెప్పారు.
సంవత్సరం శ్రమ..
గడ్చిరోలిలో ఉన్న తన కార్యకర్తలతో రెండుసార్లు డంప్ సైట్ కు వెళ్లి వారి వంతు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తిరిగి తీసుకువచ్చానని సాద్మెక్ చెప్పారు. ‘‘ఆయుధాలు పొందడానికి మాకు ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ శ్రమ పట్టింది’’
‘‘ఈ చర్యలో ప్రతి భాగాన్ని నెలల తరబడి, ఓపికతో పరిపూర్ణంగా చేయడానికి ప్రణాళిక చేశాము’’ అని ముదియా చెప్పారు. బసవరాజు, అతని వ్యక్తిగత గార్డులు కోరాపుట్ కు అనేకసార్లు రెక్కి ట్రిప్పులు వేశారు.
సమర్థవంతమైన ట్రిప్పులు రూపొందించారు. తప్పించుకునే మార్గాలను రూపొందించారు. ఎదుర్కొబోయే ప్రమాదాలను కూడా పసిగట్టారు. ఇది ఈ కాలంలో ఉద్యమానికి ఊతం ఇచ్చిందని ఆయన చెప్పారు.
ఆ తరువాత వచ్చిన ఆయుధాలు, శిక్షణ దండకారణ్యం అంతటా మావోయిస్టుల సైనిక విభాగాన్ని బలోపేతం చేశాయి. ఇది పోలీసులపై అనేక అద్బుతమైన చర్యలకు దారితీసింది. 

నారాయణపూర్ కాలనీలో తన భార్య లచ్చందేవి కొర్రంతో కలిసి లొంగిపోయిన మావోయిస్టు, ప్రస్తుతం ఛత్తీస్ గఢ్ పోలీసులతో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రామ్ సింగ్ కొర్రమ్

స్థానిక మద్దతు..
గిరిజనులకు చివరకు న్యాయం లభిస్తుందనీ, వారు జల్, జంగిల్, జమీన్ ను చెక్కు చెదరకుండా ఉంచుతారనే భయం, నమ్మకం కారణంగా ఆయుధాలు వారికి స్థానిక మద్దతు ఇచ్చాయని ముదియా చెప్పారు.
దాదాపు ఇదే తరహలో మావోయిస్టులు ఫిబ్రవరి 2008 లో నయాగఢ్ జిల్లా పోలీస్ స్టేషన్లు, ఆయుధశాలపై దాడి చేసి దోచుకున్నారు. పట్టణాన్ని దాదాపుగా ముట్టడించారు.
ఈ చర్యలో 13 మంది పోలీసులు, ఒక సాధారణ పౌరుడు మరణించాడు. ఇక్కడ కూడా కోరాపుట్ తరహ సంఘటననే గుర్తుకు తెచ్చారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రి దోచుకున్నారు. ఇలాంటి సాహసోపేతమైన దోపిడీలు చాలా జరిగాయి.
సల్వాజుడుం ప్రభావం..
‘‘నేను అంతకుముందు లేదా తరువాత ఎవరిని చంపలేదు. అయినప్పటికీ నేను అనేక ఆకస్మిక దాడులు, చర్యలలో పాల్గొన్నాను’’ అని ముదియా చెప్పారు. అదే అతనిపై పార్టీ ఆగ్రహానికి కారణమైంది. ఇది ముదియాపై అంతర్గత విచారణలకు దారితీసింది.
‘‘సల్వాజుడుం సంవత్సరాల్లో (2005-2015) నేను చాలా కార్ మాట్ రక్తపాతం( మార్ కాట్) చూశాను’’ అని ఆయన అన్నారు. జుడుం సంవత్సరాల్లోనే మావోయిస్టులకు చాలా మద్దతు లభించింది.
అలాగే కొత్త కార్యకర్తలు కూడా కుప్పకుప్పలుగా వచ్చారని ఆయన పేర్కొన్నారు. ‘‘కానీ సంవత్సరాలు గడిచే కొద్ది నేను భ్రమల్లో మునిగిపోయాను. ప్రతిమారుమూలకు సెల్ ఫోన్లు చేరుకోవడంతో భిన్నమైన ప్రపంచం వచ్చింది. ’’ అని ముదియా చెప్పారు. మా సమస్యలు కరక్టే గానీ, మేము ఎంచుకున్న మార్గాలు తప్పు’’ 

ప్యాక్ చేసిన ఆహారం, ప్లాస్టిక్ బకెట్లు వంటి వస్తువులు, బస్తర్ లోని గిరిజన లోతట్టు ప్రాంతాలలోకి ప్రవేశించాయి. ఇవి బాహ్య ప్రపంచంలోని కనెక్ట్ అయ్యాయి.
Tags:    

Similar News